Political News

ఏపీ ఎన్నికల ప్రచారంలో కొత్త ముఖాలు

ఏపీలో ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకువస్తున్న ద‌రిమిలా.. కీల‌క‌మైన పార్టీలు .. ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంబించాయి. వైసీపీ సిద్ధం పేరుతో పార్టీ ప్ర‌చారాన్ని భీమిలిలో ప్రారంభించింది. అక్క‌డే సీఎం జ‌గ‌న్ పార్టీ ప్ర‌చారాన్ని శంఖారావంతో ప్రారంభించారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ద‌ఫా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రా..క‌ద‌లిరా! నినాదంతో ప్రారంభించారు. దాదాపు ఎన్నిక‌ల‌కు దీనినే కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ‌.. జ‌న‌సేన ఇంకేదైనా సూచిస్తే.. మార్చ‌నున్నారు.

ఇక‌, జ‌న‌సేన వారాహి యాత్ర పేరుతోనే ఎన్నికల‌ ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి ఈ ప్ర‌చారం ప్రారంభం కానుంది. ఈ మూడు కీల‌క పార్టీలూ ప్ర‌చారాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక‌, కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి కుమార్తెకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది. ఆమె ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. అయితే.. ప్ర‌స్తుతం ఏ పేరుతో మ‌రింత దూకుడుగా వెళ్లాలా? అనేదానిపై ఆ పార్టీ సీనియ‌ర్లు దృష్టి పెట్టారు. మొత్తానికి ఏదో ఒక పేరును నిర్ఱ‌యించ‌నున్నారు.

ఇక‌, చిన్నా చిత‌కా పార్టీలు సాధార‌ణ ప్ర‌చారంతోనే స‌రిపెట్ట‌నున్నాయి. ఇదిలావుంటే.. అధికారం కోసం.. కీల‌క పోరును సాగించ‌నున్న వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ పార్టీల‌కు పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్ర‌చార క‌ర్త‌లు బ‌రిలో దిగ‌నున్నారు.ఇప్ప‌టికే ష‌ర్మిల‌కు అండ‌గా.. తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు ఫైర్ బ్రాండ్లు ప్ర‌క‌ట‌న చేశారు. వీరిలో ఒక‌రు కొండా సురేఖ‌. ఈమె ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ష‌ర్మిలకు అండ‌గా ప్రచారంలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక‌, ఉమ్మ‌డి ఖ‌మ్మం మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి కూడా ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే.. పార్టీ అధిష్టానం ఓకే అంటే.. ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. సీఎం రేవంత్ కూడా.. ఇదే మాట చెప్పారు. పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం కోరుకుంటే. తాను కూడా ఏపీలో ప‌ర్య‌టించి ప్ర‌చారం చేస్తాన‌న్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. పొరుగు రాష్ట్రం నుంచి వ‌చ్చే వారు లేకున్నా… విదేశాల్లో ఉంటున్న ప్ర‌వాస తెలుగు దేశం పార్టీ సీనియ‌ర్లు ప్రచారానికి రానున్నారు.

అదేవిధంగా రాజ‌ధాని రైతులు కూడా జిల్లాల వారీగా ఎంచుకుని ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు తాజాగా తీర్మానం చేశారు. అయితే.. ఇది టీడీపీకి నేరుగా కాకుండా వైసీపీకి వ్య‌తిరేకంగా సాగ‌నుంది. మ‌రోవైపు.. జ‌న‌సేన‌కు ఇండ‌స్ట్రీ నుంచి కొంత మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాన పార్టీ వైసీపీకి పెద్ద‌గా ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఈ పార్టీకి ప్ర‌వాసంలో అయినా.. ఇత‌ర రాష్ట్రాల నుంచైనా వ‌చ్చి.. ప్ర‌చారం చేసేందుకు ఎవ‌రూ లేర‌నే తెలుస్తోంది. కేవ‌లం జ‌గ‌న్‌.. మాత్రమే ఐకాన్‌గా ప్ర‌చారాన్ని ముందుకు తీసుకువెళ్ల‌నున్నార‌ని స‌మాచారం.

Satya

Recent Posts

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

6 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

7 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

9 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

9 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

9 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

10 hours ago