Political News

మంగ‌ళ‌గిరిలో అన్న క్యాంటీన్‌.. భువ‌నేశ్వ‌రి చేతుల మీదుగా!

ప్ర‌స్తుతం ‘నిజం గెలవాలి’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమణి.. నారా భువ‌నేశ్వ‌రి పార్టీ నేత‌ల‌తోనూ మ‌మేక‌మ‌వుతున్నారు. పార్టీ గురించి వారికి దిశానిర్దేశం చేస్తున్నా రు. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క‌మైన ప‌థ‌కంగా గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో పేర్కొన్న అన్నా క్యాంటీన్‌ను ఇక్క‌డ ప్రారంభించారు.

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిదిలోని రేవేంద్ర‌పాడు మండ‌లంలో భువ‌నేశ్వ‌రి ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి.. పేద‌ల‌కు అన్నం వ‌డ్డించారు. కేవ‌లం రూ.5 కే భోజనం, ఉద‌యం పూట టిఫిన్ అందించాల‌న్న సంకల్పంతో చంద్ర‌బాబు హ‌యాంలో అన్నా క్యాంటీన్ల‌కు శ్రీకారం చుట్టారు. వీటిని బాగానే ముందుకు తీసుకువెళ్లారు. దిన‌స‌రి కూలీలు, పేద‌లు, రోజు వారీ ప‌నులు చేసుకునే కార్మికులు, ఆటో , రిక్షా కార్మికులు ఈ క్యాంటిన్ల‌ను వినియోగించుకునేవారు.

అదేవిధంగా బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద కూడా వీటిని ఏర్పాటు చేయ‌డంతో ప్ర‌యాణికులు సైతం అన్న క్యాంట‌న్ల‌లో భోజ‌నం , టిఫిన్ చేసేవారు. అయితే.. ప్ర‌భుత్వం మారి .. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌… అన్నా క్యాంటీన్ల‌కు గ్ర‌హ‌ణం ప‌ట్టుకుంది. వాటిని మూసివేశారు. కొన్ని ప్రాంత‌ల్లో అన్నా క్యాంటీన్ల‌ను స‌చివాల‌యాలుగా మార్చేశారు. మ‌రికొన్ని చోట్ల మునిసిపాలిటీ మ‌రుగు దొడ్లుగా మార్చారు. ఇలా.. అన్నా క్యాంటీన్ల రూపు రేఖ‌లు మారిపోయాయి.

అయితే.. ప్ర‌జ‌ల్లో మాత్రం వీటి గురించి చ‌ర్చ మాత్రం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దీనిని కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. ప‌లువురు కీల‌క నాయ‌కులు, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, ప‌య్యావుల కేశ‌వ్‌, బోడే ప్ర‌సాద్‌, కేశినేని చిన్ని వంటివారు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో వీటిని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నారు. ఇక‌, మంగ‌ళ‌గిరిలోనూ.. నారా లోకేష్ మూడు ప్రాంతాల్లో వీటిని కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏర్పాటు చేసింది .. 4వ క్యాంటీన్ కావ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

24 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

1 hour ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

2 hours ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

4 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago