Political News

జగన్ పై బీజేపీకి ప్రేమ తగ్గలేదుగా

టీడీపీ చాలా సీరియ‌స్‌గా అడిగిన ప్ర‌శ్న‌కు.. బీజేపీ అంతే లైట్‌గా ఆన్స‌ర్ ఇచ్చిన ఘ‌ట‌న సోమ‌వారం పార్ల‌మెంటులో ఏపీ పార్ల‌మెంటు స‌భ్యుల‌ను నివ్వెర‌పాటుకు గురిచేసింది. లోక్‌సభ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు మాట్లాడుతూ.. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలిపారు. దీంతో రాష్ట్రం ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంద‌న్నారు. ఉద్యోగుల‌కు వేత‌నాలు స‌రిగా చెల్లించ‌డం లేద‌ని, కీల‌క మౌలిక స‌దుపాయాలైన ర‌హ‌దారుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించ‌డం లేదని వివ‌రించారు.

అదేవిధంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న రాష్ట్రానికి ఇస్తున్న నిధుల‌ను కూడా ప్ర‌భుత్వం దారి మ‌ళ్లిస్తోంద‌ని రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటించ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఎఫ్ ఆర్ బీఎం ప‌రిమితుల‌కు మించి రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌న్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర కార్పొరేష‌న్లను అడ్డు పెట్టుకుని కూడా మ‌రిన్ని అప్పులు చేస్తోంద‌ని తెలిపారు. మ‌ద్యం నిషేధిస్తామ‌ని చెప్పిన రాష్ట్ర ప్ర‌భుత్వం బేవ‌రేజెస్ బాండ్ల‌ను విక్ర‌యించి మ‌ద్యంపైనా మ‌రిన్ని అప్పులు చేస్తోంద‌ని వివ‌రించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెల‌పాల‌ని ఆయ‌న సీరియ‌స్‌గానే ప్ర‌శ్నించారు.

అయితే, రామ్మోహ‌న్ నాయుడు లోక్ స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చాలా తాపీగా, ఏమాత్రం సీరియ‌స్ నెస్ లేకుండానే స‌మాధాన‌మిచ్చారు. FRBM ప‌రిమితి అనేది రాష్ట్రాలను బ‌ట్టి ఉంటుంద‌ని తెలిపారు. దీనిపై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల‌లో FRBM ప‌రిమితిపై చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని పేర్కొన్నారు. ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిమితికి మించి అప్పులు చేస్తోంద‌న్న వ్య‌వ‌హారంపై స్పందిస్తూ.. ఆర్టిక‌ల్ 293 ప్ర‌కారం దృష్టి సారిస్తామ‌న్నారు. అంత‌కుమించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నించిన వారు.. జ‌గ‌న్ స‌ర్కారుపై బీజేపీ ప్రేమ అంటే ఇలానే ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 5, 2024 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago