ఏపీ సీఎం జగన్ తన చెల్లెళ్ల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల విషయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇంత జరుగుతున్నా.. జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని హనుమంతరావు ప్రశ్నించారు. మహిళల గురించి గొప్పగా మాట్లాడే.. జగన్, ముందుకు తన చెల్లెళ్ల గురించి పట్టించుకోవాలి అని సూచించారు.
‘‘షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు’’ అని ఆరోపణలు చేస్తూ వచ్చిన పోస్టర్లపై హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. తల్లిని, చెల్లిని జగన్ దూరం పెట్టాడు. సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే ఆయనకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు. షర్మిల, సునీతలపై జగన్కు ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. సొంత చెల్లెళ్ళపై ప్రేమ లేని జగన్ మహిళా సాధికారత అని ముచ్చట్లు చెబుతున్నాడు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయాలు రాజకీయాలే. ఆ ముచ్చట వేరు. ఈ ముచ్చట వేరు అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని పోస్టులు పెడుతుంటే.. రక్త సంబంధం ఉన్న జగన్ ఎలా చూస్తూ ఊరుకుంటున్నాడని హనుమంతరావు అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు, ఆయన పార్టీకి షర్మిల సేవ చేసిన విషయాన్ని మరిచిపోయా రా? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం జగన్ ఇంత దిగజారుతారా అని హనుమంతరావు మండిపడ్డారు. ఇప్పటికైనా చెడు సంప్రదాయాలని వీడి జగన్.. సరైన విధంగా వ్యవహరించాలని అన్నారు. అధికారం ఉందికదా.. అని ఇష్టాను సారం వ్యవహరిస్తే.. రేపు అదే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
రేపు విజయమ్మకైనా అంతే!
ఇప్పుడు షర్మిల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని సీఎం జగన్ చూసీ చూడనట్టు రాజకీయం చేస్తున్నారని. రేపు తన తల్లి విజయమ్మ ఏపీలో అడుగు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడినా.. ఇదే పనిచేస్తారని.. ఆమెపై పోస్టులు పెట్టినా.. వికృత ప్రచారం చేసినా.. మౌనంగా ఉంటారని హనుమంతరావు అన్నారు. ఈ రోజు చెల్లి.. రేపు తల్లి విజయమ్మ ఎందుకు కాకూడదని అన్నారు. షర్మిల ఏపీలో కాలు పెట్టినందుకు కాదు.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందుకే.. జగన్కు భయం పట్టుకుందని అన్నారు.
This post was last modified on February 3, 2024 10:06 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…