Political News

వైసీపీ ఆరో జాబితా విడుద‌ల‌.. కానీ, ఈ ప్ర‌శ్న‌కు సమాధాన‌మేది?

ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుద‌ల చేసింది. పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ లేదా షెడ్యూల్‌కు రెండు మాసాల ముందుగానే అభ్య‌ర్థుల‌ను దాదాపు నియమిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు జాబితాలు ఇవ్వ‌గా తాజాగా ఆరో జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో అటు పార్ల‌మెంటు, ఇటు అసెంబ్లీల‌కు క‌లిపి 10 మంది స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ కీల‌క నేత‌, ప్ర‌భుత్వ‌ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున‌లు ఆరో జాబితాను విడుద‌ల చేశారు.

ఇదీ.. ఆరో జాబితా!

రాజమండ్రి ఎంపీ స్థానం – గూడూరి శ్రీనివాస్,

నరసాపురం ఎంపీ స్థానం- గూడూరి ఉమాబాల

గుంటూరు ఎంపీ స్థానం – ఉమ్మారెడ్డి రమణ

చిత్తూరు ఎంపీ(ఎస్సీ) – రెడ్డప్ప

గిద్దలూరు ఎమ్మెల్యే- నాగార్జున రెడ్డి

నెల్లూరు సిటీ- ఎండీ ఖలీల్

జీడీ నెల్లూరు ఎమ్మెల్యే(ఎస్సీ) – కె.నారాయణ స్వామి,

ఎమ్మిగనూరు- బుట్టా రేణుక

మైలవరం – తిరుపతిరావు,

మార్కాపురం – రాంబాబుల‌ను స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా నియ‌మించారు.

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మేదీ?

స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా నియ‌మిస్తున్న‌వారి విష‌యంలో పార్టీ అధిష్టానం త‌డ‌బ‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల కులు. వాస్త‌వానికి ఒక్క‌సారి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటే ఇక‌, వెన‌క్కి తీసుకోర‌ని ఆపార్టీ నేత‌లే ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా నియ‌మితులైన వారు వారి ప‌నిని వారు చేసుకుని పోతున్నారు. కొంద‌రు న‌చ్చ‌నివారు.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. అయితే.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఐదో జాబితాలోనూ.. ఇప్పుడు విడుద‌ల చేసిన ఆరో జాబితాలోనూ.. అభ్య‌ర్థుల మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింది.

గ‌త జాబితాలో తిరుప‌తి ఎంపీగా నియ‌మించిన స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ‌ద్ద‌ని వెళ్లిపోయారు. దీంతో ఆ స్థానానికి వేరే వారిని నియ‌మిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, అనూహ్యంగా ఎమ్మెల్యే స్థానానికి పంపించిన ఎంపీ గురుమూర్తిని తీసుకువ‌చ్చి మ‌ళ్లీ తిరుప‌తికి కేటాయించారు. ఇక‌, ఇప్పుడు ఇచ్చిన జాబితాలోనూ ఇలాంటి మార్పే క‌నిపించింది. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డ‌ప్ప‌ను అసెంబ్లీకి పంపించారు. అదేవిధంగా గంగాధ‌ర నెల్లూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌స్వామిని చిత్తూరు ఎంపీగా పంపించారు.కానీ, తాజా జాబితాలో వీరిని తిరిగి య‌థాస్థానానికి తీసుకువ‌చ్చారు. మ‌రి ఇదేం మార్పు ? అనేది వైసీపీనాయ‌కుల ప్ర‌శ్న‌. దీనిపై అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది. 

This post was last modified on February 3, 2024 8:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago