Political News

అఖిల ఒంటరైపోయిందా ?

భూమా ఫ్యామిలిలో జరుగుతున్న డెవలప్మెంట్ల కారణంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఒంటరిపోయారు. ఆమెకు పార్టీతో పాటు కుటుంబంలో కూడా మద్దతు దొరకటంలేదు. ఇక ప్రజామద్దతు అంటే ఎన్నికల్లో మాత్రమే తెలుస్తుంది. విషయం ఏమిటంటే మాజీమంత్రిది మొదటినుండి బాగా దూకుడుస్వాభావమే. దానికితోడు భర్త భార్గవరామ్ ది అఖిలకు మించిన దూకుడు స్వభావమట. అందుకనే ఇద్దరు కలిసిన దగ్గర నుండి అఖిల చాలా వివాదాల్లో ఇరుక్కునేశారు. రాజకీయంగా ఎదగాలన్న ఆరాటం, తన పరిస్ధితిపై తనకు విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా తరచూ వివాదాల్లో కూరుకుపోతున్నారు.

అఖిలపైన ఫోర్జరీ, కిడ్నాపులు, హత్యకు కుట్ర, మోసాలు, దాడుల కేసులు చాలా నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులో జైలు ఉండి బెయిల్ పైన బయట తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తి కాబట్టే అఖిలను పార్టీ దూరంగా పెట్టేసింది. అయితే అఖిలను పార్టీలో నుండి బయటకు మాత్రం పంపటం లేదు. అందుకనే ఆమె టీడీపీ నేతగానే చెలామణి అవుతున్నారు. దంపతుల వైఖరి నచ్చకే కుటుంబం దూరంగా పెట్టేసింది. ఈ మధ్యనే భూమా కుటుంబీకులు మీటింగ్ పెట్టుకుని అఖిలను దూరంగా ఉంచాలని డిసైడ్ చేశారు.

ఎట్టి పరిస్ధితుల్లోను భూమాకు ఆళ్ళగడ్డ టికెట్ రానీకుండా చేయాలని, ఒకవేళ టికెట్ తెచ్చుకుంటే ఓడించాలని తీర్మానించుకున్నారు. మొత్తం భూమా కుటుంబీకులంతా భూమా కిషోర్ రెడ్డికే మద్దతుగా నిలవాలని కూడా తీర్మానం అయ్యింది. దాంతో పార్టీలోనే కాకుండా చివరకు కుటుంబంలో కూడా అఖిల ఒంటరైపోయిందన్న విషయం బయటపడింది. అయితే పార్టీలో ఇంత జరుగుతున్నా ఆళ్లగడ్డ టికెట్ అఖిలకే అన్న ప్రచారం బాగా జరుగుతోంది.

ఇంత వివాదాస్పదమైన అఖిలకే మళ్ళీ టికెట్ ఇస్తే వైసీపీ ఎంఎల్ఏ బిజేంద్రనాధ్ రెడ్డి గెలుపుకు పెద్దగా కష్టపడక్కర్లేదనే సెటైర్లు పెరిగిపోతున్నాయి. అందుకనే బీజేపీలో యాక్టివ్ గా ఉంటున్న కిషోర్ రెడ్డి గెలుపుకు కుటుంబీకులంతా పనిచేయాలని కూడా తీర్మానం జరిగింది. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకునే పార్టీలో సీనియర్ తమ్ముడు ఏవీ సుబ్బారెడ్డి ఆళ్ళగడ్డ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అఖిలకు కాకుండా టికెట్ తనకిస్తే మొత్తం భూమా కుటుంబాన్ని తనకు మద్దతుగా పనిచేయించుకోవచ్చన్నది ఏవీ ఆలోచన. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on February 7, 2024 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

2 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

3 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

3 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

3 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

5 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

7 hours ago