Political News

వారి చెంప ప‌గ‌ల‌గొట్టండి.. ప్ర‌జ‌ల‌కు నాగ‌బాబు పిలుపు

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నటుడు నాగ‌బాబు.. వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌కుండా.. క‌నీసం రోడ్డు కూడా వేయ‌కుండా.. నాయ‌కులు ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నార‌ని విమ‌ర్శించారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లిలో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. “క‌నీసం ఒక్క రోడ్డు కూడా వేయ‌ని వైసీపీ నాయ‌కులు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు త‌యార‌య్యారు. ఓటువేయాలంటూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్ర‌జ‌లు వాళ్ల చెంప ప‌గ‌ల‌గొట్టి.. కాల‌ర్ ప‌ట్టుకుని, మాకు ఏం చేశారో చెప్పండి! అని నిల‌దీయాలి” అని నాగ‌బాబు పిలుపునిచ్చారు.

మంత్రిపై విమ‌ర్శ‌లు..

వైసీపీ నాయ‌కుడు, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌పైనా నాగ‌బాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో గంజాయి ర‌వాణాలో మంత్రి పాత్ర ఉంద‌ని.. అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గంజాయిని నిల్వ చేస్తున్న‌ట్టు అంద‌రూ చెబుతున్నారు. ఇలాంటి మంత్రి పేరు చెప్పాలంటేనే నోరు పాడైపోతుంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. వీళ్లా మంత్రులు? అంటూ.. నిల‌దీశారు. “రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికిన ఏజెన్సీ ప్రాంతాన్నే చూపిస్తున్నారు, ఇది చాలా బాధాకరం. కానీ, వాస్త‌వం ఏంటంటే అన‌కాప‌ల్లిలోనే గంజాయి నిల్వ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచే ఆ మంత్రి ప‌ర్య‌వేక్షిస్తున్నాడు” అని నాగ‌బాబు అన్నారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్యోగాలు

టీడీపీ-జ‌న‌సేన అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని నాగ‌బాబు అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌తి అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం ప‌రిధిలోనూ 500 మంది యువ‌తీయువ‌కుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని తెలిపారు. ఈ బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని నాగ‌బాబు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌న్నారు. తాము వ‌చ్చాక‌.. ర‌హ‌దారుల‌ను అద్దాల్లా తీర్చిదిద్దుతామ‌ని హామీ ఇచ్చారు.

“ఒక్క స‌మీక్ష అయినా పెట్టాడా? రాష్ట్రంలో ఈ నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో 35 వేల మంది యువ‌తులు, మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యారు. వీరిలో 25 వేల మంది మ‌హిళ‌ల జాడ ఇప్ప‌టికీ క‌నిపించ‌డం లేదు. ఈ ముఖ్య‌మంత్రికి ఇవేవీ క‌నిపించ‌డం లేదు” అని నాగ‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

31 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

40 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago