Political News

ఏపీకి తిరిగి వ‌చ్చిన జ‌గ‌న్‌.. మోడీతో ఏం చ‌ర్చించారు?

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఏపీకి తిరిగి వ‌చ్చారు. ఢిల్లీలో ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేం ద్ర మోడీతోను, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తోనూ భేటీ అయ్యారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన‌.. అధికారిక ప‌ర్య‌ట‌నపై ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఒక విధంగా చెబుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రో విధ‌మైన చ‌ర్చ‌సాగుతోంది. దీంతోఅస‌లు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఏం చ‌ర్చించార‌నేది ఆస‌క్తిగా మారింది.

ముందుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్న విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. పెండింగులో ఉన్న ఏపీ స‌మ‌స్య‌ల పైనే సీఎం జ‌గ‌న్ దృష్టి పెట్టార‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్న‌ ఏపీకి ప్రత్యేక హోదా, దీంతో పాటు విభజన చ‌ట్టంలోని హామీల‌పైనా సీఎం జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుద‌ల వంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చించేందుకు వెళ్లార‌ని అంటున్నారు.  

అయితే, రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం దీనికి భిన్నంగా వాద‌న వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్ చర్చించి ఉంటార‌నేది వీరి వాద‌న‌గా ఉంది. ముఖ్యంగా పొత్తుల వ్య‌వ‌హారంపై బీజేపీ దూకుడు పెంచిన ద‌రిమిలా.. అలాంటి అవ‌స‌రం ఎందుక‌న్న వాద‌న‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించి ఉంటార‌నేది ప్ర‌ధానంగా వినిపిస్తున్న మాట‌. అంతేకాదు.. తాము ప‌రోక్షంగా స‌హ‌క‌రించే అవ‌కాశాన్ని చ‌ర్చించార‌నేది టీడీపీ నేత‌ల నుంచి వినిపిస్తున్న మాట‌.

అదేస‌మ‌యంలో బీజేపీ ఒంట‌రి పోరుకు దిగితే.. త‌మ స‌ర్కారు మ‌రోసారి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా.. తాము కేంద్రానికి స‌హ‌క‌రిస్తామ‌ని ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ చెప్పి ఉంటార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తాము పెట్టుకున్న టార్గెట్‌, కాంగ్రెస్ వ్య‌వ‌హార శైలి, ముఖ్యంగా త‌న సోద‌రి ష‌ర్మిల దూకుడు వంటి అంశాల‌ను కూడా.. నేరుగా ప్ర‌ధానితోనే జ‌గ‌న్ చ‌ర్చించి ఉంటార‌నేది ప్ర‌తిపక్షాల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 9, 2024 9:05 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

36 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

43 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

56 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

59 minutes ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

2 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago