Political News

రేవంత్ పై న‌మ్మ‌కంతో జార్ఖండ్ రాజకీయం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వారికి తెలిసిన‌ట్టుంది. బీజేపీ ఎలాంటి వారినైనా త‌న వైపున‌కు ఎలా తిప్పుకుంటుందో వారికి బాగా అనుభ‌వంలో ఉన్న‌ట్టుగా ఉంది.. అందుకే.. అనూహ్య‌మైన ప‌రిస్థితిలో అంతే అనూహ్యంగా వ్య‌వ‌హ‌రించారు… జార్ఖండ్ అధికార ప‌క్ష కూట‌మి పార్టీలు. అవే.. జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా), కాంగ్రెస్ పార్టీలు. ప్ర‌స్తుతం జార్ఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభం నెలకొన్న విష‌యం తెలిసిందే. సీఎం హేమంత్ సొరేన్‌పై ఈడీ కేసులు న‌మోదు చేయ‌డం అరెస్టు చేయ‌డంతో ఆయ‌న ప‌దవిని కోల్పోయారు. ఈ ప‌దవి కోసం.. పార్టీలో హైడ్రామా న‌డించింది. చివ‌ర‌కు వీర‌విధేయుడైన చంప‌య్ సొరేన్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఎన్నుకున్నారు.

ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం కూడా చేసేశారు. ఏకంగా 43 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా(జేఎంఎం+కాంగ్రెస్‌) ఉంది. అయిన‌ప్ప‌టికీ.. బీజేపీపై వారికి ఇసుమంత న‌మ్మ‌కం లేదు. ఏక్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో అనే బెంగ వెంటాడింది. అందుకే అనూహ్యంగా ఎమ్మెల్యేల‌ను రెండు ప్ర‌త్యేక విమానాల్లో రాంచీ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లించేశారు. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ‌మే ఉండ‌డం.. పార్టీకి న‌మ్మిన బంటు వంటి, ఫైర్ బ్రాండ్ రేవంత్ అండ‌గా ఉండ‌డంతో ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో ఇక్క‌డ‌కు త‌ర‌లించేశారు. అయితే.. త‌ర‌లించేప్పుడే ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు తీసేసుకున్నారు.

ఎందుకు?

ఇలా 43 మంది ఎమ్మెల్యేల‌ను ఎందుకు త‌ర‌లించారంటే.. కొత్త ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన చంప‌య్ సోరెన్‌పై బీజేపీ నేత‌లు.. బ‌ల నిరూప‌ణ చేసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇదే విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు కూడా నివేదించారు. దీంతో ఆయ‌న స‌భ లో బ‌ల‌నిరూప‌ణ‌కు ఆదేశించారు. ఫ‌లితంగా చంప‌య్ సొరేన్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టికీ.. త‌న ఎమ్మెల్యేల సంఖ్యాబ‌లాన్ని స‌భ‌లో నిరూపించుకోవాల్సి ఉంది. ఇది జ‌రిగేందుకు మూడు రోజుల స‌మ‌యం ఉంది. శ‌నివారం, ఆదివారం సెల‌వులు కావ‌డంతో ఈ రెండు రోజులు ఎమ్మెల్యేల‌ను సొంత రాష్ట్రంలో కాపాడుకోవ‌డం.. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి వారిని ర‌క్షించుకోవ‌డం అంత తేలిక విష‌యం కాద‌ని గ్ర‌హించారు. దీంతో వారిని గుండ‌గుత్త‌గా హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.

మ‌రోవైపు.. మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయ‌న సుప్రీంకోర్టు మెట్లెక్కారు. త‌న అరెస్టును కొట్టి వేయాల‌ని అభ్య‌ర్థించారు.కానీ, సుప్ఈరం కోర్టు మాత్రం.. త‌మ‌కు సంబంధం లేద‌ని.. రాంచీహైకోర్టులోనే తేల్చుకోవాల‌ని చెప్పింది. ఇదిలావుంటే.. హైకోర్టు మాత్రం హేమంత్ పిటిష‌న్‌ను సోమ‌వారం విచారిస్తామ‌ని తేల్చి చెప్పింది. ఇంకోవైపు.. ప్ర‌జాప్ర‌తినిధుల కేసులు విచారించే కోర్టు.. హేమంత్‌ను ఐదు రోజుల క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ.. తీర్పు చెప్పింది.

This post was last modified on February 3, 2024 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago