వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. “అవును.. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారు“ అని వ్యాఖ్యానించారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని చెప్పారు. అయితే.. ఈ పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలే నని అన్నారు. అయితే.. కేంద్ర స్థాయిలో ఎన్డీయేని బలోపేతం చేయాలని నిర్ణయించుకు న్నట్టు షా తెలిపారు. 400 స్థానాలు దక్కించుకుని మరోసారి విజయం సాధించాలని నిర్ణయించామన్నారు.
ఈ క్రమంలో కలిసి వచ్చేవారితో కలిసి ముందుకు సాగుతామన్నారు. దీనిలో ఏపీ మిత్రులు కూడా ఉన్నారని.. అయితే.. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో సమాచారం రావాల్సి ఉందన్నారు. “కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది. కానీ, రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిది“ అని షా అన్నారు. అంతేకాదు.. బీజేపీతో కలిసిఉంటామని వచ్చిన వారికి తాము ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరిచామన్నారు. కొందరు తమను వదులుకుని వెళ్లారని.. తాము వారిని కాదని అనుకోలేదని వ్యాఖ్యానించారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తాయన్నారు.
ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల కిందట ఢిల్లీలో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్షా.. సహా ఇతర నేతలను రహస్యంగా కలిసి వచ్చారు. పొత్తులు, సీట్ల పంపకాలపై వారితో చర్చించినట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి పూర్తిస్థాయి సమాచారం రాలేదు. కానీ, తాజాగా అమిత్షా చేసిన వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తుకు బీజేపీ దాదాపు మానసికంగా రెడీ అయినట్టుగానే ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…