తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 17 స్థానాల్లో కనీసం 14 నుంచి 16 స్థానాలను తమ కైవసం చేసుకోవాలని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్న రేవంత్రెడ్డి.. తాజాగా ఇందవల్లి వేదికగా .. నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా ప్రచార శంఖం పూరించారు. ఈ సభకువేల సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. పార్టీ శ్రేణులు… కార్యకర్తలతోపాటు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలి రావడంతో సీఎం రేవంత్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో 4 స్థానాల్లో మాత్రమే పార్టీ విజయం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సంఖ్యను 16కు పెంచుకోవడంపై రేవంత్ కొన్నాళ్లుగా తపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే.. ప్రజల మనసులు దోచుకున్నారో.. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలనేది ఆయన వ్యూహం . ప్రధానంగా రాహుల్ గాంధీని ప్రధాని పీఠం ఎక్కించాలన్నది ఆయన వ్యూహం. ఈ క్రమంలో ఎన్నికలకు రెండు మాసాల ముందే ఇంద్రవల్లి వేదికగా.. సభను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని, తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడుతోందన్న సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించారు.
అనుకున్న విధంగానే ఇంద్రవల్లి సభకు భారీ ఎత్తున ప్రజలను తరలించారు. కొందరు స్వచ్ఛందంగానే వచ్చారు. ఎటు చూసిన ప్రజలతో సభా ప్రాంగణం నిండిపోయింది. వాహనాలతో రహదారులు కిక్కిరిశాయి. ‘అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్లో కూడా మాదే..’ సత్తా.. అనే నినాదంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లిలో నిర్వహించిన ఈ సభకు.. సీఎం రేవంత్ ప్రధాన ఆకర్షణగా మారారు. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేస్తూ.. ఇంద్రవల్లిని ఎన్నుకోవడం వెనుక విశేషం ఉంది. జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేసిన ఆదిబాద్ గడ్డ ఇదే కావడం.. ఆ స్ఫూర్తితోనే తాము పని చేస్తామని సీఎం రేవంత్ పదే పదే చెబుతుండడంతో ఇంద్రవల్లి ప్రాంతాన్ని సభకు వేదికగా ఎంచుకోవడం గమనార్హం. ఈ సభ విజయంతో పార్టీని మరో రేంజ్కు తీసుకువెళ్లాలనేది సీఎం రేవంత్ ప్రయత్నంగా ఉండడం గమనార్హం.
This post was last modified on February 3, 2024 2:23 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…