Political News

చెయిన్ క్యాంపెయిన్‌కు జ‌గ‌న్ పిలుపు..

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి సిద్ధం పేరుతో స‌భ‌ల‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే విశాఖ వేదిక‌గా.. ఆయ‌న తొలిసభ నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం జిల్లాల వారీగా నిర్వ‌హిస్తున్న ఈ స‌భ‌ల్లో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ స‌భా వేదిక‌గా సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న పిలుపునిచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ని గెలిపించాల‌ని ఆయ‌న చెప్పారు. అదేస‌మ‌యంలో ఆయ‌న చెయిన్ క్యాంపెయిన్ నిర్వ‌హించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పిలుపు ఏ పార్టీ కూడా ఇవ్వ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలో 57 నెల‌లుగా వైసీపీ పాల‌న సాగుతోంది. ఈ పాల‌న‌లో నేను 124 సార్లు బ‌ట‌న్ నొక్కాను. వివిధ ప‌థ‌కాల కింద 2 ల‌క్ష‌ల 57 వేల కోట్ల రూపాయ‌ల‌ను ల‌బ్ధి దారుల‌కు పంచాను. దీనివ‌ల్ల నా.. నా.. నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కా చెల్లెమ్మ లు, అన్నాద‌మ్ములు, అవ్వా తాత‌లు ల‌బ్ధిపొందారు. ఇక్క‌డ బ‌ట‌న్ నొక్క‌గానే అక్క‌డ వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు ప‌డ్డా యి. దీని వ‌ల్ల మీకు మేలు జ‌రిగిందా? అని స‌భ‌కు వ‌చ్చిన వారిని సీఎం జ‌గ‌న్‌ ప్ర‌శ్నించారు. దీనికి ప్ర‌జ‌ల‌నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ.. మీకు జ‌రిగిన ల‌బ్ధిని మీ పొరుగు వారికి కూడా తెలియ‌జేయాల‌న్నారు.

అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ రాక‌పోతే.. మీకు ప‌థ‌కాలు అంద‌వ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ పిలుపు నిచ్చారు. ఈ విష‌యాన్ని అక్కా చెల్లెమ్మ‌లు, అవ్వాతాత‌లు.. ఒక్కొక్క‌రు.. మీ చుట్టుప‌క్క‌ల ఉండే 10 మందికి చెప్పండి. వైసీపీకి ఓటు వేయ‌క‌పోతే..ఏం జ‌రుగుతుందో వారికి వివ‌రించండి. మీ ప‌థ‌కాలు, మీ సంక్షేమం అన్నీ.. చంద్ర‌ముఖి (చంద్ర‌బాబు ) ఎత్తుకు పోతాడ‌ని చెప్పండి.మీరే నాయ‌కు స్టార్ క్యాంపెయిన‌ర్లు. మీరే మీ చుట్టుప‌క్కల ఉండే వారికి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే కానుక‌.. నేను మీకు ఎన్నో కానుక‌లు ఇచ్చాను అని జ‌గ‌న్ అన్నారు.

చెయిన్ క్యాంపెయ‌న్ అంటే..

మ‌ల్టీ చెయిన్ బిజినెస్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఒక‌రు ఒక స్కీమ్‌లో చేర‌తారు. వారు ముగ్గురిని చేర్పిస్తారు. ఆ ముగ్గురు.. ఒక్కొక్క‌రు చొప్పున మ‌రో ముగ్గురిని అంటే.. 9 మందిని చేర్పిస్తారు. ఈ తొమ్మిది మంది ఒక్కొక్క‌రు.. ముగ్గురేసి చొప్పు.. చేర్పిస్తే.. అది.. 27 మందికి చేరుతుంది.. ఇలా.. చెయిన్ బిజినెస్ అయి.. చివ‌ర‌కు కోట్ల మందికి చేరుతుంది. ఇదే ఇప్పుడు సీఎం జ‌గ‌న్ చెప్పిన ప్లాన్‌. ఒక‌రు ప‌ది మందికి.. ఆ ప‌ది మంది.. ఒక్కొక్క‌రూ మ‌రో 10 మంది చొప్పున వైసీపీకి అనుకూలంగా ఓటేయాల‌ని ప్ర‌చారం చేయ‌డ‌మే సీఎం జ‌గ‌న్ చెప్పిన చెయిన్ క్యాంపెయిన్‌., ఇలా.. చేస్తే.. అనుకూల ప‌వ‌నాలు వైసీపీకి వీచి పార్టీల ప్ర‌చారం.. మైకుల ప్ర‌చారం క‌న్నా.. ప్ర‌జ‌ల మౌత్ ప్ర‌చారం జోరందుకుని గెలుపు త‌థ్య‌మ‌ని ఆయ‌న భావిస్తుండ‌వొచ్చు.

This post was last modified on February 3, 2024 10:05 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

59 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

5 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

7 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

13 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

13 hours ago