బీఆర్ఎస్ లో కీలకనేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. తన కుటుంబంతో కలిసి పట్నం గురువారం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరటానికి మాజీమంత్రి కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని సమాచారం. ముందుగా అన్నీ మాట్లాడుకున్న తర్వాతే పట్నం దంపతులు ముఖ్యమంత్రిని కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో పట్నం కుటుంబానికి మంచిపట్టుంది. అలాంటి పట్నం తొందరలోనే కాంగ్రెస్ లో చేరతుండటంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే టాక్ పెరిగిపోతోంది.
తాండూరు నుండి పట్నంపై 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన కెప్టెన్ రోహిత్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పటినుండి పట్నంను కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో చాలాకాలం పట్నం డార్క్ లోనే ఉండిపోయారు. అలాంటిది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడెన్ గా పట్నంను కేసీయార్ మంత్రిని చేశారు. ఎందుకంటే పట్నం సహకారం లేకపోతే పార్టీ గెలవదని అర్ధమైంది కాబట్టే. అయితే పట్నం మంత్రిగా చేరినా పార్టీ అన్ని చోట్ల ఓడిపోయింది.
అప్పటినుండి పట్నం జోరు తగ్గించేశారు. అలాంటిది ఇపుడు సడెన్ గా రేవంత్ ను కలవటంతో అందరి దృష్టి మాజీమంత్రిపై పడింది. మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సునీతకు చెవెళ్ళ ఎంపీ టికెట్ హామీ దక్కినట్లుగా ప్రచారం మొదలైంది. ఎంపీ టికెట్ ఇస్తామని పట్నం దంపతులకు కాంగ్రెస్ నుండి హామీ వచ్చింది కాబట్టే కాంగ్రెస్ లో చేరినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈనెల 11వ తేదీన పట్నం దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. అంటే పట్నం సునీతారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాతే వీళ్ళని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు అర్ధమవుతోంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి మీద పట్నం తమ్ముడు రెండుసార్లు పోటీచేశారు. అవన్నీ మరచిపోయి ఇపుడు అదే పట్నం దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించేదే అనటంలో సందేహంలేదు. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…