వచ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చటగా విజయం దక్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాలని భావి స్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదిశగా అడుగులు ముమ్మరంగా ముందుకు వేస్తున్నారు. ఒకవైపు ప్రజలను, మరోవైపు మత ప్రాతిపదికన కూడా ఆయన ఆకర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ పరంగా కూడా.. తన ప్రభావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాతతరం నాయకులకు మోడీ అవార్డుల వీరతాళ్లు వేస్తున్నారు. దీనికి కారణమేంటి? తర్వాత వరుసలో ఎవరున్నారు? అనేది ఆసక్తికర చర్చ.
ఇప్పటి వరకు చూసుకుంటే గత వారంలోనే ఇద్దరు కీలక నాయకులకు ప్రధాని నరేంద్రమోడీ దేశ అత్యు న్నత పౌర పురస్కారాలను ప్రకటించారు. వీరిలో దక్షిణాదికి చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉత్తరాదికి చెందిన లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. వీరిద్దరూ బీజేపీకి సమ ఉజ్జీలు. 90లలో దేశవ్యాప్తంగా బీజేపీని పరుగులు పెట్టించడంలో వీరి కృషిని ఎవరూ తీసేయలేదు. అయితే.. మోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత.. వీరి ప్రభ తగ్గిపోయింది. వివిధ కారణాలతో వీరిని బీజేపీ పక్కన పెడుతూ వచ్చింది.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెంకయ్యను తప్పించారు. ఆయనకు ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెడుతూనే బీజేపీలో జోక్యం చేసుకోకుండా అచేతనం చేశారనే వాదన అప్పట్లోనే వినిపించింది. ఇక, అద్వానీ వయోవృద్ధులు కావడం , మోడీ వ్యూహాలు వేరే ఉండడంతో ఆయనను కూడా తప్పించారు. మొత్తంగా వీరి ప్రాదాన్యం లేకుండా పోయింది. కానీ, బీజేపీలో వీరు వేసిన పునాదులు మాత్రం సుస్థిరంగా ఉన్నాయి. దీంతో తరచుగావీరి ప్రస్తావన వస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలోన అన్ని వర్గాలను తనవైపు తిప్పుకోవాలంటే.. వదిలేసిన వారికి కూడా.. ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి మోడీకి ఏర్పడింది.
ఈ క్రమంలోనే ప్రధాని మోడీ వెంకయ్యకు పద్మవిభూషణ్, అద్వానీకి తాజాగా భారత రత్న ప్రకటించారనే చర్చ సాగుతోంది. వీరికి తాను ప్రాధాన్యం ఇస్తున్నానని, వదిలేయలేదని తద్వారా.. మోడీ బలమైన సంకేతాలు ఇచ్చి.. పార్టీలో తన ఆదిపత్యం నిలుపుకొనే ప్రయత్నం చేశారు. ఇక, ఈ వరుసలో మిగిలింది మరో ఇద్దరు కీలక నాయకులు. వారే..ఫైర్ బ్రాండ్ ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి. అయితే.. వీరికి ఇప్పటికిప్పుడు ఎలాంటి అవార్డులు ప్రకటించకపోయినా.. రాజ్యసభకు పంపించే అవకాశం ఉండడం గమనార్హం. మొత్తంగా.. బీజేపీపై మోడీ ప్రభావం తగ్గకుండాచూసుకునేందుకు అవార్డుల పంట పండిస్తున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…