Political News

కాంగ్రెస్‌కు కంట్లో న‌లుసు..

రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. అంద‌రూ ఆమెను దీదీ అని పిలుచుకుంటారు. అయితే. ఆమె ప్ర‌త్యేక‌త ఏంటంటే..ఎప్పుడు ఎటు వైపు నిల‌బ‌డ‌తారో.. ఎప్పుడు ఎవ‌రిని పొగుడుతారో చెప్ప డం క‌ష్టం. ఏనిముషానికి ఆమె మ‌న‌సు, నోరు.. ఎటు వైపు మ‌లుపు తిరుగుతాయో కూడా చెప్ప‌డం మ‌రీ క‌ష్టం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. కాంగ్రెస్ పార్టీని భేష్ అంటూ.. కొనియాడిన దీదీ.. ఇటీవ‌ల కాలంలో తిట్టి పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విజ‌ను పాడూ ఏమీ లేవ‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక‌, ఇప్ప‌డు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతూ ఏకంగా స‌వాళ్లే రువ్వారు దీదీ. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి క‌నీసంలో క‌నీసం 40 సీట్లు కూడా రాబోవ‌ని ఆమె చెప్పారు. అంతేకాదు.. అల‌హాబాద్‌, వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి.. గెలిచి చూపించ‌గ‌లరా? అని స‌వాల్ రువ్వారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బీజేపీ గెలిచింది. వార‌ణాసి ఏకంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ 2014, 2019 ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, యూపీలోని అల‌హాబాద్‌లోనూ బీజేపీ నేత శ్యామా చ‌ర‌ణ గుప్తా విజ‌యం సాధించారు. ఈ రెండు కూడా బీజేపీకి అత్యంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు. వీటిలోనే కాంగ్రెస్ గెలిచి చూపించాల‌ని మ‌మ‌త స‌వాల్ రువ్వారు.

ఎందుకింత అక్క‌సు?

కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌తో మ‌మ‌త ఎందుకు ఇలా విభేదిస్తున్నార‌న్న‌దానికి కార‌ణం వెతికిచూస్తే.. అత్యంత చిన్న‌గానే ఉంది. కానీ, మ‌న‌సులో ఆమె బాధ వేరేగా ఉండ‌డంతో ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. ఆమె చెబుతున్న కార‌ణం.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం భార‌త్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు. ఇది మ‌మ‌త అధీనంలో ఉన్న ప‌శ్చిమ బెంగాల్‌లో సాగుతోంది. అయితే.. ఈ యాత్ర రాష్ట్రంలోకి ప్ర‌వేశించిన‌ప్పుడు త‌న‌కు చెప్ప‌లేద‌న్న‌ది ఆమె చెబుతున్న కార‌ణం. కానీ, కాంగ్రెస్ నేత‌లు మాత్రం ముందుగానే డీజీపీకి, సీఎస్‌కు స‌మాచారం ఇచ్చామ‌ని అంటున్నారు.

ఇక‌, మ‌మ‌త మ‌న‌సులో ఉన్న కార‌ణం చూస్తే.. ఆమె ఇండియా కూట‌మిలో ఉన్న‌ప్పుడు(ఇప్పుడు లేరు) దీనికి క‌న్వీన‌ర్ కావాల‌ని అనుకున్నారు. త‌ద్వారా.. మోడీని ఓడిస్తే.. ప్ర‌ధాని కావాల‌నేది ఆమె ఆకాంక్ష. కానీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోక వ‌చ్చాక‌.. ఇండియా కూట‌మికి తామే నేతృత్వం వ‌హిస్తామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఈ క్ర‌మంలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖ‌ర్గేను రంగంలోకిదింపింది. ఇదీ.. అస‌లు అక్క‌సు. ఈ కార‌ణంగానే మ‌మ‌త చిర్రెత్తిపోతున్నారు. ఒక్క సీటు కూడా ఇచ్చేది లేద‌న్నారు. ఇక‌, ఇదే కార‌ణంగా బిహార్ సీఎం నితీష్ కూడా కాంగ్రెస్‌తో తెగ‌తెంపులు చేసుకుని .. బీజేపీ పంచ‌న చేరిన విష‌యం తెలిసిందే.

This post was last modified on February 3, 2024 1:55 pm

Share

Recent Posts

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

28 minutes ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

1 hour ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

5 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

6 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

7 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

7 hours ago