Political News

మీడియా అధిపతికి రాజ్యసభ ?

తొందరలోనే బీజేపీ తరపున ఒక మీడియా అధిపతికి రాజ్యసభ ఎంపీ పదవి లభించబోతోందని సమాచారం. చాలామంది మీడియా అధినేతలు బీజేపీతో బాగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ పద్దతి దక్షిణాదిలో తక్కువే కాని ఉత్తరాధిలో చాలా ఎక్కువ. మీడియా అధినేతల నుండి వివిధ మీడియాల్లో అత్యున్నత స్ధాయిలో పనిచేస్తున్న చాలామంది బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తుంటారు. ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి బాగా దగ్గరైన మీడియా అధిపతులు లేరనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణాను వదిలేస్తే ఏపీలో బీజేపీ ఉనికి నామమాత్రమే.

మీడియాలో రెండురాష్ట్రాల్లోను తమకు వస్తున్న ప్రచారాన్ని బాగా పెంచుకోవాలని కమలనాదులు అనుకున్నారట. అందుకనే ఒక మీడియా అధినేతను దగ్గరకు తీసుకోవటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలని అగ్రనేతలు డిసైడ్ అయినట్లు సమాచారం. ఒక టీవీ ఛానల్ అధినేతను పార్టీలో చేర్చుకుని రాజ్యసభ ఎంపీని చేయటానికి అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యిందని టాక్ వినబడుతోంది. ఈమధ్య హైదరాబాద్ కు వచ్చిన నరేంద్రమోడీ సదరు మీడియా అధినేత ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారట.

అలాగే మీడియా అధినేత కూడా ఢిల్లీకి వెళ్ళినపుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నీ విషయాలు మాట్లాడుకుని వచ్చారని తెలిసింది. పరిస్ధితులు అన్నీ అనుకూలిస్తే రాబోయే ఏప్రిల్ లోనే ఉత్తరప్రదేశ్ కోటాలో పార్టీ తరపున ఈ మీడియా అధిపతి నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఇది గనుక జరిగితే ఒక పార్టీలో డైరెక్టుగా చేరిపోయి రాజ్యసభ ఎంపీ అయినా మొదటి అధినేతగా సదరు మీడియా అధిపతి రికార్డు సృష్టిస్తారేమో.

ఇప్పటివరకు ఎంఐఎం తరపున శాసనమండలికి నామినేట్ అయిన మీడియా అధినేతలున్నారు, సీనియర్ జర్నలిస్టులున్నారు. ఈ వ్యవహారమంతా ముస్లిం మైనారిటీల వరకే పరిమితమైంది. ఎంఐఎం అధినేతలు ఇతర వర్గాలను దగ్గరకు చేరదీయరు, ఇతరులకు పదవులను ఇవ్వరు. కాబట్టి ఎంఐఎం వ్యవహారాలను ఎవరు పట్టించుకోరు. తన బలం సరిపోదుకాబట్టి తమ మిత్రపక్షాల నుండి మద్దతు తీసుకుని తమకిష్టమైన వాళ్ళనే కౌన్సిల్ కు పంపుతుంటారు. కానీ ఇపుడు మైన్ స్ట్రీమ్ మీడియా అధినేతలు ఒక పార్టీ తరపున అత్యున్నత చట్టసభకు వెళ్ళే అవకాశం రావటం మాత్రం ఇదే మొదటిసారని అనుకుంటున్నారు.

This post was last modified on February 5, 2024 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

36 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

2 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago