Political News

పొత్తులపై కామెంట్లు చేసే జనసేన నేతలకు పవన్ వార్నింగ్

ఏపీలో త్వరలో జరగబోతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు మొదలు అనేక విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, టీడీపీ జనసేనలతో బిజెపి కూడా కలిసే అవకాశాలపై ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు మంతనాలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల వ్యవహారం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పొత్తులపై జనసేన పార్టీ శ్రేణులు ఎటువంటి విమర్శలు చేయొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తుల గురించి వ్యాఖ్యలు చేయవద్దని పవన్ కోరారు. జనహితం కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని పవన్ చెప్పారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని పవన్ స్పష్టం చేశారు. పొత్తులకు సంబంధించి కీలకమైన చర్చలు జరుగుతున్న సందర్భంలో భావోద్వేగాలతో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎటువంటి కామెంట్లు చేయవద్దని పవన్ సూచించారు. ఆ రకమైన వ్యాఖ్యలు, ప్రకటనలు చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అన్నారు.

ఒకవేళ ఏమైనా అభిప్రాయాలు, సందేహాలు ఉంటే జనసేన రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ దృష్టికి తీసుకురావాలని పవన్ సూచించారు. ఆ రకంగా తమ ఆలోచనలను, సలహాలను, భావోద్వేగాలను పార్టీకి చేరవేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇక, పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేసిన నాయకుల నుంచి వివరణ కోరుతున్నామని చెప్పారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, పొత్తులపై చర్చలు జరుగుతున్న ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.

This post was last modified on February 10, 2024 3:52 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

4 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

5 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

5 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

9 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

9 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

9 hours ago