పదేళ్ళుగా ఉన్న తెలంగాణా స్టేట్(టీఎస్) పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణా గవర్నమెంట్(టీజీ) గా మార్చబోతోందా ? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తెలంగాణాగా బాగా పాపులరైన పేరును రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీయార్ తెలంగాణా స్టేట్ గా మార్చేశారు. తెలంగాణాను తెలంగాణా స్టేట్ గా మార్చటాన్ని అప్పట్లోనే పార్టీతో పాటు మామూలు జనాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కేసీయార్ పట్టించుకోలేదు.
అందుకనే పదేళ్ళు తెలంగాణా కాస్త తెలంగాణా స్టేట్ గాను చెలామణి అయ్యింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చింది. దీనిపై పార్టీలో, ప్రభుత్వంలో చర్చించిన తర్వాత తెలంగాణా స్టేట్ ను తెలంగాణా గవర్నమెంట్ గా మార్చాలని నిర్ణయమైందని సమాచారం. తెలంగాణా గవర్నమెంటు..తెలంగాణా స్టేట్ అని పలకటానికి చాలా తేడు ఉందని జనాలు ఎంతచెప్పినా కేసీయార్ వినిపించుకోలేదు. తర్వాత పార్టీ పేరును టీఆర్ఎస్ అని కాకుండా బీఆర్ఎస్ అని మార్చిన విషయం కూడా జనాలందరికీ తెలిసిందే.
మొత్తానికి పదేళ్ళ కేసీయార్ ప్రభుత్వానికి తెరపడటంతో తెలంగాణా స్టేట్ కాస్త తెలంగాణా గవర్నమెంటు అని మారబోతున్నట్లు సమాచారం. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో అజెండాలో ఈ అంశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నిజానికి తెలంగాణా స్టేట్ అన్నా తెలంగాణా గవర్నమెంట్ అన్నా పనితీరులో తేడా ఏమీ ఉండదు. కాకపోతే పిలుపులోనే తేడా కొడుతోంది. తెలంగాణా స్టేట్ అంటే పరాయదన్న భావనతో ఉన్న జనాలు తెలంగాణా గవర్నమెంట్ అంటే మనది అన్న భావనతో ఉన్నారట.
మొత్తానికి కేసీయార్ పాలనలోని వ్యవహారాలను రివైజ్ చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ అంవానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడగడ్డ బ్యారేజిలో జరిగిన అవినీతి, నాణ్యతాపరమైన లోపాలు ఇలా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించబోతోంది. పనిలోపనిగా సంక్షేమపథకాల్లో జరిగిన అవినీతిని కూడా బయటకు తీయబోతోంది. మరి ఇన్ని రివైజలు చేయటం మొదలుపెడితే ఇక రేవంత్ తన మార్కు పాలనను ఏమిచూపిస్తారో తెలీటంలేదు.
This post was last modified on February 4, 2024 12:24 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…