Political News

లోకేష్‌, చంద్ర‌బాబుల‌ను తిట్టాల‌ని జ‌గ‌న్ వేధించారు: వ‌సంత‌

వైసీపీ ఎమ్మెల్యే, మైల‌వ‌రం నాయ‌కుడు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌.. ఓపెన్ అయిపోయారు. త్వ‌ర‌లోనే ఆయ‌న పార్టీకిగుడ్ బై చెప్ప‌నున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ కూడా మైల‌వ‌రం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా తిరుప‌తిరావును నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌త‌న అనుచ‌రులు, శ్రేణుల‌తో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నారా లోకేష్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబును ప‌దే ప‌దే తిట్టాల‌ని, వారిని డ్యామేజీ చేసేలా కామెంట్లు చేయాల‌ని సీఎంజ‌గ‌న్ త‌న‌పై ఒత్తిడి తెచ్చిన‌ట్టు తెలిపారు.

అయితే, తాను మృదు స్వ‌భావిన‌ని, త‌న తండ్రి నాగేశ్వ‌రరావు రాజ‌కీయాల‌నే తాను కూడా పుణికి పుచ్చుకున్నాన‌ని.. కాబట్టి అన‌వ‌స‌రంగా ఒక‌రిపై నోరు పారేసుకోలేన‌ని తేల్చి చెప్పిన‌ట్టు తెలిపారు. అందుకే త‌న‌కు సీఎం అప్పాయింట్ మెంటు ఇవ్వ‌డం మానేశార‌ని చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌ను ఎన్నిసార్లు విన్న‌వించినా ఒక్క‌రు కూడా ప‌ట్టించుకోలేద‌న్నారు. ఒకే ఒక్క‌సారి మైనింగ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వినిపించుకున్నార‌ని, కానీ.. ఆయ‌న కూడా ఏమీ చేయ‌లేక పోయార‌ని తెలిపారు.

“నేను నా అనుచ‌రుల‌ను తీసుకుని ముఖ్య‌మంత్రిని క‌లిసేందుకు ప్ర‌య‌త్నించా. కానీ..న‌న్ను అడ్డుకున్నారు. క‌నీసం మొహం కూడా చూసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. చాలా బాధ‌ప‌డ్డా.” అని వ‌సంత వ్యాఖ్యానించారు. పార్టీలో ఇమ‌డ‌గ‌లిగే ప‌రిస్థితి లేద‌ని చెప్పినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని కొంద‌రు క‌బ్జా చేశార‌ని.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో తాను నియోజ‌క‌వ‌ర్గంలోని కొంత భాగానే ఎమ్మెల్యేగా ఉండాల్సి వ‌చ్చింద‌న్నారు.

మైల‌వ‌రం నుంచి పెడ‌న వెళ్లిన ఓ నేత‌.. ఇక్క‌డ గ్రూపులు పెట్టి న‌న్ను ఇబ్బంది పెట్టారని అన్నారు. 2014లో మైల‌వ‌రంలో ఓడిపోయిన నాయ‌కుడు.. త‌న‌పై పెత్త‌నం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను ప్ర‌శాంతంగా ప‌నిచేయ నీయ‌లేద‌న్నారు. ఏడాదిన్న‌ర‌గా త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేశార‌ని వ‌సంత వ్యాఖ్యానించారు. ఎన్నోసార్లు పార్టీ మార‌బోన‌ని చెప్పాన్నారు. కానీ, సొంత పార్టీ నేత‌లే త‌న‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేశార‌ని చెప్పారు. త‌న భ‌విష్య‌త్తును త్వ‌ర‌లోనే చెబుతాన‌న్నారు.

This post was last modified on February 5, 2024 2:33 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

15 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

59 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago