Political News

జ‌గ‌న్ ఎన్ని త‌ప్పులు చేయ‌కూడ‌దో అన్నీ చేశారు: ఉండ‌వ‌ల్లి

ఏపీసీఎం జ‌గ‌న్‌పై మాజీ ఎంపీ, రాజ‌కీయ విశ్లేషకులు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించా రు. జ‌గ‌న్ ఎన్నిత‌ప్పులు చేయ‌కూడ‌దో అన్నీ చేశార‌ని అన్నారు. “సీఎం ప‌ద‌వి పోతే.. జ‌గ‌న్‌కు ఎంత బాధ ఉంటుందో.. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యే ప‌ద‌వి పోతే.. వారికి కూడా అంతే బాధ ఉంటుంది. టికెట్లు ఇచ్చే విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన పరాభ‌వ‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు“ అని అన్నారు.

తాజాగా రాజ‌మండ్రిలో ఉండ‌వ‌ల్లి మీడియ‌తో మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో జగనే పోటీ చేస్తున్నారని సెటైర్ వేశారు. ఎందుకంటే.. ఎమ్మెల్యేల పాత్ర ఏమీ లేకుండా పోయింద‌ని, అంతా సీఎం జ‌గ‌న్‌, వ‌లంటీర్ల చేతుల్లోనే పాల‌న సాగింద‌న్నారు. అర్బన్ ఏరియాల్లో జగన్ వ్యతిరేక ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి అన్నారు. అయితే, గ్రామీణ స్థాయిలో పింఛ‌న్లు, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌ను ఇంటికే చేర‌వేస్తుండ‌డంతో ఆ ప్ర‌భావం వైసీపీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

చదువుకున్నవారు రోడ్లు బాలేదనో, ఇంకేదో లేదనో జ‌గ‌న్‌కు వ్యతిరేకం కావొచ్చ‌న్నారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పాజిటివ్ ఓటు బ్యాంకు పెరిగింద‌న్నారు. జగన్ 40%, చంద్రబాబుకు 40% ఓట్ పర్సంటేజ్ వస్తాయనుకుంటున్నానని చెప్పారు. గత ఎన్నికలలో జనసేనకు 6% ఓట్లు వ‌చ్చాయ‌ని, ఈ సారి పెరుగుతుందన్నారు. వాస్తవంగా జనసేన, టీడీపీ కలిశాయంటే ప్ర‌భుత్వంలో కొంత ఒత్తిడి పెరిగి షేక్ రావాల్సి వ‌చ్చేద‌ని, కానీ, అలాంటి ప‌రిస్థితి వైసీపీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అన్నారు.

This post was last modified on February 3, 2024 7:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

1 hour ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

1 hour ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

2 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

2 hours ago

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

4 hours ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

5 hours ago