Political News

ఏపీకి తిరిగి వ‌చ్చిన జ‌గ‌న్‌.. మోడీతో ఏం చ‌ర్చించారు?

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఏపీకి తిరిగి వ‌చ్చారు. ఢిల్లీలో ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేం ద్ర మోడీతోను, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తోనూ భేటీ అయ్యారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన‌.. అధికారిక ప‌ర్య‌ట‌నపై ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఒక విధంగా చెబుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రో విధ‌మైన చ‌ర్చ‌సాగుతోంది. దీంతోఅస‌లు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఏం చ‌ర్చించార‌నేది ఆస‌క్తిగా మారింది.

ముందుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్న విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. పెండింగులో ఉన్న ఏపీ స‌మ‌స్య‌ల పైనే సీఎం జ‌గ‌న్ దృష్టి పెట్టార‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్న‌ ఏపీకి ప్రత్యేక హోదా, దీంతో పాటు విభజన చ‌ట్టంలోని హామీల‌పైనా సీఎం జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుద‌ల వంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చించేందుకు వెళ్లార‌ని అంటున్నారు.  

అయితే, రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం దీనికి భిన్నంగా వాద‌న వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్ చర్చించి ఉంటార‌నేది వీరి వాద‌న‌గా ఉంది. ముఖ్యంగా పొత్తుల వ్య‌వ‌హారంపై బీజేపీ దూకుడు పెంచిన ద‌రిమిలా.. అలాంటి అవ‌స‌రం ఎందుక‌న్న వాద‌న‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించి ఉంటార‌నేది ప్ర‌ధానంగా వినిపిస్తున్న మాట‌. అంతేకాదు.. తాము ప‌రోక్షంగా స‌హ‌క‌రించే అవ‌కాశాన్ని చ‌ర్చించార‌నేది టీడీపీ నేత‌ల నుంచి వినిపిస్తున్న మాట‌.

అదేస‌మ‌యంలో బీజేపీ ఒంట‌రి పోరుకు దిగితే.. త‌మ స‌ర్కారు మ‌రోసారి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా.. తాము కేంద్రానికి స‌హ‌క‌రిస్తామ‌ని ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ చెప్పి ఉంటార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తాము పెట్టుకున్న టార్గెట్‌, కాంగ్రెస్ వ్య‌వ‌హార శైలి, ముఖ్యంగా త‌న సోద‌రి ష‌ర్మిల దూకుడు వంటి అంశాల‌ను కూడా.. నేరుగా ప్ర‌ధానితోనే జ‌గ‌న్ చ‌ర్చించి ఉంటార‌నేది ప్ర‌తిపక్షాల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 9, 2024 9:05 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago