Political News

మంగ‌ళ‌గిరిలో అన్న క్యాంటీన్‌.. భువ‌నేశ్వ‌రి చేతుల మీదుగా!

ప్ర‌స్తుతం ‘నిజం గెలవాలి’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమణి.. నారా భువ‌నేశ్వ‌రి పార్టీ నేత‌ల‌తోనూ మ‌మేక‌మ‌వుతున్నారు. పార్టీ గురించి వారికి దిశానిర్దేశం చేస్తున్నా రు. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క‌మైన ప‌థ‌కంగా గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో పేర్కొన్న అన్నా క్యాంటీన్‌ను ఇక్క‌డ ప్రారంభించారు.

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిదిలోని రేవేంద్ర‌పాడు మండ‌లంలో భువ‌నేశ్వ‌రి ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి.. పేద‌ల‌కు అన్నం వ‌డ్డించారు. కేవ‌లం రూ.5 కే భోజనం, ఉద‌యం పూట టిఫిన్ అందించాల‌న్న సంకల్పంతో చంద్ర‌బాబు హ‌యాంలో అన్నా క్యాంటీన్ల‌కు శ్రీకారం చుట్టారు. వీటిని బాగానే ముందుకు తీసుకువెళ్లారు. దిన‌స‌రి కూలీలు, పేద‌లు, రోజు వారీ ప‌నులు చేసుకునే కార్మికులు, ఆటో , రిక్షా కార్మికులు ఈ క్యాంటిన్ల‌ను వినియోగించుకునేవారు.

అదేవిధంగా బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద కూడా వీటిని ఏర్పాటు చేయ‌డంతో ప్ర‌యాణికులు సైతం అన్న క్యాంట‌న్ల‌లో భోజ‌నం , టిఫిన్ చేసేవారు. అయితే.. ప్ర‌భుత్వం మారి .. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌… అన్నా క్యాంటీన్ల‌కు గ్ర‌హ‌ణం ప‌ట్టుకుంది. వాటిని మూసివేశారు. కొన్ని ప్రాంత‌ల్లో అన్నా క్యాంటీన్ల‌ను స‌చివాల‌యాలుగా మార్చేశారు. మ‌రికొన్ని చోట్ల మునిసిపాలిటీ మ‌రుగు దొడ్లుగా మార్చారు. ఇలా.. అన్నా క్యాంటీన్ల రూపు రేఖ‌లు మారిపోయాయి.

అయితే.. ప్ర‌జ‌ల్లో మాత్రం వీటి గురించి చ‌ర్చ మాత్రం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దీనిని కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. ప‌లువురు కీల‌క నాయ‌కులు, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, ప‌య్యావుల కేశ‌వ్‌, బోడే ప్ర‌సాద్‌, కేశినేని చిన్ని వంటివారు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో వీటిని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నారు. ఇక‌, మంగ‌ళ‌గిరిలోనూ.. నారా లోకేష్ మూడు ప్రాంతాల్లో వీటిని కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏర్పాటు చేసింది .. 4వ క్యాంటీన్ కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 6, 2024 6:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

9 minutes ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

4 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

9 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

10 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

10 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

11 hours ago