Political News

ఏపీలో రేపటి నుంచి రచ్చరచ్చే

ఏపీలో కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లకు సంబంధించిన ప్రచారం ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. దీంతో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. స‌భ‌లు, స‌మావేశాలు.. ఎటు చూసినా.. స‌ల‌స‌ల కాగుతున్న రాజ‌కీయాలే క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. ఒక‌రు సిద్ధం స‌భ‌ల‌తో వేడి పుట్టిస్తే.. మ‌రొక‌రు రా.. క‌ద‌లిరా! అంటూ.. మ‌రింత సెగ‌లు పుట్టిస్తున్నారు. ఇక‌, ఇంకోవైపు.. జ‌న‌సేన వారాహి యాత్ర కూడా ప్రారంభం కానుంది. మ‌రోవైపు, కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల కూడా యాత్ర‌ల‌కు రెడీ అవుతున్నారు.

ఇలా.. రాష్ట్రంలో రాజ‌కీయ వేడి.. హాట్ హాట్‌గా కొన‌సాగుతున్న క్ర‌మంలో మ‌రో సెగ సోమ‌వారం నుంచి మ‌రింత ర‌గులుకోనుంది. సోమవారం నుంచి ఏపీ అసెంబ్ల బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న ఆఖరి బ‌డ్జెట్ ఇదే. పైగా స‌మావేశాలు కూడా ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఇదిలావుంటే.. ఈ స‌మావేశాల‌ను ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా ముగించాల‌ని అధికార‌పక్షం ప్ర‌య‌త్నిస్తోంది.

అయితే. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మాత్రం.. క‌నీసం 10 రోజ‌లు అయినా.. స‌మావేశాలు పెట్టాల‌ని డిమాండ్ చేస్తోంది. ఇక‌, స‌మావేశాల్లో కేవ‌లం బ‌డ్జెట‌పైనే చ‌ర్చ కాకుండా.. త‌మకు ప్ర‌త్యేక అంశాలు ఉన్నాయ‌ని టీడీపీ చెబుతోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పోల‌వ‌రం, దాడులు, పోలీసుల కేసులు ఇలా .. అనేక అంశాల‌ను టీడీపీ ప్రస్తావిస్తోంది. మ‌రోవైపు.. వైసీపీ నుంచి స‌స్పెండ్ అయిన ఎమ్మెల్యేల‌కు నోటీసులు ఇచ్చి.. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారి విష‌యంలో మౌనంగా ఉండడాన్ని కూడా స‌భ‌లో లేవ‌నెత్త‌నున్నారు.

మొత్తంగా టీడీపీ చాలా వ్యూహాత్మ‌కంగా అస్త్ర శ‌స్త్రాలు రెడీ చేసుకుంది. అయితే.. ప‌రిస్థితి ఎలా ఉన్నా.. త‌ట్టుకుని ముందుకు సాగాల‌ని.. వైసీపీ కూడా రెడీఅయింది. గ‌త స‌భ‌లో పూర్తిగా టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్టుగా ఈ ద‌ఫా కూడా అదే సూత్రాన్ని పాటించాల‌ని భావిస్తోంది. దీంతో అసెంబ్లీ వేదిక‌గా.. మాట‌ల తూటాలు, స‌వాళ్లు మ‌రింత పెర‌గ‌నున్నాయి. పైగా ఎన్నిక‌ల‌కు ముందు కావ‌డంతో ఈ వేడి మ‌రింత రాజుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 4, 2024 9:31 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

24 minutes ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

45 minutes ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

2 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago