Political News

కాంగ్రెస్ లో ఇంత పోటీ ఉందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం తెలంగాణా కాంగ్రెస్ లో పోటీ పెరిగిపోయింది. టికెట్ల కోసం ఇంతమంది దరఖాస్తులు చేస్తారని పార్టీ నాయకత్వమే ఊహించలేదు. మొత్తం 17 నియోజకవర్గాలకు 306 మంది నేతలు దరఖాస్తులు చేశారు. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 దరఖాస్తులు వచ్చినట్లయ్యింది. వీటిల్లో అత్యధికంగా ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ నియోజకవర్గాల్లో పోటీకి పోటీ చాలా తీవ్రంగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చింది సింపుల్ మెజారిటి మాత్రమే. 119 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గెలుచుకోవాల్సిన సీట్లు 61 మాత్రమే. కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 64 సీట్లు మాత్రమే. అంటే చాలా సింపుల్ మెజారిటితో పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి సింపుల్ మెజారిటితో వచ్చిన పార్టీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకింత పోటీ ఉన్నట్లు ?

ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత బాగా పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో ఇప్పటికే రెండు అమల్లోకి తెచ్చారు. మరో రెండింటిని తొందరలోనే అమలు చేయబోతున్నారు. మిగిలిన రెండు హామీల అమలుకు కసరత్తులు జరుగుతున్నాయి. హామీల అమలును పక్కన పెట్టేస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రేవంత్ మొదలుపెట్టిన ప్రజాదర్బార్ కు జనాల్లో మంచి స్పందన మొదలైంది.

రెండున్నర నెలల పాలనలో ఎక్కడా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదు. కేసీయార్ పదేళ్ళపాలనలో జనాల్లో పెరిగిపోయిన అసంతృప్తిని రేవంత్ తగ్గిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో సానుకూల స్పందన పెరుగుతోంది. అందుకనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేస్తే గెలుపు ఖాయమని నేతల్లో నమ్మకం పెరిగిపోతోంది. అందుకనే టికెట్ల కోసం ఇంత పోటీ పెరిగిపోతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ దాదాపు స్వీప్ చేసేసింది. అదే రిజల్టు రిపీట్ అవుతుందన్న నమ్మకంతోనే టికెట్ల కోసం నేతలు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చివరకు టికెట్లు ఎవరికి దక్కుతాయో చూడాలి.

This post was last modified on February 6, 2024 10:11 am

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

1 hour ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

1 hour ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

3 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago