కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఉమ్మడి కృష్నాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్… పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కడ మాట్లాడినా.. సంక్షేమం ఒక్కటే చాలదు.. ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారు. ఇది మాకు చేతకావడం లేదు.. అని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ చర్చగా మారాయి. ఈ నేపథ్యానికి తోడు.. శనివారం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభకు ఎమ్మెల్యే వసంత సహాయ నిరాకరణ ప్రకటించారు. తాను వచ్చేది లేదన్నారు. తన తరపున కూడా ఎవరూ రానన్నారు.
దీంతో ఎమ్మెల్యే వసంత అంతరంగాన్ని అంచనా వేసిన సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఆయనకు లైన్ క్లియర్ చేశారు. నీ ఇష్టం.. నీ దారి నువ్వు చూసుకోవచ్చు అన్నట్టుగా మైలవరం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా ఉన్న వసంతను తప్పించే శారు. ఈ స్థానంలో మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు తిరుపతి రావు పేరును సీఎం ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో ఈయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఫలితంగా వసంత ఇక, తన దారి తాను చూసుకునేందుకు అవకాశం ఏర్పడిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇప్పుడు ఎవరు?
ఇక, వసంత కృష్ణ ప్రసాద్.. వైసీపీని వీడితే.. ఆ స్తానంలో ఎవరు పోటీ చేయనున్నారనే చర్చ కూడా వైసీపీలో వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్తగా ఉన్న దేవినేని అవినాష్ను ఇక్కడ కు పంపించనున్నారని తెలుస్తోంది. ఆయన దీనికి ఒప్పుకొంటారా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. గత రెండున్నరేళ్లుగా నియోజకవర్గంలో దేవినేని కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ప్రజలను కలిశారు. తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు ఆయన ఈ నియోజకవర్గం వదులుకునే అవకాశం లేదు.
ఒకవేళదేవినేని అవినాష్ తూర్పును వదులుకునేందుకురెడీగా లేకపోతే..ఈ సీటును ఆశిస్తున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతా చౌదరిని నేరుగా మైలవరం నుంచి దింపే అవకాశం ఉందని అంటున్నారు. మైలవరంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం.. వారే గత ఎన్నికల్లో ఇక్కడ వసంతకు అండగా ఉండడం గమనార్హం. ఇప్పుడు కేశినేని నాని వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయగలిగితే.. గెలుపు గుర్రం ఎక్కడం ఈజీయేనని పార్టీ కూడా అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే వసంత విషయంపై ముందుగానే ఉప్పందినా.. వేచి చూసి.. చివరకు ఆయన ధోరణిని తీవ్రంగా పరిగణించి.. తాజాగా మార్పు దిశగా అడుగులు వేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…