Political News

పొత్తులపై కామెంట్లు చేసే జనసేన నేతలకు పవన్ వార్నింగ్

ఏపీలో త్వరలో జరగబోతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు మొదలు అనేక విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, టీడీపీ జనసేనలతో బిజెపి కూడా కలిసే అవకాశాలపై ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు మంతనాలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల వ్యవహారం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పొత్తులపై జనసేన పార్టీ శ్రేణులు ఎటువంటి విమర్శలు చేయొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తుల గురించి వ్యాఖ్యలు చేయవద్దని పవన్ కోరారు. జనహితం కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని పవన్ చెప్పారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని పవన్ స్పష్టం చేశారు. పొత్తులకు సంబంధించి కీలకమైన చర్చలు జరుగుతున్న సందర్భంలో భావోద్వేగాలతో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎటువంటి కామెంట్లు చేయవద్దని పవన్ సూచించారు. ఆ రకమైన వ్యాఖ్యలు, ప్రకటనలు చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అన్నారు.

ఒకవేళ ఏమైనా అభిప్రాయాలు, సందేహాలు ఉంటే జనసేన రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ దృష్టికి తీసుకురావాలని పవన్ సూచించారు. ఆ రకంగా తమ ఆలోచనలను, సలహాలను, భావోద్వేగాలను పార్టీకి చేరవేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇక, పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేసిన నాయకుల నుంచి వివరణ కోరుతున్నామని చెప్పారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, పొత్తులపై చర్చలు జరుగుతున్న ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.

This post was last modified on February 10, 2024 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

59 minutes ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

2 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

3 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

3 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

5 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

5 hours ago