వైసీపీ టికెట్ దక్కక పోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని, అయి తే.. జగన్పై తన కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందని.. ఆయనకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రచారం చేయనని ఆయన చెప్పుకొచ్చారు. “మా ఇంటికి మీరు రండి. ఎటు చూసిన .. జగన్, వాళ్ల నాయన ఫొటోలే కనిపిస్తాయి. మా ఇంట్లో ఓదార్పు యాత్ర పాటలు కూడా వినిపిస్తాయి” అని మీడియా మిత్రులతో కాపు చెప్పుకొచ్చారు.
తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఆయన సభలో కంటే కూడా..లాబీల్లోనే ఎక్కువగా గడిపారు. ఇదే సమయంలో టీడీపీ పక్ష కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ ఎమ్మెల్యే లతో కలిసి టీ తాగారు. వారితో కొన్ని నిమిషాల పాటు చర్చలు జరిపారు. బడ్జెట్ ఎలా ఉందని ఇరు పక్షాల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. అనంతరం.. కాపు మీడియాతో చిట్ చాట్గా మాట్లాడుతూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమేనని చెప్పారు.
అయితే.. స్వతంత్రంగానా? లేక వేరే పార్టీ నుంచా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎలా పోటీ చేసినా.. జగన్కు వ్యతిరేకంగా మాత్రం ప్రచారం చేసుకోనని.. తన బలంపైనే తాను గెలుస్తానని అన్నారు. “నాకొక ఇమేజ్ ఉందబ్బా. దాన్ని వదులుకుంటామా ఏంటి? జగన్మీద ప్రచారం చేస్తే.. వెయ్యి ఓట్లుకు మించి రావు. నా గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మాత్రానికి ఆయనను డ్యామేజీఎందుకు చేయాలి. అంతా దేవుడే చూసుకుంటాడులే” అని వ్యాఖ్యానించారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…