ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఆయన ప్రధాన మంత్రి నరేం ద్ర మోడీతోను, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ అయ్యారు. అయితే.. ఎన్నికలకు ముందు జరిగిన.. అధికారిక పర్యటనపై ప్రభుత్వ వర్గాలు ఒక విధంగా చెబుతున్నాయి. రాజకీయ వర్గాల్లో మరో విధమైన చర్చసాగుతోంది. దీంతోఅసలు జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం చర్చించారనేది ఆసక్తిగా మారింది.
ముందుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే.. పెండింగులో ఉన్న ఏపీ సమస్యల పైనే సీఎం జగన్ దృష్టి పెట్టారని అంటున్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా, దీంతో పాటు విభజన చట్టంలోని హామీలపైనా సీఎం జగన్ చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుదల వంటి కీలక అంశాలపై చర్చించేందుకు వెళ్లారని అంటున్నారు.
అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం దీనికి భిన్నంగా వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ చర్చించి ఉంటారనేది వీరి వాదనగా ఉంది. ముఖ్యంగా పొత్తుల వ్యవహారంపై బీజేపీ దూకుడు పెంచిన దరిమిలా.. అలాంటి అవసరం ఎందుకన్న వాదనను సీఎం జగన్ ప్రస్తావించి ఉంటారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అంతేకాదు.. తాము పరోక్షంగా సహకరించే అవకాశాన్ని చర్చించారనేది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.
అదేసమయంలో బీజేపీ ఒంటరి పోరుకు దిగితే.. తమ సర్కారు మరోసారి వచ్చే అవకాశం ఉంటుందని.. తద్వారా.. తాము కేంద్రానికి సహకరిస్తామని పరోక్షంగా సీఎం జగన్ చెప్పి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టికెట్ల పంపిణీ వ్యవహారంతోపాటు.. వచ్చే ఎన్నికలలో తాము పెట్టుకున్న టార్గెట్, కాంగ్రెస్ వ్యవహార శైలి, ముఖ్యంగా తన సోదరి షర్మిల దూకుడు వంటి అంశాలను కూడా.. నేరుగా ప్రధానితోనే జగన్ చర్చించి ఉంటారనేది ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న చర్చ. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 9, 2024 9:05 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…