Political News

వెంక‌య్య, అద్వానీ.. మోడీ వ్యూహంలో నెక్ట్స్ ఎవ‌రు?

వ‌చ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చ‌ట‌గా విజ‌యం ద‌క్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాల‌ని భావి స్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదిశ‌గా అడుగులు ముమ్మ‌రంగా ముందుకు వేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌ను, మ‌రోవైపు మ‌త ప్రాతిప‌దికన కూడా ఆయ‌న ఆక‌ర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ ప‌రంగా కూడా.. త‌న ప్ర‌భావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాత‌త‌రం నాయ‌కుల‌కు మోడీ అవార్డుల వీర‌తాళ్లు వేస్తున్నారు. దీనికి కార‌ణ‌మేంటి? త‌ర్వాత వ‌రుసలో ఎవ‌రున్నారు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.

ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే గ‌త వారంలోనే ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దేశ అత్యు న్న‌త పౌర పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించారు. వీరిలో ద‌క్షిణాదికి చెందిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు, ఉత్త‌రాదికి చెందిన లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. వీరిద్ద‌రూ బీజేపీకి స‌మ ఉజ్జీలు. 90ల‌లో దేశ‌వ్యాప్తంగా బీజేపీని ప‌రుగులు పెట్టించ‌డంలో వీరి కృషిని ఎవ‌రూ తీసేయ‌లేదు. అయితే.. మోడీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. వీరి ప్ర‌భ త‌గ్గిపోయింది. వివిధ కారణాల‌తో వీరిని బీజేపీ ప‌క్క‌న పెడుతూ వ‌చ్చింది.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి వెంక‌య్య‌ను త‌ప్పించారు. ఆయ‌న‌కు ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని క‌ట్టబెడుతూనే బీజేపీలో జోక్యం చేసుకోకుండా అచేత‌నం చేశార‌నే వాద‌న అప్ప‌ట్లోనే వినిపించింది. ఇక‌, అద్వానీ వ‌యోవృద్ధులు కావ‌డం , మోడీ వ్యూహాలు వేరే ఉండ‌డంతో ఆయ‌న‌ను కూడా త‌ప్పించారు. మొత్తంగా వీరి ప్రాదాన్యం లేకుండా పోయింది. కానీ, బీజేపీలో వీరు వేసిన పునాదులు మాత్రం సుస్థిరంగా ఉన్నాయి. దీంతో త‌ర‌చుగావీరి ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోన అన్ని వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకోవాలంటే.. వ‌దిలేసిన వారికి కూడా.. ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి మోడీకి ఏర్ప‌డింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ వెంక‌య్య‌కు ప‌ద్మ‌విభూష‌ణ్‌, అద్వానీకి తాజాగా భార‌త రత్న ప్ర‌క‌టించార‌నే చర్చ సాగుతోంది. వీరికి తాను ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని, వ‌దిలేయ‌లేద‌ని త‌ద్వారా.. మోడీ బ‌ల‌మైన సంకేతాలు ఇచ్చి.. పార్టీలో త‌న ఆదిప‌త్యం నిలుపుకొనే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఈ వ‌రుస‌లో మిగిలింది మ‌రో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు. వారే..ఫైర్ బ్రాండ్‌ ఉమాభార‌తి, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి. అయితే.. వీరికి ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి అవార్డులు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. రాజ్య‌స‌భ‌కు పంపించే అవ‌కాశం ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా.. బీజేపీపై మోడీ ప్ర‌భావం త‌గ్గకుండాచూసుకునేందుకు అవార్డుల పంట పండిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 4, 2024 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని 500 కోట్లు కొట్టాలంటే…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…

38 minutes ago

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఇంకెప్పుడు?

బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…

2 hours ago

వంగా అసలు ఆలోచన ఏంటి?

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

3 hours ago

ఘట్టమనేని వారసుడి గురించి టాక్ ఏంటి

ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…

4 hours ago

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

8 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

8 hours ago