Political News

అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..

తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌చారం ప్రారంభించేశారు. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌నుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని 17 స్థానాల్లో క‌నీసం 14 నుంచి 16 స్థానాల‌ను త‌మ కైవ‌సం చేసుకోవాల‌ని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా ఇంద‌వ‌ల్లి వేదిక‌గా .. నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ ద్వారా ప్ర‌చార శంఖం పూరించారు. ఈ సభ‌కువేల సంఖ్య‌లో జ‌నాలు త‌ర‌లి వ‌చ్చారు. పార్టీ శ్రేణులు… కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా భారీ సంఖ్య‌లో త‌ర‌లి రావ‌డంతో సీఎం రేవంత్ సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు.

రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో గ‌త ఎన్నిక‌ల్లో 4 స్థానాల్లో మాత్ర‌మే పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సంఖ్య‌ను 16కు పెంచుకోవ‌డంపై రేవంత్ కొన్నాళ్లుగా త‌పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ విధంగా అయితే.. ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకున్నారో.. అదేవిధంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటాల‌నేది ఆయ‌న వ్యూహం . ప్ర‌ధానంగా రాహుల్ గాంధీని ప్ర‌ధాని పీఠం ఎక్కించాల‌న్న‌ది ఆయ‌న వ్యూహం. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందే ఇంద్ర‌వల్లి వేదిక‌గా.. స‌భ‌ను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల‌ని, త‌ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌ప‌డుతోంద‌న్న సంకేతాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

అనుకున్న విధంగానే ఇంద్ర‌వ‌ల్లి స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించారు. కొంద‌రు స్వ‌చ్ఛందంగానే వ‌చ్చారు. ఎటు చూసిన ప్ర‌జ‌ల‌తో స‌భా ప్రాంగ‌ణం నిండిపోయింది. వాహ‌నాల‌తో ర‌హ‌దారులు కిక్కిరిశాయి. ‘అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..’ స‌త్తా.. అనే నినాదంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వ‌ల్లిలో నిర్వ‌హించిన ఈ స‌భ‌కు.. సీఎం రేవంత్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేస్తూ.. ఇంద్ర‌వ‌ల్లిని ఎన్నుకోవ‌డం వెనుక విశేషం ఉంది. జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేసిన ఆదిబాద్ గ‌డ్డ ఇదే కావ‌డం.. ఆ స్ఫూర్తితోనే తాము పని చేస్తామని సీఎం రేవంత్ ప‌దే ప‌దే చెబుతుండ‌డంతో ఇంద్ర‌వ‌ల్లి ప్రాంతాన్ని స‌భ‌కు వేదిక‌గా ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌భ విజ‌యంతో పార్టీని మ‌రో రేంజ్‌కు తీసుకువెళ్లాల‌నేది సీఎం రేవంత్ ప్ర‌య‌త్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 3, 2024 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

9 hours ago