Political News

బీఆర్ఎస్ పై ‘పట్నం’ దెబ్బ

బీఆర్ఎస్ లో కీలకనేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. తన కుటుంబంతో కలిసి పట్నం గురువారం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరటానికి మాజీమంత్రి కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని సమాచారం. ముందుగా అన్నీ మాట్లాడుకున్న తర్వాతే పట్నం దంపతులు ముఖ్యమంత్రిని కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో పట్నం కుటుంబానికి మంచిపట్టుంది. అలాంటి పట్నం తొందరలోనే కాంగ్రెస్ లో చేరతుండటంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే టాక్ పెరిగిపోతోంది.

తాండూరు నుండి పట్నంపై 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన కెప్టెన్ రోహిత్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పటినుండి పట్నంను కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో చాలాకాలం పట్నం డార్క్ లోనే ఉండిపోయారు. అలాంటిది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడెన్ గా పట్నంను కేసీయార్ మంత్రిని చేశారు. ఎందుకంటే పట్నం సహకారం లేకపోతే పార్టీ గెలవదని అర్ధమైంది కాబట్టే. అయితే పట్నం మంత్రిగా చేరినా పార్టీ అన్ని చోట్ల ఓడిపోయింది.

అప్పటినుండి పట్నం జోరు తగ్గించేశారు. అలాంటిది ఇపుడు సడెన్ గా రేవంత్ ను కలవటంతో అందరి దృష్టి మాజీమంత్రిపై పడింది. మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సునీతకు చెవెళ్ళ ఎంపీ టికెట్ హామీ దక్కినట్లుగా ప్రచారం మొదలైంది. ఎంపీ టికెట్ ఇస్తామని పట్నం దంపతులకు కాంగ్రెస్ నుండి హామీ వచ్చింది కాబట్టే కాంగ్రెస్ లో చేరినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఈనెల 11వ తేదీన పట్నం దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. అంటే పట్నం సునీతారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాతే వీళ్ళని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు అర్ధమవుతోంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి మీద పట్నం తమ్ముడు రెండుసార్లు పోటీచేశారు. అవన్నీ మరచిపోయి ఇపుడు అదే పట్నం దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించేదే అనటంలో సందేహంలేదు. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

2 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

5 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

5 hours ago