టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి జనంలోకి రానున్నారు. ఈ నెల 5, 6 తేదీల నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. శంఖారావం పేరుతో ఆయన మూడు జిల్లాల్లో సభలకు సిద్ధమవుతున్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించను న్న ఆయన.. శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఇప్పటికే రాష్ట్రంలో ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రచారపర్వంలోనూ పార్టీ దూకుడుగా ఉంది. ఎట్టి పరిస్తితిలోనూ టీడీపీని గెలిపించుకోవా లన్న సంకల్పంతో ఉండడంతో నారా కుటుంబం మొత్తంగా రాజకీయ బాట పట్టింది. ఇదిలావుంటే.. ఇప్పుడు చేపట్టనున్న శంఖారావానికి ప్రత్యేక ఏంటంటే.. గత ఏడాది జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర కొంత గ్యాప్ వచ్చింది. అనివార్య కారణాలతో యువగళం పాదయాత్ర నిడివిని తగ్గించుకున్నారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన వాటిని వదిలేశారు.
ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్ర కవర్ చేయని ప్రాంతాల్లో ఇప్పుడు శంఖారావం పేరుతో నారా లోకేష్ భారీ సభలు నిర్వహించాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఎంచుకున్నారు. ఈ సభల ద్వారా.. ప్రజలకు ఆయన చేరువకానున్నారు. ఈ నెల 5వ తేదీన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నారా లోకేష్ శంఖారావం సభను ప్రారంభిస్తారు.
అనంతరం.. 6వ తేదీన పాలకొండ చేరుకుని, 7న పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో సభలు పెడతారు. 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9న చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 10న విజయనగరం, గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో పర్యటించి.. సభల్లో పాల్గొననున్నారు. అదేవిధంగా. పార్టీ కార్యక్రమాలు..అభ్యర్థుల పనితీరును కూడా తెలుసుకోనున్నారు.
This post was last modified on February 2, 2024 2:01 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…