Political News

ఏపీ ఎన్నికల ప్రచారంలో కొత్త ముఖాలు

ఏపీలో ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకువస్తున్న ద‌రిమిలా.. కీల‌క‌మైన పార్టీలు .. ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంబించాయి. వైసీపీ సిద్ధం పేరుతో పార్టీ ప్ర‌చారాన్ని భీమిలిలో ప్రారంభించింది. అక్క‌డే సీఎం జ‌గ‌న్ పార్టీ ప్ర‌చారాన్ని శంఖారావంతో ప్రారంభించారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ద‌ఫా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రా..క‌ద‌లిరా! నినాదంతో ప్రారంభించారు. దాదాపు ఎన్నిక‌ల‌కు దీనినే కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ‌.. జ‌న‌సేన ఇంకేదైనా సూచిస్తే.. మార్చ‌నున్నారు.

ఇక‌, జ‌న‌సేన వారాహి యాత్ర పేరుతోనే ఎన్నికల‌ ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి ఈ ప్ర‌చారం ప్రారంభం కానుంది. ఈ మూడు కీల‌క పార్టీలూ ప్ర‌చారాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక‌, కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి కుమార్తెకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది. ఆమె ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. అయితే.. ప్ర‌స్తుతం ఏ పేరుతో మ‌రింత దూకుడుగా వెళ్లాలా? అనేదానిపై ఆ పార్టీ సీనియ‌ర్లు దృష్టి పెట్టారు. మొత్తానికి ఏదో ఒక పేరును నిర్ఱ‌యించ‌నున్నారు.

ఇక‌, చిన్నా చిత‌కా పార్టీలు సాధార‌ణ ప్ర‌చారంతోనే స‌రిపెట్ట‌నున్నాయి. ఇదిలావుంటే.. అధికారం కోసం.. కీల‌క పోరును సాగించ‌నున్న వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ పార్టీల‌కు పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్ర‌చార క‌ర్త‌లు బ‌రిలో దిగ‌నున్నారు.ఇప్ప‌టికే ష‌ర్మిల‌కు అండ‌గా.. తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు ఫైర్ బ్రాండ్లు ప్ర‌క‌ట‌న చేశారు. వీరిలో ఒక‌రు కొండా సురేఖ‌. ఈమె ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ష‌ర్మిలకు అండ‌గా ప్రచారంలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక‌, ఉమ్మ‌డి ఖ‌మ్మం మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి కూడా ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే.. పార్టీ అధిష్టానం ఓకే అంటే.. ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. సీఎం రేవంత్ కూడా.. ఇదే మాట చెప్పారు. పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం కోరుకుంటే. తాను కూడా ఏపీలో ప‌ర్య‌టించి ప్ర‌చారం చేస్తాన‌న్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. పొరుగు రాష్ట్రం నుంచి వ‌చ్చే వారు లేకున్నా… విదేశాల్లో ఉంటున్న ప్ర‌వాస తెలుగు దేశం పార్టీ సీనియ‌ర్లు ప్రచారానికి రానున్నారు.

అదేవిధంగా రాజ‌ధాని రైతులు కూడా జిల్లాల వారీగా ఎంచుకుని ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు తాజాగా తీర్మానం చేశారు. అయితే.. ఇది టీడీపీకి నేరుగా కాకుండా వైసీపీకి వ్య‌తిరేకంగా సాగ‌నుంది. మ‌రోవైపు.. జ‌న‌సేన‌కు ఇండ‌స్ట్రీ నుంచి కొంత మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాన పార్టీ వైసీపీకి పెద్ద‌గా ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఈ పార్టీకి ప్ర‌వాసంలో అయినా.. ఇత‌ర రాష్ట్రాల నుంచైనా వ‌చ్చి.. ప్ర‌చారం చేసేందుకు ఎవ‌రూ లేర‌నే తెలుస్తోంది. కేవ‌లం జ‌గ‌న్‌.. మాత్రమే ఐకాన్‌గా ప్ర‌చారాన్ని ముందుకు తీసుకువెళ్ల‌నున్నార‌ని స‌మాచారం.

This post was last modified on February 5, 2024 9:37 pm

Share
Show comments

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

5 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

7 hours ago