చడీచప్పుడు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రైవేటు బస్సులు తిరిగేస్తున్నాయి. ఇందుకు ఇరు ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. శనివారం నుంచే బుకింగ్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ బస్సులు తిరిగేస్తున్నాయి. ఓవైపు హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం.. మరోవైపు హైదరాబాద్-కర్నూలు-కడప-కర్నూలు మార్గాల్లో బస్సులు నడిపిస్తున్నారు. రెడ్ బస్, అబి బస్ లాంటి యాప్స్లో జోరుగా బుకింగ్స్ నడుస్తున్నాయి. కొన్ని బస్సుల్లో సోషల్ డిస్టెన్సింగ్తో సీటింగ్ ఏర్పాట్లు చేసి ఎక్కువ రేటుకు టికెట్లు అమ్ముతున్నారు. మరికొన్ని బస్సుల్లో అదేమీ లేదు.
ఇక ఆర్టీసీ బస్సుల సంగతే తేలాల్సి ఉంది. ఈ విషయంలో మూడు నెలలుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఎడతెగని చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. ఏపీకి తమ బస్సుల సంఖ్య పెంచి ఆదాయం పెంచుకోవాలని తెలంగాణ చూస్తుండగా.. ఈ ప్రతిపాదనను ఏపీ అంగీకరించట్లేదు. తమ రాష్ట్రానికి అటు నుంచి ఎన్ని బస్సులు వస్తాయో అన్నే బస్సులు తామూ నడుపుతామని తెలంగాణ అంటోంది. అలా చేస్తే తమకు ఆదాయం పడిపోతుందని ఏపీ అభ్యంతరపెడుతోంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ప్రజలు సొంత వాహనాలు, అద్దె కార్లతోనే ఇటు అటు రాకపోకలు సాగిస్తున్నారు.
This post was last modified on September 8, 2020 3:48 am
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…