Political News

టార్గెట్ 17: సీఎం రేవంత్ దూకుడు

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌లే ధ్యేయంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బ‌ల‌మైన అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చేముందు ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల్లో తాజాగా మ‌రో రెండు గ్యారెంటీల‌ను ఆయ‌న ప‌చ్చ జెండా ఊపారు. తాజాగా జ‌రిగిన కేబినెట్‌లో భేటీలో సీఎం రేవంత్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. క్షేత్ర‌స్థాయిలో అత్యంత ప్ర‌భావం చూపించ‌గ‌ల‌ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది చాలా కీల‌క‌మైన నిర్ణ‌య‌మ‌ని సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు.

వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు(TS) బదులుగా టీజీగా(TG) మారుస్తూ సీఎం రేవంత్ ఆధ్వ‌రంలో జ‌రిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేస‌మ‌యంలో తెలంగాణ తల్లి రూపురేఖల్లోనూ మార్పులు చేయనున్నారు. ఈ మేర‌కు కేబినెట్ తీసుకున్న ప‌లు నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఇవీ.. కీల‌క నిర్ణ‌యాలు

  • పేద‌ల‌కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
  • అర్హులైన వారికి రూ.500 గ్యాస్ సిలిండర్ త‌క్ష‌ణ అమ‌లు
  • ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్పు
  • తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు
  • తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర రాజముద్రలో మార్పు
  • సీఎం రేవంత్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు
  • ఐటీఐ కాలేజీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా అప్‌గ్రేడ్
  • నూతన హై కోర్టుకు భూ కేటాయింపు
  • వ్యవసాయ శాఖలోని ఖాళీల భ‌ర్తీ
  • డిసెంబ‌రు నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ

This post was last modified on February 5, 2024 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago