వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. “అవును.. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారు“ అని వ్యాఖ్యానించారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని చెప్పారు. అయితే.. ఈ పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలే నని అన్నారు. అయితే.. కేంద్ర స్థాయిలో ఎన్డీయేని బలోపేతం చేయాలని నిర్ణయించుకు న్నట్టు షా తెలిపారు. 400 స్థానాలు దక్కించుకుని మరోసారి విజయం సాధించాలని నిర్ణయించామన్నారు.
ఈ క్రమంలో కలిసి వచ్చేవారితో కలిసి ముందుకు సాగుతామన్నారు. దీనిలో ఏపీ మిత్రులు కూడా ఉన్నారని.. అయితే.. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో సమాచారం రావాల్సి ఉందన్నారు. “కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది. కానీ, రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిది“ అని షా అన్నారు. అంతేకాదు.. బీజేపీతో కలిసిఉంటామని వచ్చిన వారికి తాము ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరిచామన్నారు. కొందరు తమను వదులుకుని వెళ్లారని.. తాము వారిని కాదని అనుకోలేదని వ్యాఖ్యానించారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తాయన్నారు.
ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల కిందట ఢిల్లీలో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్షా.. సహా ఇతర నేతలను రహస్యంగా కలిసి వచ్చారు. పొత్తులు, సీట్ల పంపకాలపై వారితో చర్చించినట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి పూర్తిస్థాయి సమాచారం రాలేదు. కానీ, తాజాగా అమిత్షా చేసిన వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తుకు బీజేపీ దాదాపు మానసికంగా రెడీ అయినట్టుగానే ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…