ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఆయన ప్రధాన మంత్రి నరేం ద్ర మోడీతోను, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ అయ్యారు. అయితే.. ఎన్నికలకు ముందు జరిగిన.. అధికారిక పర్యటనపై ప్రభుత్వ వర్గాలు ఒక విధంగా చెబుతున్నాయి. రాజకీయ వర్గాల్లో మరో విధమైన చర్చసాగుతోంది. దీంతోఅసలు జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం చర్చించారనేది ఆసక్తిగా మారింది.
ముందుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే.. పెండింగులో ఉన్న ఏపీ సమస్యల పైనే సీఎం జగన్ దృష్టి పెట్టారని అంటున్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా, దీంతో పాటు విభజన చట్టంలోని హామీలపైనా సీఎం జగన్ చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుదల వంటి కీలక అంశాలపై చర్చించేందుకు వెళ్లారని అంటున్నారు.
అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం దీనికి భిన్నంగా వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ చర్చించి ఉంటారనేది వీరి వాదనగా ఉంది. ముఖ్యంగా పొత్తుల వ్యవహారంపై బీజేపీ దూకుడు పెంచిన దరిమిలా.. అలాంటి అవసరం ఎందుకన్న వాదనను సీఎం జగన్ ప్రస్తావించి ఉంటారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అంతేకాదు.. తాము పరోక్షంగా సహకరించే అవకాశాన్ని చర్చించారనేది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.
అదేసమయంలో బీజేపీ ఒంటరి పోరుకు దిగితే.. తమ సర్కారు మరోసారి వచ్చే అవకాశం ఉంటుందని.. తద్వారా.. తాము కేంద్రానికి సహకరిస్తామని పరోక్షంగా సీఎం జగన్ చెప్పి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టికెట్ల పంపిణీ వ్యవహారంతోపాటు.. వచ్చే ఎన్నికలలో తాము పెట్టుకున్న టార్గెట్, కాంగ్రెస్ వ్యవహార శైలి, ముఖ్యంగా తన సోదరి షర్మిల దూకుడు వంటి అంశాలను కూడా.. నేరుగా ప్రధానితోనే జగన్ చర్చించి ఉంటారనేది ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న చర్చ. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…