Political News

ఏపీకి తిరిగి వ‌చ్చిన జ‌గ‌న్‌.. మోడీతో ఏం చ‌ర్చించారు?

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఏపీకి తిరిగి వ‌చ్చారు. ఢిల్లీలో ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేం ద్ర మోడీతోను, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తోనూ భేటీ అయ్యారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన‌.. అధికారిక ప‌ర్య‌ట‌నపై ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఒక విధంగా చెబుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రో విధ‌మైన చ‌ర్చ‌సాగుతోంది. దీంతోఅస‌లు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఏం చ‌ర్చించార‌నేది ఆస‌క్తిగా మారింది.

ముందుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్న విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. పెండింగులో ఉన్న ఏపీ స‌మ‌స్య‌ల పైనే సీఎం జ‌గ‌న్ దృష్టి పెట్టార‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్న‌ ఏపీకి ప్రత్యేక హోదా, దీంతో పాటు విభజన చ‌ట్టంలోని హామీల‌పైనా సీఎం జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుద‌ల వంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చించేందుకు వెళ్లార‌ని అంటున్నారు.  

అయితే, రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం దీనికి భిన్నంగా వాద‌న వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్ చర్చించి ఉంటార‌నేది వీరి వాద‌న‌గా ఉంది. ముఖ్యంగా పొత్తుల వ్య‌వ‌హారంపై బీజేపీ దూకుడు పెంచిన ద‌రిమిలా.. అలాంటి అవ‌స‌రం ఎందుక‌న్న వాద‌న‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించి ఉంటార‌నేది ప్ర‌ధానంగా వినిపిస్తున్న మాట‌. అంతేకాదు.. తాము ప‌రోక్షంగా స‌హ‌క‌రించే అవ‌కాశాన్ని చ‌ర్చించార‌నేది టీడీపీ నేత‌ల నుంచి వినిపిస్తున్న మాట‌.

అదేస‌మ‌యంలో బీజేపీ ఒంట‌రి పోరుకు దిగితే.. త‌మ స‌ర్కారు మ‌రోసారి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా.. తాము కేంద్రానికి స‌హ‌క‌రిస్తామ‌ని ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ చెప్పి ఉంటార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తాము పెట్టుకున్న టార్గెట్‌, కాంగ్రెస్ వ్య‌వ‌హార శైలి, ముఖ్యంగా త‌న సోద‌రి ష‌ర్మిల దూకుడు వంటి అంశాల‌ను కూడా.. నేరుగా ప్ర‌ధానితోనే జ‌గ‌న్ చ‌ర్చించి ఉంటార‌నేది ప్ర‌తిపక్షాల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 9, 2024 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

41 minutes ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

2 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

4 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

5 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

6 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

6 hours ago