వచ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చటగా విజయం దక్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాలని భావి స్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదిశగా అడుగులు ముమ్మరంగా ముందుకు వేస్తున్నారు. ఒకవైపు ప్రజలను, మరోవైపు మత ప్రాతిపదికన కూడా ఆయన ఆకర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ పరంగా కూడా.. తన ప్రభావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాతతరం నాయకులకు మోడీ అవార్డుల వీరతాళ్లు వేస్తున్నారు. దీనికి కారణమేంటి? తర్వాత వరుసలో ఎవరున్నారు? అనేది ఆసక్తికర చర్చ.
ఇప్పటి వరకు చూసుకుంటే గత వారంలోనే ఇద్దరు కీలక నాయకులకు ప్రధాని నరేంద్రమోడీ దేశ అత్యు న్నత పౌర పురస్కారాలను ప్రకటించారు. వీరిలో దక్షిణాదికి చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉత్తరాదికి చెందిన లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. వీరిద్దరూ బీజేపీకి సమ ఉజ్జీలు. 90లలో దేశవ్యాప్తంగా బీజేపీని పరుగులు పెట్టించడంలో వీరి కృషిని ఎవరూ తీసేయలేదు. అయితే.. మోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత.. వీరి ప్రభ తగ్గిపోయింది. వివిధ కారణాలతో వీరిని బీజేపీ పక్కన పెడుతూ వచ్చింది.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెంకయ్యను తప్పించారు. ఆయనకు ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెడుతూనే బీజేపీలో జోక్యం చేసుకోకుండా అచేతనం చేశారనే వాదన అప్పట్లోనే వినిపించింది. ఇక, అద్వానీ వయోవృద్ధులు కావడం , మోడీ వ్యూహాలు వేరే ఉండడంతో ఆయనను కూడా తప్పించారు. మొత్తంగా వీరి ప్రాదాన్యం లేకుండా పోయింది. కానీ, బీజేపీలో వీరు వేసిన పునాదులు మాత్రం సుస్థిరంగా ఉన్నాయి. దీంతో తరచుగావీరి ప్రస్తావన వస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలోన అన్ని వర్గాలను తనవైపు తిప్పుకోవాలంటే.. వదిలేసిన వారికి కూడా.. ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి మోడీకి ఏర్పడింది.
ఈ క్రమంలోనే ప్రధాని మోడీ వెంకయ్యకు పద్మవిభూషణ్, అద్వానీకి తాజాగా భారత రత్న ప్రకటించారనే చర్చ సాగుతోంది. వీరికి తాను ప్రాధాన్యం ఇస్తున్నానని, వదిలేయలేదని తద్వారా.. మోడీ బలమైన సంకేతాలు ఇచ్చి.. పార్టీలో తన ఆదిపత్యం నిలుపుకొనే ప్రయత్నం చేశారు. ఇక, ఈ వరుసలో మిగిలింది మరో ఇద్దరు కీలక నాయకులు. వారే..ఫైర్ బ్రాండ్ ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి. అయితే.. వీరికి ఇప్పటికిప్పుడు ఎలాంటి అవార్డులు ప్రకటించకపోయినా.. రాజ్యసభకు పంపించే అవకాశం ఉండడం గమనార్హం. మొత్తంగా.. బీజేపీపై మోడీ ప్రభావం తగ్గకుండాచూసుకునేందుకు అవార్డుల పంట పండిస్తున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on February 4, 2024 4:42 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…