Political News

వెంక‌య్య, అద్వానీ.. మోడీ వ్యూహంలో నెక్ట్స్ ఎవ‌రు?

వ‌చ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చ‌ట‌గా విజ‌యం ద‌క్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాల‌ని భావి స్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదిశ‌గా అడుగులు ముమ్మ‌రంగా ముందుకు వేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌ను, మ‌రోవైపు మ‌త ప్రాతిప‌దికన కూడా ఆయ‌న ఆక‌ర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ ప‌రంగా కూడా.. త‌న ప్ర‌భావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాత‌త‌రం నాయ‌కుల‌కు మోడీ అవార్డుల వీర‌తాళ్లు వేస్తున్నారు. దీనికి కార‌ణ‌మేంటి? త‌ర్వాత వ‌రుసలో ఎవ‌రున్నారు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.

ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే గ‌త వారంలోనే ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దేశ అత్యు న్న‌త పౌర పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించారు. వీరిలో ద‌క్షిణాదికి చెందిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు, ఉత్త‌రాదికి చెందిన లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. వీరిద్ద‌రూ బీజేపీకి స‌మ ఉజ్జీలు. 90ల‌లో దేశ‌వ్యాప్తంగా బీజేపీని ప‌రుగులు పెట్టించ‌డంలో వీరి కృషిని ఎవ‌రూ తీసేయ‌లేదు. అయితే.. మోడీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. వీరి ప్ర‌భ త‌గ్గిపోయింది. వివిధ కారణాల‌తో వీరిని బీజేపీ ప‌క్క‌న పెడుతూ వ‌చ్చింది.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి వెంక‌య్య‌ను త‌ప్పించారు. ఆయ‌న‌కు ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని క‌ట్టబెడుతూనే బీజేపీలో జోక్యం చేసుకోకుండా అచేత‌నం చేశార‌నే వాద‌న అప్ప‌ట్లోనే వినిపించింది. ఇక‌, అద్వానీ వ‌యోవృద్ధులు కావ‌డం , మోడీ వ్యూహాలు వేరే ఉండ‌డంతో ఆయ‌న‌ను కూడా త‌ప్పించారు. మొత్తంగా వీరి ప్రాదాన్యం లేకుండా పోయింది. కానీ, బీజేపీలో వీరు వేసిన పునాదులు మాత్రం సుస్థిరంగా ఉన్నాయి. దీంతో త‌ర‌చుగావీరి ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోన అన్ని వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకోవాలంటే.. వ‌దిలేసిన వారికి కూడా.. ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి మోడీకి ఏర్ప‌డింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ వెంక‌య్య‌కు ప‌ద్మ‌విభూష‌ణ్‌, అద్వానీకి తాజాగా భార‌త రత్న ప్ర‌క‌టించార‌నే చర్చ సాగుతోంది. వీరికి తాను ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని, వ‌దిలేయ‌లేద‌ని త‌ద్వారా.. మోడీ బ‌ల‌మైన సంకేతాలు ఇచ్చి.. పార్టీలో త‌న ఆదిప‌త్యం నిలుపుకొనే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఈ వ‌రుస‌లో మిగిలింది మ‌రో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు. వారే..ఫైర్ బ్రాండ్‌ ఉమాభార‌తి, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి. అయితే.. వీరికి ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి అవార్డులు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. రాజ్య‌స‌భ‌కు పంపించే అవ‌కాశం ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా.. బీజేపీపై మోడీ ప్ర‌భావం త‌గ్గకుండాచూసుకునేందుకు అవార్డుల పంట పండిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 4, 2024 4:42 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

2 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

2 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

2 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

6 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

6 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

6 hours ago