చడీచప్పుడు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రైవేటు బస్సులు తిరిగేస్తున్నాయి. ఇందుకు ఇరు ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. శనివారం నుంచే బుకింగ్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ బస్సులు తిరిగేస్తున్నాయి. ఓవైపు హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం.. మరోవైపు హైదరాబాద్-కర్నూలు-కడప-కర్నూలు మార్గాల్లో బస్సులు నడిపిస్తున్నారు. రెడ్ బస్, అబి బస్ లాంటి యాప్స్లో జోరుగా బుకింగ్స్ నడుస్తున్నాయి. కొన్ని బస్సుల్లో సోషల్ డిస్టెన్సింగ్తో సీటింగ్ ఏర్పాట్లు చేసి ఎక్కువ రేటుకు టికెట్లు అమ్ముతున్నారు. మరికొన్ని బస్సుల్లో అదేమీ లేదు.
ఇక ఆర్టీసీ బస్సుల సంగతే తేలాల్సి ఉంది. ఈ విషయంలో మూడు నెలలుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఎడతెగని చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. ఏపీకి తమ బస్సుల సంఖ్య పెంచి ఆదాయం పెంచుకోవాలని తెలంగాణ చూస్తుండగా.. ఈ ప్రతిపాదనను ఏపీ అంగీకరించట్లేదు. తమ రాష్ట్రానికి అటు నుంచి ఎన్ని బస్సులు వస్తాయో అన్నే బస్సులు తామూ నడుపుతామని తెలంగాణ అంటోంది. అలా చేస్తే తమకు ఆదాయం పడిపోతుందని ఏపీ అభ్యంతరపెడుతోంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ప్రజలు సొంత వాహనాలు, అద్దె కార్లతోనే ఇటు అటు రాకపోకలు సాగిస్తున్నారు.
This post was last modified on September 8, 2020 3:48 am
కమెడియన్ సత్య హీరోగా రూపొందిన జెట్లీ రేపు విడుదలకు రెడీ అయిపోయింది. ప్రమోషన్ల పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా…
ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్…
మనిషి తన పనులను మరింత సులభతరం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ సాగుతున్నాడు. అయితే అదే సాంకేతికతను వినియోగించి…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. వీ హనుమంతరావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. అంతేకాదు.. ఆయనకు మంత్రి…
ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాకు.. ఇలాంటి ఒక అధ్యక్షుడు పాలించాడా? అన్న అనుమానం భవిష్యత్ తరాలకు కలిగేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని…
టీఆర్ఎస్.. తెలుగు నేల రాజకీయాల్లో ఇట్టే పరిచయం అక్కర్లేని పేరు. ఓ ఉద్యమ పార్టీగా ప్రయాణం మొదలుపెట్టిన టీఆర్ఎస్,,, తెలంగాణ…