కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఎట్టకేలకు భద్రతను పెంచారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచారు. భద్రతా ప్రమాణాల నిబంధనల(స్కేల్) మేరకు సెక్యూరిటీ కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సిఫారసు (సెక్యూరిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించినట్టు తెలిపారు.
వైఎస్ షర్మిల రెండు రోజుల క్రితం తనకు భద్రత కల్పించాలని బహిరంగంగానే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షురాలు హోదాలో పర్యటిస్తున్నారు. అయితే.. ఆమెకు ఆదిలో ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం కూడా.. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి తోడు.. కాంగ్రెస్ నాయకులు కూడా డీజీపీకి పలు మార్లు ఉత్తరాలు రాశారు. దీంతో స్థానికంగా ప్రోటోకాల్ అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రత ఏర్పాటు చేయడంగమనారహం. దీంతోషర్మిలకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా మార్పు చేశారు. ప్రస్తుతం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాలు సహా రోడ్ షోలలోనూ ఆమె పాల్గొంటున్నారు. దీంతో ఆమె భద్రతపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే.
This post was last modified on February 8, 2024 6:09 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…