Political News

యువ‌గ‌ళం పోయి ‘శంఖారావం’ వచ్చె

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి జ‌నంలోకి రానున్నారు. ఈ నెల 5, 6 తేదీల నుంచి ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతున్నారు. శంఖారావం పేరుతో ఆయ‌న మూడు జిల్లాల్లో స‌భ‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్వ‌తీపురం మ‌న్యం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప‌ర్య‌టించ‌ను న్న ఆయ‌న‌.. శంఖారావం పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తారు. త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్టీ ప‌రంగా ఇప్ప‌టికే రాష్ట్రంలో ఊపు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌చార‌ప‌ర్వంలోనూ పార్టీ దూకుడుగా ఉంది. ఎట్టి ప‌రిస్తితిలోనూ టీడీపీని గెలిపించుకోవా ల‌న్న సంక‌ల్పంతో ఉండ‌డంతో నారా కుటుంబం మొత్తంగా రాజ‌కీయ బాట ప‌ట్టింది. ఇదిలావుంటే.. ఇప్పుడు చేప‌ట్ట‌నున్న శంఖారావానికి ప్ర‌త్యేక ఏంటంటే.. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర కొంత గ్యాప్ వ‌చ్చింది. అనివార్య కార‌ణాల‌తో యువ‌గ‌ళం పాద‌యాత్ర నిడివిని త‌గ్గించుకున్నారు. దీంతో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని కీల‌క‌మైన వాటిని వ‌దిలేశారు.

ఈ నేప‌థ్యంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర క‌వ‌ర్ చేయ‌ని ప్రాంతాల్లో ఇప్పుడు శంఖారావం పేరుతో నారా లోకేష్ భారీ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌ను ఎంచుకున్నారు. ఈ స‌భ‌ల ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేరువకానున్నారు. ఈ నెల 5వ తేదీన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నారా లోకేష్‌ శంఖారావం స‌భ‌ను ప్రారంభిస్తారు.

అనంత‌రం.. 6వ తేదీన‌ పాలకొండ చేరుకుని, 7న పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో స‌భ‌లు పెడ‌తారు. 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9న చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 10న విజయనగరం, గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో పర్యటించి.. స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. అదేవిధంగా. పార్టీ కార్య‌క్ర‌మాలు..అభ్య‌ర్థుల ప‌నితీరును కూడా తెలుసుకోనున్నారు.

This post was last modified on February 2, 2024 2:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago