Political News

ఏపీ టు తెలంగాణ‌.. బ‌స్సులు తిరిగేస్తున్నాయ్

చ‌డీచ‌ప్పుడు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఓ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల మ‌ధ్య ప్రైవేటు బ‌స్సులు తిరిగేస్తున్నాయి. ఇందుకు ఇరు ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తులు ల‌భించాయి. శ‌నివారం నుంచే బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. ఆల్రెడీ బ‌స్సులు తిరిగేస్తున్నాయి. ఓవైపు హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ‌-విశాఖ‌ప‌ట్నం.. మ‌రోవైపు హైద‌రాబాద్‌-క‌ర్నూలు-క‌డ‌ప‌-క‌ర్నూలు మార్గాల్లో బ‌స్సులు న‌డిపిస్తున్నారు. రెడ్ బ‌స్, అబి బ‌స్ లాంటి యాప్స్‌లో జోరుగా బుకింగ్స్ న‌డుస్తున్నాయి. కొన్ని బ‌స్సుల్లో సోష‌ల్ డిస్టెన్సింగ్‌తో సీటింగ్ ఏర్పాట్లు చేసి ఎక్కువ రేటుకు టికెట్లు అమ్ముతున్నారు. మ‌రికొన్ని బ‌స్సుల్లో అదేమీ లేదు.

ఇక ఆర్టీసీ బ‌స్సుల సంగ‌తే తేలాల్సి ఉంది. ఈ విష‌యంలో మూడు నెల‌లుగా ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొంది. రెండు రాష్ట్రాల‌ ఆర్టీసీ అధికారుల మ‌ధ్య ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు జ‌రిగినా ఫ‌లితం లేక‌పోయింది. ఏపీకి త‌మ బ‌స్సుల సంఖ్య పెంచి ఆదాయం పెంచుకోవాల‌ని తెలంగాణ చూస్తుండ‌గా.. ఈ ప్ర‌తిపాద‌న‌ను ఏపీ అంగీక‌రించ‌ట్లేదు. త‌మ రాష్ట్రానికి అటు నుంచి ఎన్ని బ‌స్సులు వ‌స్తాయో అన్నే బ‌స్సులు తామూ న‌డుపుతామ‌ని తెలంగాణ అంటోంది. అలా చేస్తే త‌మ‌కు ఆదాయం ప‌డిపోతుంద‌ని ఏపీ అభ్యంత‌ర‌పెడుతోంది. త్వ‌ర‌లోనే ఈ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. గ‌త నాలుగు నెల‌లుగా ప్ర‌జ‌లు సొంత వాహ‌నాలు, అద్దె కార్ల‌తోనే ఇటు అటు రాక‌పోక‌లు సాగిస్తున్నారు.

suman

Recent Posts

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

3 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

5 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

6 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

6 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

6 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

6 hours ago