టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ జాడ ఎక్కడ? ఆయన ఏం చేస్తున్నారు? రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. యువగళం పాదయాత్ర తర్వాత.. ఆయన సైలెంట్ అయిపోయారు. దాదాపు ఈ యాత్ర ముగిసి కూడా నెల రోజులు దాడిపోతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు మాత్రమే ప్రజల మధ్యకు వచ్చారు. పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి. కుటుంబ సమేతంగా పూజలు చేశారు. తర్వాత.. మంగళగిరి నియోజకవర్గంలో తన వర్గాన్ని కలిశారు.
ఇంతకు మించి.. నారా లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్కే పరిమితమయ్యారని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నుంచి నాయకులు బయటకు రావాలని అనుకుంటున్న సమయం లో వారికి దిశానిర్దేశం చేస్తున్నారని.. పార్టీలో వారి బాధ్యతలు వివరిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి నారా లోకేష్ రెండు షెడ్యూళ్లు ప్రకటించారు. దీనిని పార్టీ నాయకులు ప్రచారం కూడా చేశారు. ఒకటి.. మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం ద్వారా. ప్రజలకు చేరువ కావడం.
తద్వారా.. నియోజకవర్గంలో గెలిచి తీరాలన్న తన తపనను సాకారం చేసుకోవాలని నారా లోకేష్ భావించారు. అయితే.. అనివార్య కారణాలతో దీనిని చేయలేదు. ఇక, ఈ నెల 5 వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో నారా లోకేష్ పర్యటనలు సాగాల్సి ఉంది. యువగళం పాదయాత్ర సందర్భంగా.. ఆయన కవర్ చేయని జిల్లాల్లో యువగళం సభలు పేరుతో కవర్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు.
5వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కూడా నారా లోకేష్ షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ.. అనూహ్యంగా ఆయన పర్యటనలు మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దు బాటు.. ఇతరత్రా నిధుల ఏర్పాటు.. ఐటీడీపీని మరింత బలోపేతం చేయడం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని సమాచారం. మరి విషయం ఏంటనేది తెలియాల్సి ఉంది
This post was last modified on February 6, 2024 9:24 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…