Political News

ఆ ఎమ్మెల్యేకు లైన్ క్లియ‌ర్ చేసిన సీఎం జ‌గ‌న్‌!

కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఉమ్మ‌డి కృష్నాజిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌… పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న ఎక్క‌డ మాట్లాడినా.. సంక్షేమం ఒక్క‌టే చాల‌దు.. ప్ర‌జ‌లు అభివృద్ధిని కోరుతున్నారు. ఇది మాకు చేత‌కావ‌డం లేదు.. అని అంటున్నారు. ఈ వ్యాఖ్య‌లు పార్టీలోనూ.. ప్ర‌భుత్వంలోనూ చ‌ర్చ‌గా మారాయి. ఈ నేప‌థ్యానికి తోడు.. శ‌నివారం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హిస్తున్న సిద్ధం బ‌హిరంగ స‌భ‌కు ఎమ్మెల్యే వ‌సంత స‌హాయ నిరాక‌ర‌ణ ప్ర‌క‌టించారు. తాను వ‌చ్చేది లేద‌న్నారు. త‌న త‌ర‌పున కూడా ఎవ‌రూ రానన్నారు.

దీంతో ఎమ్మెల్యే వ‌సంత అంత‌రంగాన్ని అంచ‌నా వేసిన సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు లైన్ క్లియ‌ర్ చేశారు. నీ ఇష్టం.. నీ దారి నువ్వు చూసుకోవ‌చ్చు అన్న‌ట్టుగా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జిగా ఉన్న వసంత‌ను త‌ప్పించే శారు. ఈ స్థానంలో మైల‌వ‌రం జెడ్పీటీసీ స‌భ్యుడు తిరుప‌తి రావు పేరును సీఎం ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈయ‌న త్వ‌ర‌లోనే బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఫ‌లితంగా వ‌సంత ఇక‌, త‌న దారి తాను చూసుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డిందని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఇప్పుడు ఎవ‌రు?

ఇక‌, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్.. వైసీపీని వీడితే.. ఆ స్తానంలో ఎవ‌రు పోటీ చేయ‌నున్నార‌నే చ‌ర్చ కూడా వైసీపీలో వ‌చ్చింది. దీనికి ప్ర‌త్యామ్నాయంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒక‌టి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్న దేవినేని అవినాష్‌ను ఇక్క‌డ కు పంపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న దీనికి ఒప్పుకొంటారా? లేదా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. గ‌త రెండున్న‌రేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రం చేశారు. ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. తానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో దాదాపు ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం వ‌దులుకునే అవ‌కాశం లేదు.

ఒక‌వేళదేవినేని అవినాష్ తూర్పును వ‌దులుకునేందుకురెడీగా లేక‌పోతే..ఈ సీటును ఆశిస్తున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతా చౌద‌రిని నేరుగా మైల‌వ‌రం నుంచి దింపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మైల‌వ‌రంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డం.. వారే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వసంత‌కు అండ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు కేశినేని నాని వారిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌గ‌లిగితే.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఈజీయేన‌ని పార్టీ కూడా అంచ‌నా వేసింది. ఈ నేప‌థ్యంలోనే వ‌సంత విష‌యంపై ముందుగానే ఉప్పందినా.. వేచి చూసి.. చివ‌ర‌కు ఆయ‌న ధోర‌ణిని తీవ్రంగా ప‌రిగ‌ణించి.. తాజాగా మార్పు దిశ‌గా అడుగులు వేసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 3, 2024 8:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago