Political News

స‌ర్దుబాటు బాగుందే.. టీడీపీ-జ‌న‌సేన స్ట్రాట‌జీ.. !

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి తమ పార్టీ నాయ‌కుల‌ను బుజ్జ‌గించే విష‌యంలో టీడీపీ-జ‌న‌సేన కూటమి చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విడివిడిగా పోటీ చేయ‌డంతో దాదాపు నేత‌లు అంద‌రికీ అవ‌కాశం ద‌క్కింది. అయితే.. ఇప్పుడు రెండు పార్టీలు కూడా విడిగా కాకుండా.. ఓటు బ్యాంకు చీల‌కుండా చూసే ల‌క్ష్యంతో ఉమ్మ‌డిగా బ‌రిలోకి దిగుతున్నాయి. దీంతో రాజ‌కీయంగా ఇది బాగానే ఉన్నా.. పార్టీల ప‌రంగా ఇబ్బందిగా ఉంది.

టికెట్లు ఆశించిన నాయ‌కుల‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, జ‌న‌సేన‌లు రెండూ కూడా ఇవ్వ‌లేక పోతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన పోటీ ఉండ‌డం. బ‌ల‌మైన నాయ‌కుల అవ‌స‌రం ఉన్న నేప‌థ్యం లో నాయ‌కుల‌కు కొంద‌రికి టికెట్ ద‌క్కే అవ‌కాశం లేకుండా పోయింది. అయితే.. ఈ ప‌రిస్తితిని ఆ నేత‌లు కొంద‌రు జీర్ణించుకునే ప‌రిస్థితి లేదు. అందుకే.. టీడీపీ-జ‌న‌సేన‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నా యి. దీనిలో భాగంగా.. నాయ‌కుల‌కు ముందు న‌చ్చ‌చెబుతున్నారు.

దీనికి సంబంధించి ఈనెల 7, 8 తేదీల్లో ఇరు పార్టీల అధినేత‌లు, లేదా.. కీల‌క నాయ‌కులు పార్టీ నేత‌లు, టికెట్ ఆశావ‌హుల‌తో భేటీ అవుతున్నారు. వారికి స‌ర్దిచెబుతారు. టికెట్ ఎందుకు ఇవ్వ‌లేక పోయార‌నే విష‌యాన్ని వివ‌రిస్తారు. అదేస‌మ‌యంలో వారి ఇబ్బందుల‌ను.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌ద‌రు టికెట్ ప‌రిధిలో ఉన్న పోటీని కూడా వెల్ల‌డిస్తారు. దీంతో కొంత వ‌ర‌కు ఆగ్ర‌హం, ఆవేశం త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు.. మాన‌సికంగా సిద్ధం చేయ‌డం.

ఇది పార్టీల‌కు అత్యంత కీల‌కంగా మారింది. నాయ‌కుల‌కు టికెట్ లేద‌ని చెప్ప‌డం సుల‌భమే కావొచ్చు కానీ, వారు పార్టీతోనే ఉండేలా.. పార్టీలోనే ఉండేలా.. పార్టీ గెలుపు కోసం ప‌నిచేసేలా.. చేసుకోవ‌డం క‌ష్టం. ఎంత వీర విధేయులైనా పార్టీ టికెట్ కాదంటే.. ర‌గిలి పోతుంటారు. దీంతో ఇలాంటి వారిని మౌల్డ్ చేసుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ముందుగానే వారిని మాన‌సికంగా సిద్ధం చేస్తూ.. నెమ్మది నెమ్మ‌దిగా వారిని కూల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యూహం ఏమేర‌కు వ‌ర్కువుట్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 6, 2024 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago