Political News

లోకేష్ ఏమ‌య్యారు… ఎక్క‌డున్నారు…!

టీడీపీ యువ‌నాయ‌కుడు నారా లోకేష్ జాడ ఎక్కడ‌? ఆయ‌న ఏం చేస్తున్నారు? రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతున్న ప్ర‌శ్న‌. యువ‌గ‌ళం పాద‌యాత్ర త‌ర్వాత‌.. ఆయ‌న సైలెంట్ అయిపోయారు. దాదాపు ఈ యాత్ర ముగిసి కూడా నెల రోజులు దాడిపోతోంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌టి రెండు సార్లు మాత్రమే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. పాన‌కాల ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వ‌చ్చి. కుటుంబ స‌మేతంగా పూజ‌లు చేశారు. త‌ర్వాత‌.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గాన్ని క‌లిశారు.

ఇంత‌కు మించి.. నారా లోకేష్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు రావాల‌ని అనుకుంటున్న స‌మ‌యం లో వారికి దిశానిర్దేశం చేస్తున్నార‌ని.. పార్టీలో వారి బాధ్య‌త‌లు వివ‌రిస్తున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి నారా లోకేష్ రెండు షెడ్యూళ్లు ప్ర‌క‌టించారు. దీనిని పార్టీ నాయ‌కులు ప్ర‌చారం కూడా చేశారు. ఒక‌టి.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేయ‌డం ద్వారా. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం.

త‌ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచి తీరాల‌న్న త‌న త‌ప‌న‌ను సాకారం చేసుకోవాల‌ని నారా లోకేష్ భావించారు. అయితే.. అనివార్య కార‌ణాల‌తో దీనిని చేయ‌లేదు. ఇక‌, ఈ నెల 5 వ తేదీ నుంచి ఉత్త‌రాంధ్ర‌లో నారా లోకేష్ ప‌ర్య‌ట‌న‌లు సాగాల్సి ఉంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా.. ఆయ‌న క‌వ‌ర్ చేయ‌ని జిల్లాల్లో యువ‌గళం స‌భ‌లు పేరుతో క‌వ‌ర్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు.

5వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు కూడా నారా లోకేష్ షెడ్యూల్ ప్ర‌కారం వివిధ కార్యక్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ.. అనూహ్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు మ‌ళ్లీ వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. దీనికి కార‌ణం ఏంట‌నేది ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఎన్నిక‌ల‌కు సంబంధించి సీట్ల స‌ర్దు బాటు.. ఇత‌ర‌త్రా నిధుల ఏర్పాటు.. ఐటీడీపీని మ‌రింత బ‌లోపేతం చేయడం వంటి కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నార‌ని స‌మాచారం. మ‌రి విష‌యం ఏంట‌నేది తెలియాల్సి ఉంది

This post was last modified on February 6, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

6 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

6 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

7 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

7 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

9 hours ago