Political News

ఢిల్లీలో మోడీకి ఇచ్చిపడేసిన షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉన్న జగన్ వేరు, ఇప్పుడున్న జగన్ వేరని, ఈయన తన అన్న కాదని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైఎస్ కుటుంబాన్ని ముక్కలు చేసింది కూడా జగనన్న అంటూ షర్మిల వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన షర్మిల….ప్రధాని మోడీ, ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు.

ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా హామీని మోడీ తుంగలో తొక్కారని, ఒక ఏడాది కూడా హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఎన్నో హామీలు గుప్పించారని, ఒకటి కూడా పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలోని పార్టీలు బానిసలుగా మారాయని ఆరోపించారు. ఏపీ హక్కుల కోసం పోరాడుతోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రాష్ట్ర హక్కులు సాధించే వరకు ఈ పోరాటం ఆగదని షర్మిల అన్నారు.

ఇదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కలిశానని, ఏపీకి బీజేపీ చేసిన మోసాలపై వివిధ పార్టీల అధినేతలకు లేఖలు రాస్తానని షర్మిల అన్నారు. అంతేకాదు, ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ లకు కూడా లేఖ రాస్తానని చెప్పారు. ఆలస్యమైనా ప్రజాస్వామ్యం గెలుపు తథ్యమన్నారు. ఏపీ విభజన హామీలను సాధించేవరకు తమ పోరాటం ఆగదని షర్మిల చెప్పారు. మరి, షర్మిల వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన ఏ విధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago