Political News

ఆ ఎమ్మెల్యేకు లైన్ క్లియ‌ర్ చేసిన సీఎం జ‌గ‌న్‌!

కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఉమ్మ‌డి కృష్నాజిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌… పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న ఎక్క‌డ మాట్లాడినా.. సంక్షేమం ఒక్క‌టే చాల‌దు.. ప్ర‌జ‌లు అభివృద్ధిని కోరుతున్నారు. ఇది మాకు చేత‌కావ‌డం లేదు.. అని అంటున్నారు. ఈ వ్యాఖ్య‌లు పార్టీలోనూ.. ప్ర‌భుత్వంలోనూ చ‌ర్చ‌గా మారాయి. ఈ నేప‌థ్యానికి తోడు.. శ‌నివారం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హిస్తున్న సిద్ధం బ‌హిరంగ స‌భ‌కు ఎమ్మెల్యే వ‌సంత స‌హాయ నిరాక‌ర‌ణ ప్ర‌క‌టించారు. తాను వ‌చ్చేది లేద‌న్నారు. త‌న త‌ర‌పున కూడా ఎవ‌రూ రానన్నారు.

దీంతో ఎమ్మెల్యే వ‌సంత అంత‌రంగాన్ని అంచ‌నా వేసిన సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు లైన్ క్లియ‌ర్ చేశారు. నీ ఇష్టం.. నీ దారి నువ్వు చూసుకోవ‌చ్చు అన్న‌ట్టుగా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జిగా ఉన్న వసంత‌ను త‌ప్పించే శారు. ఈ స్థానంలో మైల‌వ‌రం జెడ్పీటీసీ స‌భ్యుడు తిరుప‌తి రావు పేరును సీఎం ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈయ‌న త్వ‌ర‌లోనే బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఫ‌లితంగా వ‌సంత ఇక‌, త‌న దారి తాను చూసుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డిందని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఇప్పుడు ఎవ‌రు?

ఇక‌, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్.. వైసీపీని వీడితే.. ఆ స్తానంలో ఎవ‌రు పోటీ చేయ‌నున్నార‌నే చ‌ర్చ కూడా వైసీపీలో వ‌చ్చింది. దీనికి ప్ర‌త్యామ్నాయంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒక‌టి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్న దేవినేని అవినాష్‌ను ఇక్క‌డ కు పంపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న దీనికి ఒప్పుకొంటారా? లేదా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. గ‌త రెండున్న‌రేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రం చేశారు. ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. తానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో దాదాపు ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం వ‌దులుకునే అవ‌కాశం లేదు.

ఒక‌వేళదేవినేని అవినాష్ తూర్పును వ‌దులుకునేందుకురెడీగా లేక‌పోతే..ఈ సీటును ఆశిస్తున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతా చౌద‌రిని నేరుగా మైల‌వ‌రం నుంచి దింపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మైల‌వ‌రంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డం.. వారే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వసంత‌కు అండ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు కేశినేని నాని వారిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌గ‌లిగితే.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఈజీయేన‌ని పార్టీ కూడా అంచ‌నా వేసింది. ఈ నేప‌థ్యంలోనే వ‌సంత విష‌యంపై ముందుగానే ఉప్పందినా.. వేచి చూసి.. చివ‌ర‌కు ఆయ‌న ధోర‌ణిని తీవ్రంగా ప‌రిగ‌ణించి.. తాజాగా మార్పు దిశ‌గా అడుగులు వేసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 3, 2024 8:44 am

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

3 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

3 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

3 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

5 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

5 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

7 hours ago