Political News

మంగ‌ళ‌గిరిలో అన్న క్యాంటీన్‌.. భువ‌నేశ్వ‌రి చేతుల మీదుగా!

ప్ర‌స్తుతం ‘నిజం గెలవాలి’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమణి.. నారా భువ‌నేశ్వ‌రి పార్టీ నేత‌ల‌తోనూ మ‌మేక‌మ‌వుతున్నారు. పార్టీ గురించి వారికి దిశానిర్దేశం చేస్తున్నా రు. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క‌మైన ప‌థ‌కంగా గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో పేర్కొన్న అన్నా క్యాంటీన్‌ను ఇక్క‌డ ప్రారంభించారు.

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిదిలోని రేవేంద్ర‌పాడు మండ‌లంలో భువ‌నేశ్వ‌రి ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి.. పేద‌ల‌కు అన్నం వ‌డ్డించారు. కేవ‌లం రూ.5 కే భోజనం, ఉద‌యం పూట టిఫిన్ అందించాల‌న్న సంకల్పంతో చంద్ర‌బాబు హ‌యాంలో అన్నా క్యాంటీన్ల‌కు శ్రీకారం చుట్టారు. వీటిని బాగానే ముందుకు తీసుకువెళ్లారు. దిన‌స‌రి కూలీలు, పేద‌లు, రోజు వారీ ప‌నులు చేసుకునే కార్మికులు, ఆటో , రిక్షా కార్మికులు ఈ క్యాంటిన్ల‌ను వినియోగించుకునేవారు.

అదేవిధంగా బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద కూడా వీటిని ఏర్పాటు చేయ‌డంతో ప్ర‌యాణికులు సైతం అన్న క్యాంట‌న్ల‌లో భోజ‌నం , టిఫిన్ చేసేవారు. అయితే.. ప్ర‌భుత్వం మారి .. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌… అన్నా క్యాంటీన్ల‌కు గ్ర‌హ‌ణం ప‌ట్టుకుంది. వాటిని మూసివేశారు. కొన్ని ప్రాంత‌ల్లో అన్నా క్యాంటీన్ల‌ను స‌చివాల‌యాలుగా మార్చేశారు. మ‌రికొన్ని చోట్ల మునిసిపాలిటీ మ‌రుగు దొడ్లుగా మార్చారు. ఇలా.. అన్నా క్యాంటీన్ల రూపు రేఖ‌లు మారిపోయాయి.

అయితే.. ప్ర‌జ‌ల్లో మాత్రం వీటి గురించి చ‌ర్చ మాత్రం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దీనిని కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. ప‌లువురు కీల‌క నాయ‌కులు, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, ప‌య్యావుల కేశ‌వ్‌, బోడే ప్ర‌సాద్‌, కేశినేని చిన్ని వంటివారు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో వీటిని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నారు. ఇక‌, మంగ‌ళ‌గిరిలోనూ.. నారా లోకేష్ మూడు ప్రాంతాల్లో వీటిని కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏర్పాటు చేసింది .. 4వ క్యాంటీన్ కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 6, 2024 6:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

39 seconds ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

56 minutes ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

1 hour ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

1 hour ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

3 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

9 hours ago