Political News

రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠ

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే విజెలన్స్ విచారణలో తేలింది. ఈ విచారణను మరింత ముందుకు తీసుకెళ్ళటంలో ప్రభుత్వం ఏమిచేస్తుందన్న విషయం ఎవరికీ అంతుబట్టడంలేదు. విజిలెన్స్ విచారణలో అవినీతికి ప్రాధమిక సాక్ష్యాలను సేకరించిన ప్రభుత్వం తర్వాత స్టెప్ గా జ్యుడీషియల్ విచారణ చేయించబోతోందనే ప్రచారం పెరిగుతోంది. జ్యుడీషియల్ విచారణ జరిపించి తప్పుచేసిన వారిపై పర్ఫెక్టుగా చర్యలు తీసుకోవచ్చన్నది రేవంత్ ఆలోచనగా కనబడుతోంది.

ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి బట్టబయలైన తర్వాత ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న మురళీధరరావు, నల్లా వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం ఉధ్వాసన పలికింది. మరళి దగ్గర రాజీనామా తీసుకున్న ప్రభుత్వం నల్లాను విధుల నుండి తొలగించింది. నిజానికి వీళ్ళిద్దరు రిటైర్ అయిపోయారు. అయితే కేసీయార్ ప్రభుత్వం వీళ్ళకి అదే పోస్టుల్లో రీ అపాయింట్మెంట్ ఇచ్చి కంటిన్యు చేయించింది. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిలో వీళ్ళకి కూడా బాధ్యత ఉందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

ఇపుడు సమస్య ఏమిటంటే జరిగిన అవినీతిని ఎవరి నుండి రికవరీ చేయాలి ? లేదా ఎవరిని బాధ్యులను చేసి యాక్షన్ తీసుకోవాలి అని. మామూలుగా అయితే రికవరీ సాధ్యంకాదు. ఎందుకంటే వేలకోట్ల రూపాయల అవినీతిని నిరూపించటమూ సాధ్యంకాదు, అంత డబ్బును రికవరీ చేయటం అంతకన్నా చాలా కష్టమని అందరికీ తెలిసిందే. మరిపుడు ప్రభుత్వం ఏమిచేయాలి ? అవినీతి జరిగిందని తెలిసినా అక్రమార్కులను అలా వదిలేయాల్సిందేనా ?

రెండో ఆప్షన్ ఏమిటంటే బాధ్యులని తేలిన వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలి ? ఇదికూడా ఏమంత తేలికైన విషయం కాదు. విచారణ కమిటీలు అవినీతిపరులని తేల్చిన వాళ్ళల్లో ఎక్కువమంది ఉన్నతాధికారులే ఉంటారు. మరి వీళ్ళకి అడ్డదిడ్డమైన ఆదేశాలిచ్చి అవినీతికి చేయించి, పాల్పడిన రాజకీయ నేతల మాటేమిటి ? వాళ్ళపై ఎవరు చర్యలు తీసుకోవాలి ? ఇపుడు కాళేశ్వరమే తీసుకుంటే ఇందులో వేల కోట్ల రూపాయలు తినేశారని కేసీయార్ కుటుంబంపై రేవంత్ అండ్ కో చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి రేపు కేసీయార్ పై ప్రభుత్వం యాక్షన్ తీసుకోగలదా ?

This post was last modified on February 10, 2024 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago