వైసీపీ టికెట్ దక్కక పోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని, అయి తే.. జగన్పై తన కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందని.. ఆయనకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రచారం చేయనని ఆయన చెప్పుకొచ్చారు. “మా ఇంటికి మీరు రండి. ఎటు చూసిన .. జగన్, వాళ్ల నాయన ఫొటోలే కనిపిస్తాయి. మా ఇంట్లో ఓదార్పు యాత్ర పాటలు కూడా వినిపిస్తాయి” అని మీడియా మిత్రులతో కాపు చెప్పుకొచ్చారు.
తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఆయన సభలో కంటే కూడా..లాబీల్లోనే ఎక్కువగా గడిపారు. ఇదే సమయంలో టీడీపీ పక్ష కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ ఎమ్మెల్యే లతో కలిసి టీ తాగారు. వారితో కొన్ని నిమిషాల పాటు చర్చలు జరిపారు. బడ్జెట్ ఎలా ఉందని ఇరు పక్షాల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. అనంతరం.. కాపు మీడియాతో చిట్ చాట్గా మాట్లాడుతూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమేనని చెప్పారు.
అయితే.. స్వతంత్రంగానా? లేక వేరే పార్టీ నుంచా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎలా పోటీ చేసినా.. జగన్కు వ్యతిరేకంగా మాత్రం ప్రచారం చేసుకోనని.. తన బలంపైనే తాను గెలుస్తానని అన్నారు. “నాకొక ఇమేజ్ ఉందబ్బా. దాన్ని వదులుకుంటామా ఏంటి? జగన్మీద ప్రచారం చేస్తే.. వెయ్యి ఓట్లుకు మించి రావు. నా గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మాత్రానికి ఆయనను డ్యామేజీఎందుకు చేయాలి. అంతా దేవుడే చూసుకుంటాడులే” అని వ్యాఖ్యానించారు.
This post was last modified on February 8, 2024 2:13 pm
వైసీపీ నాయకుడు, గత వైసీపీ సర్కారులో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ యువ నాయకుడు, విజయవాడ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ…
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు…
వైసీపీ అధినేత జగన్కు ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…