Political News

అమ‌రావ‌తికి ఇంత అవ‌మానామా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌రో సారి అన్యాయం జ‌రిగింది. ఇక్క‌డి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర బ‌డ్జెట్ లో అత్యంత హీన‌మైన కేటాయింపులు చేశారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి రాజ‌దానికి అన్యాయం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఏపీ ఎంపీ దుర్బ‌ల ప‌నితీరు కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. న‌వ న‌గ‌రాల స‌మాహారంతో రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయిలో ప్ర‌మోట్ చేయాల‌ని గ‌త ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఈ క్ర‌మంలోనే రైతుల నుంచి 33 వేల ఎక‌రాల భూముల‌ను స‌మీక‌రించింది.

హైద‌రాబాద్‌లో ఎలా అయితే.. చిన్న చిన్న స్టేష‌న్‌ల‌ను కూడా అనుసందానం చేస్తూ.. రైల్వే లైన్ నిర్మించా రో.. ఇక్క‌డ అమ‌రావ‌తిలోనూ రాజ‌ధానిని రైల్వే లైన్‌తో అనుసంధానం చేయాల‌ని అప్ప‌ట్లో సంక‌ల్పించారు. అంటే.. అమ‌రావ‌తి – నంబూరు – పెద‌కూర‌పాడు – న‌ర‌స‌రావుపేట – ఎర్రుపాలెంల మీదుగా కొత్త‌గా లైన్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో దీనికి గాను 2679 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని కూడా అంచ‌నా వేశారు.

ఈ మొత్తం రైల్వే లైను 106 కిలో మీట‌ర్లు. ఇది.. కనుక అందిస్తే.. ఈ ప్రాంతంలో భ‌విష్య‌త్తులో మెట్రో రైలు లేదా.. లోక‌ల్ రైలు నడ‌పాల‌నేది అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం లక్ష్యం. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. అమ‌రావ‌తి అట‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఇక‌, దీంతో పాటు.. అమ‌రావ‌తి రైలు ప్రాజెక్టు కూడా.. పూర్తిగా బుట్టదాఖ‌లైన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ప్ర‌వేశ పెట్టింన మ‌ధ్యంతర బ‌డ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు అక్ష‌రాల కేటాయించింది 1000 రూపాయ‌లు మాత్ర‌మే.

దీంతో ఈ ప‌రిణామాన్ని.. అమ‌రావ‌తి రైతులు తీవ్ర అవ‌మానంగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉదాసీన‌త‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డ‌మేనా? రాష్ట్రం గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోరా? అని నిల‌దీస్తున్నారు. ఈ ప‌రిణామానికి కార‌ణం.. రాష్ట్ర ప్ర‌బుత్వం స‌రిగా స్పందించ‌క‌పోవ‌డ‌మేన‌ని స‌మాచారం. 22 మంది అధికార పార్టీ ఎంపీలు ఉండి ప్రయోజ‌నం లేకుండా పోయింద‌ని అంటున్నారు.

This post was last modified on February 2, 2024 6:07 pm

Share

Recent Posts

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

26 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

26 minutes ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

2 hours ago

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

3 hours ago

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

4 hours ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

6 hours ago