ఔను.. గుంటూరు జిల్లాలో ఈ మాటే వినిపిస్తోంది. “రెడ్డిగారు కనిపించడం లేదు. ఆయన రాజకీయం మాటేంటి? ” అని పలువురు చర్చించుకోవడం గమనార్హం. ఆయనే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. పార్టీలు మారిన ఫలితమో.. లేక వ్యూహం లేక పోవడమో.. ఇవన్నీ కాకుండా.. తాను పట్టిన కుందేలు కు మూడుకాళ్లే అన్నటైపులో రాజకీయాలు చేయడమో.. ఏదేమైనా.. మోదుగుల రాజకీయాలు ముందుకు సాగడం లేదు. తొలుత ఈయన రాజకీయం టీడీపీతో ప్రారంభమైంది.
ప్రస్తుతం వైసీపీ నాయకుడు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి స్వయానా బావమరిది అయిన.. మోదుగుల 2009లో టీడీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా పనిచేశారు. అయితే.. ఆయన వ్యాపారాల రీత్యా మంత్రి కావాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో పట్టుబట్టి.. ఎమ్మెల్సీ సీటును అదే పార్టీలో దక్కించుకున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఓడించి విజయం దక్కించుకున్నారు. కానీ, మంత్రి పదవి మాత్రం మోదుగులను వరించలేదు.
దీంతో 2018 నాటికి రెబల్గా మారి.. టీడీపీ పాలనపై విమర్శలు చేశారు. రెడ్డి సామాజిక వర్గం ఐక్యత గురించి.. అనేక సభలు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ బాట పట్టారు. దీంతో మరోసారి ఆయన ఎంపీగా గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత.. సీఎం జగన్ ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నారు. కానీ, అది కూడా దక్కలేదు. ఇక, ఆ తర్వాత నుంచి ఆయన కనిపించడం మానేశారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు టికెట్ల కోసం.. పార్టీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. చిన్న చితకా నాయకుల నుంచిసీనియర్ల వరకు టికెట్ రేసులో ముందున్నారు. కానీ, మోదుగుల మాట మాత్రం ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. మరి . ఆయన వ్యూహం ఏంటనేది చూడాలి. లేక, ఇక, రాజకీయాల నుంచి విరమించుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక పార్టీలో నిలబడక పోవడం.. తనకంటూ.. ప్రజలను చేరువ చేసుకోకపోవడం మైనస్లుగా మారాయనడంలో సందేహం లేదు.
This post was last modified on February 11, 2024 10:00 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…