Political News

తెలంగాణా సేఫ్ జోన్ అయిపోయిందా ?

క్యాంప్ పాలిటిక్స్ కు తెలంగాణా సేఫ్ జోన్ అయిపోయినట్లుంది. ముఖ్యంగా నాన్ ఎన్డీయే పార్టీలకు తమ రాష్ట్రాల్లో ఏ సమస్యలు వచ్చినా వెంటనే తెలంగాణాయే గుర్తుకొస్తోంది. ఈమధ్యనే జార్ఖండ్ ఎంఎల్ఏలతో మూడు రోజులు తెలంగాణాలోనే క్యాంపు నడిచింది. ఇపుడు బీహార్లోని కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఇక్కడికే తరలించారు. ఎన్డీయే ప్రభుత్వం దెబ్బకు నాన్ ఎన్డీయే ప్రభుత్వాలు చిగురుటాకుల్లాగ వణికిపోతున్న విషయం తెలిసిందే. నాన్ ఎన్డీయే ప్రభుత్వాలను ఏదో కారణంతో కూల్చేయటం లేదా అస్ధిరపరచటమే టార్గెట్ గా బీజేపీ పనిచేస్తోంది.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అవినీతిలో కూరుకుపోవటంతో ఈడీ అరెస్టుచేసింది. ఆయన స్ధానంలో చంపా సోరేన్ ను పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎన్నుకున్నది. అయితే తమ పార్టీ ఎంఎల్ఏలను బీజేపీ ఎక్కడ తన్నుకుపోతుందో అన్న భయంతో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంఎల్ఏలను ముఖ్యమంత్రి చంపా క్యాంపు నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నవెంటనే చంపాకు గుర్తుకొచ్చింది తెలంగాణాయే. తమ 30 మంది ఎంఎల్ఏలను కాపాడుకోవటమే చంపాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇండియా కూటమిలో భాగంగా కాబట్టి జేఎంఎం ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ మీదపడింది. అందుకనే వెంటనే ఎంఎల్ఏలను తెలంగాణాకు తరలించారు.

సోమవారం రాంచిలో బలనిరూపణ ఉంది కాబట్టి క్యాంపులోని ఎంఎల్ఏలందరినీ మళ్ళీ రాంచికి తరలించారు. ఇది అయిపోగానే వెంటనే బీహార్లో సమస్య ముంచుకొచ్చింది. ఇండియా కూటమి నుండి నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. దాంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ బలనిరూపణ చేసుకోవాల్సొచ్చింది. అసెంబ్లీ వేదికగా బలనిరూపణకు రంగం సిద్ధమైంది.

అందుకని కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎంఎల్ఏలను కాపాడుకోవాల్సిన అవసరం అధిష్టానంపై పడింది. దాంతో వెంటనే అందరిని తెలంగాణాకు తరలించారు. ఇబ్రహింపట్నంలోని మంచాల మండలంలోని ఒక రిసార్ట్స్ లో వీళ్ళందరినీ ఉంచారు. అలాగే ఆర్జేడీ ఎంఎల్ఏలను ఆపార్టీ అధినేతలు క్యాంపుకు తరలించారు. రేపు ఢిల్లీలో ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఇదే పరిస్ధితి ఎదురైతే వాళ్ళని కూడా తెలంగాణాకే తరలించేట్లున్నారు. మొత్తానికి నాన్ ఎన్డీయే ప్రభుత్వాలకు తెలంగాణా సేఫ్ జోన్ అయిపోయినట్లుంది.

This post was last modified on February 5, 2024 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago