Political News

ఐదేళ్ల పాల‌న త‌ర్వాత కూడా.. వైఎస్ బొమ్మ వాడుకుంటారా?

ఏపీ అధికార పార్టీ వైసీపీపై వైఎస్ ఆత్మ‌గా రాజ‌కీయాల్లో గుర్తింపు పొందిన మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కేవీపీ రామచంద్ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐదేళ్ల త‌ర్వాత కూడా ఇంకా వైఎస్ బొమ్మ‌ను వాడుకుంటారా? అని ఆయ‌న నిల‌దీశారు. “ప‌థ‌కాలు అమ‌లు చేశాం.. సంక్షేమం అమ‌లు చేశాం. ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి మ‌రీ.. ప్ర‌జ‌ల‌కు పంచామ‌ని చెబుతున్న వైసీపీ ఇంకా వైఎస్ ఫొటోతోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల డం ఎందుకు? ఇలా చేస్తున్నందుకు జ‌గ‌న్ సిగ్గుప‌డాలి” అని కేవీపీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీకి వెళ్లి ఏం తెచ్చారు?

ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనేన‌ని కేవీపీ వ్యాఖ్యానించారు. కానీ.. వెళ్లిన ప్ర‌తిసారీ ట్రావెలింగ్ చార్జీలు దండ‌గ అవుతున్నాయే త‌ప్ప‌.. ఒరిగింది.. ఈరాష్ట్రానికితెచ్చింది ఏంటని ఆయ‌న నిల‌దీశారు. జ‌గ‌న్ ప్ర‌యాణ ఖ‌ర్చులు ల‌క్ష‌ల్లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ సొమ్ముతో ప‌ది కిలో మీట‌ర్ల రోడ్డు వేయొచ్చ‌న్నారు. ఇసుక, మద్యం కుంభకోణాల్లో దేశంలో చాలా మంది నేతలను అరెస్టు చేశారని. ఏపీలోని నేతలను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్ర‌శ్నించారు.

బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా? అని స‌టైర్లు వేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఇంత అవినీతి జ‌రుగుతున్నా.. ఏ మంత్రి పైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు పెట్టలేదో బీజేపీ చెప్పాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఏపీలో విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం అక్ర‌మ‌ విక్రయాలు జరుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఈడీ ఏపీలో మంత్రులను ఎందుకు వదిలేసిందన్నారు.

పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం…ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందని దుయ్య‌బ‌ట్టారు. పోలవరం బ్యారేజీలా మిగిలిపోకూడదన్న ఆయన కేంద్రం నుంచి ఏం సాధించుకొని వచ్చారో చెప్పాలన్నారు. సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. సీట్ల పంపకం, స్వీట్లు పంచుకోవడం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి జ‌గ‌న్‌కు ప‌ట్ట‌డం లేద‌న్నారు.

This post was last modified on February 10, 2024 8:14 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ…

1 hour ago

నోరు జారిన కేటీఆర్‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈసీ ఆదేశం!

తెలంగాణ ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని వారాల కింద‌ట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం…

4 hours ago

దేశం విడిచి పారిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి… ఇదిగో క్లారిటీ!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నార‌ని.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం లేద‌ని..…

6 hours ago

మూడో భారతీయుడు షాక్ ఇస్తాడా

అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…

12 hours ago

‘మండి’లో ‘కంగు’మంటుందా ? ‘కంగు’తింటుందా ?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని…

14 hours ago

నెత్తుటి పాటతో ‘దేవర’ జాతర

https://www.youtube.com/watch?v=CKpbdCciELk జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర పాటల సందడి మొదలైపోయింది. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘమైన…

14 hours ago