Political News

లోకేష్ ఏమ‌య్యారు… ఎక్క‌డున్నారు…!

టీడీపీ యువ‌నాయ‌కుడు నారా లోకేష్ జాడ ఎక్కడ‌? ఆయ‌న ఏం చేస్తున్నారు? రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతున్న ప్ర‌శ్న‌. యువ‌గ‌ళం పాద‌యాత్ర త‌ర్వాత‌.. ఆయ‌న సైలెంట్ అయిపోయారు. దాదాపు ఈ యాత్ర ముగిసి కూడా నెల రోజులు దాడిపోతోంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌టి రెండు సార్లు మాత్రమే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. పాన‌కాల ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వ‌చ్చి. కుటుంబ స‌మేతంగా పూజ‌లు చేశారు. త‌ర్వాత‌.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గాన్ని క‌లిశారు.

ఇంత‌కు మించి.. నారా లోకేష్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు రావాల‌ని అనుకుంటున్న స‌మ‌యం లో వారికి దిశానిర్దేశం చేస్తున్నార‌ని.. పార్టీలో వారి బాధ్య‌త‌లు వివ‌రిస్తున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి నారా లోకేష్ రెండు షెడ్యూళ్లు ప్ర‌క‌టించారు. దీనిని పార్టీ నాయ‌కులు ప్ర‌చారం కూడా చేశారు. ఒక‌టి.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేయ‌డం ద్వారా. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం.

త‌ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచి తీరాల‌న్న త‌న త‌ప‌న‌ను సాకారం చేసుకోవాల‌ని నారా లోకేష్ భావించారు. అయితే.. అనివార్య కార‌ణాల‌తో దీనిని చేయ‌లేదు. ఇక‌, ఈ నెల 5 వ తేదీ నుంచి ఉత్త‌రాంధ్ర‌లో నారా లోకేష్ ప‌ర్య‌ట‌న‌లు సాగాల్సి ఉంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా.. ఆయ‌న క‌వ‌ర్ చేయ‌ని జిల్లాల్లో యువ‌గళం స‌భ‌లు పేరుతో క‌వ‌ర్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు.

5వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు కూడా నారా లోకేష్ షెడ్యూల్ ప్ర‌కారం వివిధ కార్యక్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ.. అనూహ్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు మ‌ళ్లీ వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. దీనికి కార‌ణం ఏంట‌నేది ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఎన్నిక‌ల‌కు సంబంధించి సీట్ల స‌ర్దు బాటు.. ఇత‌ర‌త్రా నిధుల ఏర్పాటు.. ఐటీడీపీని మ‌రింత బ‌లోపేతం చేయడం వంటి కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నార‌ని స‌మాచారం. మ‌రి విష‌యం ఏంట‌నేది తెలియాల్సి ఉంది

This post was last modified on February 6, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

6 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

21 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

44 minutes ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

45 minutes ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago