Political News

కేసీఆర్, జగన్ ల పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య గ్యాప్ ఉందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని రేవంత్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక, ఆయన తనయుడు జగన్… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిన్నారని, కృష్ణా నీటిపై దాదాపు 6 గంటల పాటు చర్చించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతి తీసుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలోని గత ప్రభుత్వం ఏపీకి దాసోహం అయిందని, తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ పోలీసుల సాయంతో జగన్ ఆక్రమించుకోవాలనుకుంటే కేసీఆర్ మారు మాట్లాడలేదని విమర్శించారు. దమ్ముంటే ఇప్పుడు రావాలని జగన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ల పాపాలను కాంగ్రెస్ పై నెట్టేస్తున్నారని, రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల వ్యవహారం కేంద్రానికి గత తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రతి అక్షరం తనను అడిగిన తర్వాతే రాశారని కేసీఆర్ గతంలో అన్నారని రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయానికి కేసీఆర్ పునాదిరాయి వేశారని, ఆ చట్టానికి బాధ్యతను కేసీఆర్, కేశవరావు తీసుకోవాలని అన్నారు. నీటి పంపకాల్లో తెలంగాణ హక్కు వాటాను గత ప్రభుత్వం ఎందుకు అడిగి తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కు ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.

This post was last modified on February 4, 2024 9:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago