Political News

కేసీయార్ ప్రిస్టేజిగా తీసుకున్నారా ?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించబోతున్న బహిరంగసభను కేసీయార్ బాగా ప్రిస్టేజిగా తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈనెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగసభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే బీఆర్ఎస్ సత్తా ఏమిటో చాటాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అసెంబ్లీలో అయినా బహిరంగసభలో అయినా ప్రధాన ప్రచార అస్త్రం జలవనరుల ప్రాజెక్టులే అని అందరికీ తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కేసీయార్ వేలకోట్ల రూపాయలు దోపిడి చేశారని రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు.

తమ ఆరోపణలు ఉత్త ఆరోపణలు మాత్రమే కావని సాక్ష్యాలున్నాయని రేవంత్, మంత్రులు చెబుతున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో జరిగిన దోపిడిని నిరూపించేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. తాజాగా విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, పరిరక్షణ బాధ్యతలను రేవంత్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ)కి అప్పగించింది. నీటి ప్రాజెక్టులు, ప్రాజెక్టుల నిర్మాణంపై రేవంత్ కు సరైన విధానంలేదని కేసీయార్ అండ్ కో మండిపోతున్నారు.

కేఆర్ఎంబీ కి బాధ్యతలు అప్పగించటం వల్ల తెలంగాణాలో సగభాగం ఎడారిగా మారబోతోందనే ఆరోపణలతో రాష్ట్రమంతా కేసీయార్ ప్రచారం చేయబోతున్నారు. అందుకనే మొదటిసభను నల్గొండలో నిర్వహించబోతున్నారు. ఈ సభకు తక్కువలో తక్కువ 2 లక్షలమందిని సమీకరించాలని ఆదేశించారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుండి జనాలను తీసుకురావాలని ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలను ఇన్చార్జిలుగా నియమించారు. జనసమీకరణ బాధ్యతలను పూర్తిగా వీళ్ళకే అప్పగించారు.

ప్రతి నియోజకవర్గం నుండి 20 వేలకు తక్కువ కాకుండా సమీకరించాలని సమీక్షా సమావేశాల్లో కేసీయార్ పదేపదే చెబుతున్నారు. మొదటి బహిరంగసభను గ్రాండ్ సక్సెస్ చేయటం ద్వారా పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని బ్రహ్మాండంగా మొదలుపెట్టాలన్నది కేసీయార్ ఆలోచన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ అండ్ కో, రేవంత్ అండ్ కో ప్రస్తావిస్తున్నది ఒకటే అంశం అది జలవనరులు. కాకపోతే ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కేసీయార్ అండ్ కో వేల కోట్ల రూపాయలు దోచేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో నీటి వనరులపై ప్రభుత్వం కేఆర్ఎంబీకి బాధ్యతలు అప్పగించటం వల్ల తెలంగాణా ఎడారి కాబోతోందని కేసీయార్ అండ్ కో ఆరోపిస్తున్నారు.

This post was last modified on February 8, 2024 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago