Political News

టీడీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఒక విధ‌మైన టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక విధ‌మైన ప‌రిస్థితి ఉండ‌గా.. ఇప్పుడు చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ పెట్టుకోవ‌డంతో ఈ టెన్ష‌న్ మ‌రింత పెరిగింది. దీనికి కార‌ణం.. టికెట్లు వ‌స్తాయో..రావోన‌నే బెంగే నాయ‌కుల‌ను ప‌ట్టుకోవ‌డం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తు క్లారిటీ వ‌చ్చింది. దీంతో 20 నుంచి 30 అసెంబ్లీ, 2 నుంచి 3 పార్ల‌మెంటుస్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికీ దీనిపై స్ప‌ష్ట‌త పూర్తిగా రాలేదు. ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న క‌థ‌నాలు త‌ప్పితే.. పార్టీ ప‌రంగా ఎలాంటి క్లారిటీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఆయా స్థానాల‌పై ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన నాయ‌కులు, చంద్ర‌బాబు స‌భ‌ల‌కు ఖ‌ర్చులు చేసిన నాయ‌కులు బెంగ పెట్టుకున్నారు. త‌మ‌కు టికెట్ ఇస్తారో.. ఇవ్వ‌రో అంటూ.. ఆరాలు తీయ‌డం ప్రారంభించారు. ఇక‌, ఇప్పుడు కొత్త‌గా చంద్ర‌బాబు బీజేపీ పొత్తుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న నేరుగా ఢిల్లీకి వెళ్లారు. పొత్తుల కోసమే ఆయ‌న ఢిల్లీ బాట ప‌ట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో త‌మ్ముళ్ల‌లో మ‌రింత టెన్ష‌న్ పెరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. మ‌రో 6 నుంచి 8 అసెంబ్లీ, 1 నుంచి 2 పార్ల‌మెంటు స్థానాల‌ను ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఇది కూడా ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఉమ్మ‌డికృష్ణాజిల్లాలోని పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నేత వ‌చ్చి చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. త‌న‌కు సీటు ఇస్తున్నారో.. లేదో తేల్చి చెప్పాల‌ని కూర్చున్నారు. ఆయ‌నే పెడన టీడీపీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్. పొత్తులో భాగంగాఈ సీటుకూడా జనసేనకు పోతుందనే అనుమానం టీడీపీ నేతలను టెన్షన్‌కు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న త‌న అనుచ‌రుల‌ను వెంటేసుకుని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వ‌చ్చి.. ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని కోరారు.దీనిపై చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు. టికెట్‌పై చంద్రబాబు హామీ ఇచ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెడ‌న ఎటూ పోద‌ని.. నువ్వు రెడీ చేసుకోమ‌ని చంద్ర‌బాబు అభ‌యం ఇవ్వ‌డంతో కాగిత ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు సార్లు భేటీ అయిన త‌ర్వాత‌.. కాపులు ఎక్కువ‌గా ఉన్న పెడన టికెట్ తమ నాయ‌కుడికి ఇవ్వాల‌ని ప‌వ‌న్ కోరిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో కృష్ణప్రసాద్ వ‌ర్గంలో అల‌జ‌డి రేగింది. గ‌త నాలుగేళ్లుగా ఇక్క‌డ కార్య‌క్ర‌మాలుచేస్తున్నాం.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాం.. ఇప్పుడు టికెట్ ఇవ్వ‌రా ? అంటూ.. వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. మొత్తానికి చంద్ర‌బాబు దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ, రాష్ట్రంలో ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 8, 2024 6:22 am

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

2 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

2 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

2 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

4 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

4 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

6 hours ago