వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. “అవును.. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారు“ అని వ్యాఖ్యానించారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని చెప్పారు. అయితే.. ఈ పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలే నని అన్నారు. అయితే.. కేంద్ర స్థాయిలో ఎన్డీయేని బలోపేతం చేయాలని నిర్ణయించుకు న్నట్టు షా తెలిపారు. 400 స్థానాలు దక్కించుకుని మరోసారి విజయం సాధించాలని నిర్ణయించామన్నారు.
ఈ క్రమంలో కలిసి వచ్చేవారితో కలిసి ముందుకు సాగుతామన్నారు. దీనిలో ఏపీ మిత్రులు కూడా ఉన్నారని.. అయితే.. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో సమాచారం రావాల్సి ఉందన్నారు. “కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది. కానీ, రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిది“ అని షా అన్నారు. అంతేకాదు.. బీజేపీతో కలిసిఉంటామని వచ్చిన వారికి తాము ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరిచామన్నారు. కొందరు తమను వదులుకుని వెళ్లారని.. తాము వారిని కాదని అనుకోలేదని వ్యాఖ్యానించారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తాయన్నారు.
ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల కిందట ఢిల్లీలో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్షా.. సహా ఇతర నేతలను రహస్యంగా కలిసి వచ్చారు. పొత్తులు, సీట్ల పంపకాలపై వారితో చర్చించినట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి పూర్తిస్థాయి సమాచారం రాలేదు. కానీ, తాజాగా అమిత్షా చేసిన వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తుకు బీజేపీ దాదాపు మానసికంగా రెడీ అయినట్టుగానే ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…