Political News

లోకేష్ ఏమ‌య్యారు… ఎక్క‌డున్నారు…!

టీడీపీ యువ‌నాయ‌కుడు నారా లోకేష్ జాడ ఎక్కడ‌? ఆయ‌న ఏం చేస్తున్నారు? రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతున్న ప్ర‌శ్న‌. యువ‌గ‌ళం పాద‌యాత్ర త‌ర్వాత‌.. ఆయ‌న సైలెంట్ అయిపోయారు. దాదాపు ఈ యాత్ర ముగిసి కూడా నెల రోజులు దాడిపోతోంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌టి రెండు సార్లు మాత్రమే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. పాన‌కాల ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వ‌చ్చి. కుటుంబ స‌మేతంగా పూజ‌లు చేశారు. త‌ర్వాత‌.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గాన్ని క‌లిశారు.

ఇంత‌కు మించి.. నారా లోకేష్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు రావాల‌ని అనుకుంటున్న స‌మ‌యం లో వారికి దిశానిర్దేశం చేస్తున్నార‌ని.. పార్టీలో వారి బాధ్య‌త‌లు వివ‌రిస్తున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి నారా లోకేష్ రెండు షెడ్యూళ్లు ప్ర‌క‌టించారు. దీనిని పార్టీ నాయ‌కులు ప్ర‌చారం కూడా చేశారు. ఒక‌టి.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేయ‌డం ద్వారా. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం.

త‌ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచి తీరాల‌న్న త‌న త‌ప‌న‌ను సాకారం చేసుకోవాల‌ని నారా లోకేష్ భావించారు. అయితే.. అనివార్య కార‌ణాల‌తో దీనిని చేయ‌లేదు. ఇక‌, ఈ నెల 5 వ తేదీ నుంచి ఉత్త‌రాంధ్ర‌లో నారా లోకేష్ ప‌ర్య‌ట‌న‌లు సాగాల్సి ఉంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా.. ఆయ‌న క‌వ‌ర్ చేయ‌ని జిల్లాల్లో యువ‌గళం స‌భ‌లు పేరుతో క‌వ‌ర్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు.

5వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు కూడా నారా లోకేష్ షెడ్యూల్ ప్ర‌కారం వివిధ కార్యక్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ.. అనూహ్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు మ‌ళ్లీ వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. దీనికి కార‌ణం ఏంట‌నేది ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఎన్నిక‌ల‌కు సంబంధించి సీట్ల స‌ర్దు బాటు.. ఇత‌ర‌త్రా నిధుల ఏర్పాటు.. ఐటీడీపీని మ‌రింత బ‌లోపేతం చేయడం వంటి కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నార‌ని స‌మాచారం. మ‌రి విష‌యం ఏంట‌నేది తెలియాల్సి ఉంది

This post was last modified on February 6, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

6 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

13 hours ago