Political News

జ‌గ‌న్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లోని మాడుగుల నియోజ‌కవర్గంలో తాజాగా నిర్వ‌హించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌లో చంద్ర‌బాబు ఆసాంతం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. “మీకోసం బ‌ట‌న్ నొక్కుతున్నాను.. అని దొంగ మాట‌లు చెబుతున్నాడు. ఆయ‌నేమ‌న్నా.. ఆయ‌న జేబులో ముల్లె మీకు పంచుతున్నాడా? బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా ప్ర‌తి మ‌హిళ‌కు, ప్ర‌తి కుటుంబానికి రూ.8 ల‌క్ష‌ల మేర‌కు ముంచేశాదు. ఇలాంటి సీఎం మ‌న‌కు అవ‌స‌ర‌మా? ” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా.. అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల్లోనూ ప్ర‌జ‌లు ఆయ‌న ఫ్యాన్ కు ఉన్న మూడు రెక్క‌ల‌ను విరిచేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, రెక్క‌లు లేని మొండి ఫ్యాన్‌ను జ‌గ‌న్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌గా ఇచ్చి.. టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

ఆర్టీసీ బ‌స్సుల్లో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణంచేసే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తామన్నారు. విశాఖ‌ను తాను అభివృద్ధిచేస్తే.. లూలూ వంటి కంపెనీల‌ను శ్ర‌మ‌కోర్చి తీసుకువ‌స్తే.. జ‌గ‌న్ వారిని త‌రిమి కొట్టి వారికి కేటాయించిన భూముల‌ను దోచుకున్నాడ‌ని ఆరోపించారు. విశాఖ‌లో ఎక్క‌డ అభివృద్ధి జ‌రిగిందో చెప్పాల‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌న‌డానికి ఇంత‌క‌న్నా ఉదాహ‌ర‌ణ ఏం కావాల‌నిఆయ‌న ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వ అరాచ‌కాలు.. ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్ప‌డానికి ఎస్సీ డ్రైవ‌ర్‌ను చంపేసి.. ఇంటికి శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేయ‌డ‌మే ఉదాహ‌ర‌ణ‌గా చంద్ర‌బాబు చెప్పారు. తాను విశాఖ‌కు తెచ్చిన కంపెనీల‌ను ఏ ఒక్క‌దానినీ బ‌త‌క‌నివ్వ‌లేద‌న్నారు. దోచుకోవ‌డం త‌ప్ప‌.. జ‌గ‌న్‌కు ఉత్త‌రాంధ్ర‌పై ఎలాంటి ప్రేమా లేద‌న్నారు. గంజాయి అమ్ముతూ.. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో దొరికిపోయార‌ని, త‌హ‌సీల్దార్ ర‌మ‌ణ‌య్య‌ను దారుణంగా ఆయ‌న ఇంట్లోనే చంపేశార‌ని.. అస‌లు రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్నాయా? అని చంద్ర‌బాబు నిల‌దీశారు. జ‌గ‌న్ ఇచ్చే ప్ర‌తి రూపాయి.. ప్ర‌జ‌ల‌ద‌ని, లేక‌పోతే..కేంద్రం ఇస్తోంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 5, 2024 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

53 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago