Political News

ఏపీ టు తెలంగాణ‌.. బ‌స్సులు తిరిగేస్తున్నాయ్

చ‌డీచ‌ప్పుడు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఓ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల మ‌ధ్య ప్రైవేటు బ‌స్సులు తిరిగేస్తున్నాయి. ఇందుకు ఇరు ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తులు ల‌భించాయి. శ‌నివారం నుంచే బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. ఆల్రెడీ బ‌స్సులు తిరిగేస్తున్నాయి. ఓవైపు హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ‌-విశాఖ‌ప‌ట్నం.. మ‌రోవైపు హైద‌రాబాద్‌-క‌ర్నూలు-క‌డ‌ప‌-క‌ర్నూలు మార్గాల్లో బ‌స్సులు న‌డిపిస్తున్నారు. రెడ్ బ‌స్, అబి బ‌స్ లాంటి యాప్స్‌లో జోరుగా బుకింగ్స్ న‌డుస్తున్నాయి. కొన్ని బ‌స్సుల్లో సోష‌ల్ డిస్టెన్సింగ్‌తో సీటింగ్ ఏర్పాట్లు చేసి ఎక్కువ రేటుకు టికెట్లు అమ్ముతున్నారు. మ‌రికొన్ని బ‌స్సుల్లో అదేమీ లేదు.

ఇక ఆర్టీసీ బ‌స్సుల సంగ‌తే తేలాల్సి ఉంది. ఈ విష‌యంలో మూడు నెల‌లుగా ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొంది. రెండు రాష్ట్రాల‌ ఆర్టీసీ అధికారుల మ‌ధ్య ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు జ‌రిగినా ఫ‌లితం లేక‌పోయింది. ఏపీకి త‌మ బ‌స్సుల సంఖ్య పెంచి ఆదాయం పెంచుకోవాల‌ని తెలంగాణ చూస్తుండ‌గా.. ఈ ప్ర‌తిపాద‌న‌ను ఏపీ అంగీక‌రించ‌ట్లేదు. త‌మ రాష్ట్రానికి అటు నుంచి ఎన్ని బ‌స్సులు వ‌స్తాయో అన్నే బ‌స్సులు తామూ న‌డుపుతామ‌ని తెలంగాణ అంటోంది. అలా చేస్తే త‌మ‌కు ఆదాయం ప‌డిపోతుంద‌ని ఏపీ అభ్యంత‌ర‌పెడుతోంది. త్వ‌ర‌లోనే ఈ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. గ‌త నాలుగు నెల‌లుగా ప్ర‌జ‌లు సొంత వాహ‌నాలు, అద్దె కార్ల‌తోనే ఇటు అటు రాక‌పోక‌లు సాగిస్తున్నారు.

This post was last modified on September 8, 2020 3:48 am

Share
Show comments
Published by
suman

Recent Posts

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

37 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago