వైసీపీ టికెట్ దక్కక పోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని, అయి తే.. జగన్పై తన కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందని.. ఆయనకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రచారం చేయనని ఆయన చెప్పుకొచ్చారు. “మా ఇంటికి మీరు రండి. ఎటు చూసిన .. జగన్, వాళ్ల నాయన ఫొటోలే కనిపిస్తాయి. మా ఇంట్లో ఓదార్పు యాత్ర పాటలు కూడా వినిపిస్తాయి” అని మీడియా మిత్రులతో కాపు చెప్పుకొచ్చారు.
తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఆయన సభలో కంటే కూడా..లాబీల్లోనే ఎక్కువగా గడిపారు. ఇదే సమయంలో టీడీపీ పక్ష కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ ఎమ్మెల్యే లతో కలిసి టీ తాగారు. వారితో కొన్ని నిమిషాల పాటు చర్చలు జరిపారు. బడ్జెట్ ఎలా ఉందని ఇరు పక్షాల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. అనంతరం.. కాపు మీడియాతో చిట్ చాట్గా మాట్లాడుతూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమేనని చెప్పారు.
అయితే.. స్వతంత్రంగానా? లేక వేరే పార్టీ నుంచా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎలా పోటీ చేసినా.. జగన్కు వ్యతిరేకంగా మాత్రం ప్రచారం చేసుకోనని.. తన బలంపైనే తాను గెలుస్తానని అన్నారు. “నాకొక ఇమేజ్ ఉందబ్బా. దాన్ని వదులుకుంటామా ఏంటి? జగన్మీద ప్రచారం చేస్తే.. వెయ్యి ఓట్లుకు మించి రావు. నా గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మాత్రానికి ఆయనను డ్యామేజీఎందుకు చేయాలి. అంతా దేవుడే చూసుకుంటాడులే” అని వ్యాఖ్యానించారు.
This post was last modified on February 8, 2024 2:13 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…