Political News

ఐదేళ్ల పాల‌న త‌ర్వాత కూడా.. వైఎస్ బొమ్మ వాడుకుంటారా?

ఏపీ అధికార పార్టీ వైసీపీపై వైఎస్ ఆత్మ‌గా రాజ‌కీయాల్లో గుర్తింపు పొందిన మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కేవీపీ రామచంద్ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐదేళ్ల త‌ర్వాత కూడా ఇంకా వైఎస్ బొమ్మ‌ను వాడుకుంటారా? అని ఆయ‌న నిల‌దీశారు. “ప‌థ‌కాలు అమ‌లు చేశాం.. సంక్షేమం అమ‌లు చేశాం. ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి మ‌రీ.. ప్ర‌జ‌ల‌కు పంచామ‌ని చెబుతున్న వైసీపీ ఇంకా వైఎస్ ఫొటోతోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల డం ఎందుకు? ఇలా చేస్తున్నందుకు జ‌గ‌న్ సిగ్గుప‌డాలి” అని కేవీపీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీకి వెళ్లి ఏం తెచ్చారు?

ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనేన‌ని కేవీపీ వ్యాఖ్యానించారు. కానీ.. వెళ్లిన ప్ర‌తిసారీ ట్రావెలింగ్ చార్జీలు దండ‌గ అవుతున్నాయే త‌ప్ప‌.. ఒరిగింది.. ఈరాష్ట్రానికితెచ్చింది ఏంటని ఆయ‌న నిల‌దీశారు. జ‌గ‌న్ ప్ర‌యాణ ఖ‌ర్చులు ల‌క్ష‌ల్లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ సొమ్ముతో ప‌ది కిలో మీట‌ర్ల రోడ్డు వేయొచ్చ‌న్నారు. ఇసుక, మద్యం కుంభకోణాల్లో దేశంలో చాలా మంది నేతలను అరెస్టు చేశారని. ఏపీలోని నేతలను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్ర‌శ్నించారు.

బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా? అని స‌టైర్లు వేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఇంత అవినీతి జ‌రుగుతున్నా.. ఏ మంత్రి పైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు పెట్టలేదో బీజేపీ చెప్పాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఏపీలో విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం అక్ర‌మ‌ విక్రయాలు జరుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఈడీ ఏపీలో మంత్రులను ఎందుకు వదిలేసిందన్నారు.

పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం…ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందని దుయ్య‌బ‌ట్టారు. పోలవరం బ్యారేజీలా మిగిలిపోకూడదన్న ఆయన కేంద్రం నుంచి ఏం సాధించుకొని వచ్చారో చెప్పాలన్నారు. సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. సీట్ల పంపకం, స్వీట్లు పంచుకోవడం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి జ‌గ‌న్‌కు ప‌ట్ట‌డం లేద‌న్నారు.

This post was last modified on February 10, 2024 8:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago