ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల నోటిఫికేషన్ లేదా షెడ్యూల్కు రెండు మాసాల ముందుగానే అభ్యర్థులను దాదాపు నియమిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఐదు జాబితాలు ఇవ్వగా తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలకు కలిపి 10 మంది సమన్వయ కర్తలను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జునలు ఆరో జాబితాను విడుదల చేశారు.
ఇదీ.. ఆరో జాబితా!
రాజమండ్రి ఎంపీ స్థానం – గూడూరి శ్రీనివాస్,
నరసాపురం ఎంపీ స్థానం- గూడూరి ఉమాబాల
గుంటూరు ఎంపీ స్థానం – ఉమ్మారెడ్డి రమణ
చిత్తూరు ఎంపీ(ఎస్సీ) – రెడ్డప్ప
గిద్దలూరు ఎమ్మెల్యే- నాగార్జున రెడ్డి
నెల్లూరు సిటీ- ఎండీ ఖలీల్
జీడీ నెల్లూరు ఎమ్మెల్యే(ఎస్సీ) – కె.నారాయణ స్వామి,
ఎమ్మిగనూరు- బుట్టా రేణుక
మైలవరం – తిరుపతిరావు,
మార్కాపురం – రాంబాబులను సమన్వయ కర్తలుగా నియమించారు.
ఈ ప్రశ్నకు సమాధానమేదీ?
సమన్వయ కర్తలుగా నియమిస్తున్నవారి విషయంలో పార్టీ అధిష్టానం తడబడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీల కులు. వాస్తవానికి ఒక్కసారి జగన్ నిర్ణయం తీసుకుంటే ఇక, వెనక్కి తీసుకోరని ఆపార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. దీంతో సమన్వయ కర్తలుగా నియమితులైన వారు వారి పనిని వారు చేసుకుని పోతున్నారు. కొందరు నచ్చనివారు.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే.. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలోనూ.. ఇప్పుడు విడుదల చేసిన ఆరో జాబితాలోనూ.. అభ్యర్థుల మార్పు స్పష్టంగా కనిపించింది.
గత జాబితాలో తిరుపతి ఎంపీగా నియమించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వద్దని వెళ్లిపోయారు. దీంతో ఆ స్థానానికి వేరే వారిని నియమిస్తారని అందరూ అనుకున్నారు.కానీ, అనూహ్యంగా ఎమ్మెల్యే స్థానానికి పంపించిన ఎంపీ గురుమూర్తిని తీసుకువచ్చి మళ్లీ తిరుపతికి కేటాయించారు. ఇక, ఇప్పుడు ఇచ్చిన జాబితాలోనూ ఇలాంటి మార్పే కనిపించింది. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను అసెంబ్లీకి పంపించారు. అదేవిధంగా గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రిగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా పంపించారు.కానీ, తాజా జాబితాలో వీరిని తిరిగి యథాస్థానానికి తీసుకువచ్చారు. మరి ఇదేం మార్పు ? అనేది వైసీపీనాయకుల ప్రశ్న. దీనిపై అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది.
This post was last modified on February 3, 2024 8:45 am
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు…
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…