Political News

ఐదేళ్ల పాల‌న త‌ర్వాత కూడా.. వైఎస్ బొమ్మ వాడుకుంటారా?

ఏపీ అధికార పార్టీ వైసీపీపై వైఎస్ ఆత్మ‌గా రాజ‌కీయాల్లో గుర్తింపు పొందిన మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కేవీపీ రామచంద్ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐదేళ్ల త‌ర్వాత కూడా ఇంకా వైఎస్ బొమ్మ‌ను వాడుకుంటారా? అని ఆయ‌న నిల‌దీశారు. “ప‌థ‌కాలు అమ‌లు చేశాం.. సంక్షేమం అమ‌లు చేశాం. ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి మ‌రీ.. ప్ర‌జ‌ల‌కు పంచామ‌ని చెబుతున్న వైసీపీ ఇంకా వైఎస్ ఫొటోతోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల డం ఎందుకు? ఇలా చేస్తున్నందుకు జ‌గ‌న్ సిగ్గుప‌డాలి” అని కేవీపీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీకి వెళ్లి ఏం తెచ్చారు?

ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనేన‌ని కేవీపీ వ్యాఖ్యానించారు. కానీ.. వెళ్లిన ప్ర‌తిసారీ ట్రావెలింగ్ చార్జీలు దండ‌గ అవుతున్నాయే త‌ప్ప‌.. ఒరిగింది.. ఈరాష్ట్రానికితెచ్చింది ఏంటని ఆయ‌న నిల‌దీశారు. జ‌గ‌న్ ప్ర‌యాణ ఖ‌ర్చులు ల‌క్ష‌ల్లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ సొమ్ముతో ప‌ది కిలో మీట‌ర్ల రోడ్డు వేయొచ్చ‌న్నారు. ఇసుక, మద్యం కుంభకోణాల్లో దేశంలో చాలా మంది నేతలను అరెస్టు చేశారని. ఏపీలోని నేతలను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్ర‌శ్నించారు.

బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా? అని స‌టైర్లు వేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఇంత అవినీతి జ‌రుగుతున్నా.. ఏ మంత్రి పైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు పెట్టలేదో బీజేపీ చెప్పాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఏపీలో విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం అక్ర‌మ‌ విక్రయాలు జరుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఈడీ ఏపీలో మంత్రులను ఎందుకు వదిలేసిందన్నారు.

పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం…ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందని దుయ్య‌బ‌ట్టారు. పోలవరం బ్యారేజీలా మిగిలిపోకూడదన్న ఆయన కేంద్రం నుంచి ఏం సాధించుకొని వచ్చారో చెప్పాలన్నారు. సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. సీట్ల పంపకం, స్వీట్లు పంచుకోవడం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి జ‌గ‌న్‌కు ప‌ట్ట‌డం లేద‌న్నారు.

This post was last modified on February 10, 2024 8:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హృతిక్ చేస్తోంది చాలా పెద్ద రిస్కు

నిన్న క్రిష్ 4 ప్రకటన వచ్చింది. రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రాలు సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం బడ్జెట్…

4 minutes ago

లోకేశ్ స్పీచ్.. క్లెమోర్ మైన్లు, కామెడీ పీసులు, గుండె పోట్లు

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. టీడీపీ…

34 minutes ago

నాగవంశీకి అవసరం పడని సింపతీ కార్డ్

ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో…

2 hours ago

వైసీపీలో.. చాలా మందే ఉన్నార‌ట‌.. !

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నపై ఇప్ప‌టికి మూడు కేసులు న‌మో ద‌య్యాయి.…

2 hours ago

చిరు – రావిపూడి కోసం బాలీవుడ్ భామలు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు జరగనుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య…

2 hours ago

ఆ ‘సంచలనం’ పుట్టి నేటికి 43 ఏళ్లు

తెలుగు దేశం పార్టీ... భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో…

3 hours ago