Political News

టార్గెట్ 17: సీఎం రేవంత్ దూకుడు

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌లే ధ్యేయంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బ‌ల‌మైన అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చేముందు ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల్లో తాజాగా మ‌రో రెండు గ్యారెంటీల‌ను ఆయ‌న ప‌చ్చ జెండా ఊపారు. తాజాగా జ‌రిగిన కేబినెట్‌లో భేటీలో సీఎం రేవంత్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. క్షేత్ర‌స్థాయిలో అత్యంత ప్ర‌భావం చూపించ‌గ‌ల‌ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది చాలా కీల‌క‌మైన నిర్ణ‌య‌మ‌ని సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు.

వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు(TS) బదులుగా టీజీగా(TG) మారుస్తూ సీఎం రేవంత్ ఆధ్వ‌రంలో జ‌రిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేస‌మ‌యంలో తెలంగాణ తల్లి రూపురేఖల్లోనూ మార్పులు చేయనున్నారు. ఈ మేర‌కు కేబినెట్ తీసుకున్న ప‌లు నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఇవీ.. కీల‌క నిర్ణ‌యాలు

  • పేద‌ల‌కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
  • అర్హులైన వారికి రూ.500 గ్యాస్ సిలిండర్ త‌క్ష‌ణ అమ‌లు
  • ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్పు
  • తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు
  • తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర రాజముద్రలో మార్పు
  • సీఎం రేవంత్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు
  • ఐటీఐ కాలేజీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా అప్‌గ్రేడ్
  • నూతన హై కోర్టుకు భూ కేటాయింపు
  • వ్యవసాయ శాఖలోని ఖాళీల భ‌ర్తీ
  • డిసెంబ‌రు నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ

This post was last modified on February 5, 2024 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago