Political News

కేసీఆర్, జగన్ ల పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య గ్యాప్ ఉందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని రేవంత్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక, ఆయన తనయుడు జగన్… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిన్నారని, కృష్ణా నీటిపై దాదాపు 6 గంటల పాటు చర్చించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతి తీసుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలోని గత ప్రభుత్వం ఏపీకి దాసోహం అయిందని, తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ పోలీసుల సాయంతో జగన్ ఆక్రమించుకోవాలనుకుంటే కేసీఆర్ మారు మాట్లాడలేదని విమర్శించారు. దమ్ముంటే ఇప్పుడు రావాలని జగన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ల పాపాలను కాంగ్రెస్ పై నెట్టేస్తున్నారని, రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల వ్యవహారం కేంద్రానికి గత తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రతి అక్షరం తనను అడిగిన తర్వాతే రాశారని కేసీఆర్ గతంలో అన్నారని రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయానికి కేసీఆర్ పునాదిరాయి వేశారని, ఆ చట్టానికి బాధ్యతను కేసీఆర్, కేశవరావు తీసుకోవాలని అన్నారు. నీటి పంపకాల్లో తెలంగాణ హక్కు వాటాను గత ప్రభుత్వం ఎందుకు అడిగి తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కు ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.

This post was last modified on February 4, 2024 9:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పంతంగి ప్యాక్ అయింది !

సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…

11 mins ago

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం…

23 mins ago

ఏపీలో ఏం జ‌రుగుతోంది.. నిమ్మ‌గ‌డ్డకు టెన్ష‌న్ ఎందుకు?

ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ.. ఇంత‌లోనే ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే…

27 mins ago

బ్రహ్మరథం బన్నీకా.. వైసీపీకా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. రెండు రోజుల కిందటే…

2 hours ago

అదే కథ.. టాక్ ఉంది కలెక్షన్లు లేవు

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఈసారి వేసవిలో పెద్ద సినిమాలు లేకపోవడం పెద్ద మైనస్ కాగా..…

3 hours ago

రోహిత్ శర్మ.. టాటా బైబై?

ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు. ముంబయికి ఏకంగా ఐదు కప్పులు…

4 hours ago