వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. “అవును.. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారు“ అని వ్యాఖ్యానించారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని చెప్పారు. అయితే.. ఈ పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలే నని అన్నారు. అయితే.. కేంద్ర స్థాయిలో ఎన్డీయేని బలోపేతం చేయాలని నిర్ణయించుకు న్నట్టు షా తెలిపారు. 400 స్థానాలు దక్కించుకుని మరోసారి విజయం సాధించాలని నిర్ణయించామన్నారు.
ఈ క్రమంలో కలిసి వచ్చేవారితో కలిసి ముందుకు సాగుతామన్నారు. దీనిలో ఏపీ మిత్రులు కూడా ఉన్నారని.. అయితే.. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో సమాచారం రావాల్సి ఉందన్నారు. “కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది. కానీ, రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిది“ అని షా అన్నారు. అంతేకాదు.. బీజేపీతో కలిసిఉంటామని వచ్చిన వారికి తాము ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరిచామన్నారు. కొందరు తమను వదులుకుని వెళ్లారని.. తాము వారిని కాదని అనుకోలేదని వ్యాఖ్యానించారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తాయన్నారు.
ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల కిందట ఢిల్లీలో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్షా.. సహా ఇతర నేతలను రహస్యంగా కలిసి వచ్చారు. పొత్తులు, సీట్ల పంపకాలపై వారితో చర్చించినట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి పూర్తిస్థాయి సమాచారం రాలేదు. కానీ, తాజాగా అమిత్షా చేసిన వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తుకు బీజేపీ దాదాపు మానసికంగా రెడీ అయినట్టుగానే ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…