Political News

ఏపీ ఎన్నికల ప్రచారంలో కొత్త ముఖాలు

ఏపీలో ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకువస్తున్న ద‌రిమిలా.. కీల‌క‌మైన పార్టీలు .. ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంబించాయి. వైసీపీ సిద్ధం పేరుతో పార్టీ ప్ర‌చారాన్ని భీమిలిలో ప్రారంభించింది. అక్క‌డే సీఎం జ‌గ‌న్ పార్టీ ప్ర‌చారాన్ని శంఖారావంతో ప్రారంభించారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ద‌ఫా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రా..క‌ద‌లిరా! నినాదంతో ప్రారంభించారు. దాదాపు ఎన్నిక‌ల‌కు దీనినే కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ‌.. జ‌న‌సేన ఇంకేదైనా సూచిస్తే.. మార్చ‌నున్నారు.

ఇక‌, జ‌న‌సేన వారాహి యాత్ర పేరుతోనే ఎన్నికల‌ ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి ఈ ప్ర‌చారం ప్రారంభం కానుంది. ఈ మూడు కీల‌క పార్టీలూ ప్ర‌చారాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక‌, కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి కుమార్తెకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది. ఆమె ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. అయితే.. ప్ర‌స్తుతం ఏ పేరుతో మ‌రింత దూకుడుగా వెళ్లాలా? అనేదానిపై ఆ పార్టీ సీనియ‌ర్లు దృష్టి పెట్టారు. మొత్తానికి ఏదో ఒక పేరును నిర్ఱ‌యించ‌నున్నారు.

ఇక‌, చిన్నా చిత‌కా పార్టీలు సాధార‌ణ ప్ర‌చారంతోనే స‌రిపెట్ట‌నున్నాయి. ఇదిలావుంటే.. అధికారం కోసం.. కీల‌క పోరును సాగించ‌నున్న వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ పార్టీల‌కు పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్ర‌చార క‌ర్త‌లు బ‌రిలో దిగ‌నున్నారు.ఇప్ప‌టికే ష‌ర్మిల‌కు అండ‌గా.. తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు ఫైర్ బ్రాండ్లు ప్ర‌క‌ట‌న చేశారు. వీరిలో ఒక‌రు కొండా సురేఖ‌. ఈమె ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ష‌ర్మిలకు అండ‌గా ప్రచారంలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక‌, ఉమ్మ‌డి ఖ‌మ్మం మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి కూడా ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే.. పార్టీ అధిష్టానం ఓకే అంటే.. ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. సీఎం రేవంత్ కూడా.. ఇదే మాట చెప్పారు. పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం కోరుకుంటే. తాను కూడా ఏపీలో ప‌ర్య‌టించి ప్ర‌చారం చేస్తాన‌న్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. పొరుగు రాష్ట్రం నుంచి వ‌చ్చే వారు లేకున్నా… విదేశాల్లో ఉంటున్న ప్ర‌వాస తెలుగు దేశం పార్టీ సీనియ‌ర్లు ప్రచారానికి రానున్నారు.

అదేవిధంగా రాజ‌ధాని రైతులు కూడా జిల్లాల వారీగా ఎంచుకుని ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు తాజాగా తీర్మానం చేశారు. అయితే.. ఇది టీడీపీకి నేరుగా కాకుండా వైసీపీకి వ్య‌తిరేకంగా సాగ‌నుంది. మ‌రోవైపు.. జ‌న‌సేన‌కు ఇండ‌స్ట్రీ నుంచి కొంత మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాన పార్టీ వైసీపీకి పెద్ద‌గా ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఈ పార్టీకి ప్ర‌వాసంలో అయినా.. ఇత‌ర రాష్ట్రాల నుంచైనా వ‌చ్చి.. ప్ర‌చారం చేసేందుకు ఎవ‌రూ లేర‌నే తెలుస్తోంది. కేవ‌లం జ‌గ‌న్‌.. మాత్రమే ఐకాన్‌గా ప్ర‌చారాన్ని ముందుకు తీసుకువెళ్ల‌నున్నార‌ని స‌మాచారం.

This post was last modified on February 5, 2024 9:37 pm

Share
Show comments

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

3 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

4 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

4 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

6 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

6 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

8 hours ago