Political News

వెంక‌య్య, అద్వానీ.. మోడీ వ్యూహంలో నెక్ట్స్ ఎవ‌రు?

వ‌చ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చ‌ట‌గా విజ‌యం ద‌క్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాల‌ని భావి స్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదిశ‌గా అడుగులు ముమ్మ‌రంగా ముందుకు వేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌ను, మ‌రోవైపు మ‌త ప్రాతిప‌దికన కూడా ఆయ‌న ఆక‌ర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ ప‌రంగా కూడా.. త‌న ప్ర‌భావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాత‌త‌రం నాయ‌కుల‌కు మోడీ అవార్డుల వీర‌తాళ్లు వేస్తున్నారు. దీనికి కార‌ణ‌మేంటి? త‌ర్వాత వ‌రుసలో ఎవ‌రున్నారు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.

ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే గ‌త వారంలోనే ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దేశ అత్యు న్న‌త పౌర పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించారు. వీరిలో ద‌క్షిణాదికి చెందిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు, ఉత్త‌రాదికి చెందిన లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. వీరిద్ద‌రూ బీజేపీకి స‌మ ఉజ్జీలు. 90ల‌లో దేశ‌వ్యాప్తంగా బీజేపీని ప‌రుగులు పెట్టించ‌డంలో వీరి కృషిని ఎవ‌రూ తీసేయ‌లేదు. అయితే.. మోడీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. వీరి ప్ర‌భ త‌గ్గిపోయింది. వివిధ కారణాల‌తో వీరిని బీజేపీ ప‌క్క‌న పెడుతూ వ‌చ్చింది.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి వెంక‌య్య‌ను త‌ప్పించారు. ఆయ‌న‌కు ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని క‌ట్టబెడుతూనే బీజేపీలో జోక్యం చేసుకోకుండా అచేత‌నం చేశార‌నే వాద‌న అప్ప‌ట్లోనే వినిపించింది. ఇక‌, అద్వానీ వ‌యోవృద్ధులు కావ‌డం , మోడీ వ్యూహాలు వేరే ఉండ‌డంతో ఆయ‌న‌ను కూడా త‌ప్పించారు. మొత్తంగా వీరి ప్రాదాన్యం లేకుండా పోయింది. కానీ, బీజేపీలో వీరు వేసిన పునాదులు మాత్రం సుస్థిరంగా ఉన్నాయి. దీంతో త‌ర‌చుగావీరి ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోన అన్ని వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకోవాలంటే.. వ‌దిలేసిన వారికి కూడా.. ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి మోడీకి ఏర్ప‌డింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ వెంక‌య్య‌కు ప‌ద్మ‌విభూష‌ణ్‌, అద్వానీకి తాజాగా భార‌త రత్న ప్ర‌క‌టించార‌నే చర్చ సాగుతోంది. వీరికి తాను ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని, వ‌దిలేయ‌లేద‌ని త‌ద్వారా.. మోడీ బ‌ల‌మైన సంకేతాలు ఇచ్చి.. పార్టీలో త‌న ఆదిప‌త్యం నిలుపుకొనే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఈ వ‌రుస‌లో మిగిలింది మ‌రో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు. వారే..ఫైర్ బ్రాండ్‌ ఉమాభార‌తి, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి. అయితే.. వీరికి ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి అవార్డులు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. రాజ్య‌స‌భ‌కు పంపించే అవ‌కాశం ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా.. బీజేపీపై మోడీ ప్ర‌భావం త‌గ్గకుండాచూసుకునేందుకు అవార్డుల పంట పండిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 4, 2024 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

36 minutes ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

54 minutes ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

3 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

3 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

4 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

4 hours ago