Political News

అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..

తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌చారం ప్రారంభించేశారు. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌నుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని 17 స్థానాల్లో క‌నీసం 14 నుంచి 16 స్థానాల‌ను త‌మ కైవ‌సం చేసుకోవాల‌ని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా ఇంద‌వ‌ల్లి వేదిక‌గా .. నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ ద్వారా ప్ర‌చార శంఖం పూరించారు. ఈ సభ‌కువేల సంఖ్య‌లో జ‌నాలు త‌ర‌లి వ‌చ్చారు. పార్టీ శ్రేణులు… కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా భారీ సంఖ్య‌లో త‌ర‌లి రావ‌డంతో సీఎం రేవంత్ సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు.

రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో గ‌త ఎన్నిక‌ల్లో 4 స్థానాల్లో మాత్ర‌మే పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సంఖ్య‌ను 16కు పెంచుకోవ‌డంపై రేవంత్ కొన్నాళ్లుగా త‌పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ విధంగా అయితే.. ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకున్నారో.. అదేవిధంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటాల‌నేది ఆయ‌న వ్యూహం . ప్ర‌ధానంగా రాహుల్ గాంధీని ప్ర‌ధాని పీఠం ఎక్కించాల‌న్న‌ది ఆయ‌న వ్యూహం. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందే ఇంద్ర‌వల్లి వేదిక‌గా.. స‌భ‌ను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల‌ని, త‌ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌ప‌డుతోంద‌న్న సంకేతాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

అనుకున్న విధంగానే ఇంద్ర‌వ‌ల్లి స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించారు. కొంద‌రు స్వ‌చ్ఛందంగానే వ‌చ్చారు. ఎటు చూసిన ప్ర‌జ‌ల‌తో స‌భా ప్రాంగ‌ణం నిండిపోయింది. వాహ‌నాల‌తో ర‌హ‌దారులు కిక్కిరిశాయి. ‘అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..’ స‌త్తా.. అనే నినాదంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వ‌ల్లిలో నిర్వ‌హించిన ఈ స‌భ‌కు.. సీఎం రేవంత్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేస్తూ.. ఇంద్ర‌వ‌ల్లిని ఎన్నుకోవ‌డం వెనుక విశేషం ఉంది. జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేసిన ఆదిబాద్ గ‌డ్డ ఇదే కావ‌డం.. ఆ స్ఫూర్తితోనే తాము పని చేస్తామని సీఎం రేవంత్ ప‌దే ప‌దే చెబుతుండ‌డంతో ఇంద్ర‌వ‌ల్లి ప్రాంతాన్ని స‌భ‌కు వేదిక‌గా ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌భ విజ‌యంతో పార్టీని మ‌రో రేంజ్‌కు తీసుకువెళ్లాల‌నేది సీఎం రేవంత్ ప్ర‌య‌త్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

3 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

4 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

4 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

4 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

5 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

7 hours ago