రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం తెలంగాణా కాంగ్రెస్ లో పోటీ పెరిగిపోయింది. టికెట్ల కోసం ఇంతమంది దరఖాస్తులు చేస్తారని పార్టీ నాయకత్వమే ఊహించలేదు. మొత్తం 17 నియోజకవర్గాలకు 306 మంది నేతలు దరఖాస్తులు చేశారు. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 దరఖాస్తులు వచ్చినట్లయ్యింది. వీటిల్లో అత్యధికంగా ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ నియోజకవర్గాల్లో పోటీకి పోటీ చాలా తీవ్రంగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చింది సింపుల్ మెజారిటి మాత్రమే. 119 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గెలుచుకోవాల్సిన సీట్లు 61 మాత్రమే. కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 64 సీట్లు మాత్రమే. అంటే చాలా సింపుల్ మెజారిటితో పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి సింపుల్ మెజారిటితో వచ్చిన పార్టీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకింత పోటీ ఉన్నట్లు ?
ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత బాగా పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో ఇప్పటికే రెండు అమల్లోకి తెచ్చారు. మరో రెండింటిని తొందరలోనే అమలు చేయబోతున్నారు. మిగిలిన రెండు హామీల అమలుకు కసరత్తులు జరుగుతున్నాయి. హామీల అమలును పక్కన పెట్టేస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రేవంత్ మొదలుపెట్టిన ప్రజాదర్బార్ కు జనాల్లో మంచి స్పందన మొదలైంది.
రెండున్నర నెలల పాలనలో ఎక్కడా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదు. కేసీయార్ పదేళ్ళపాలనలో జనాల్లో పెరిగిపోయిన అసంతృప్తిని రేవంత్ తగ్గిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో సానుకూల స్పందన పెరుగుతోంది. అందుకనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేస్తే గెలుపు ఖాయమని నేతల్లో నమ్మకం పెరిగిపోతోంది. అందుకనే టికెట్ల కోసం ఇంత పోటీ పెరిగిపోతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ దాదాపు స్వీప్ చేసేసింది. అదే రిజల్టు రిపీట్ అవుతుందన్న నమ్మకంతోనే టికెట్ల కోసం నేతలు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చివరకు టికెట్లు ఎవరికి దక్కుతాయో చూడాలి.
This post was last modified on February 6, 2024 10:11 am
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…