Political News

యువ‌గ‌ళం పోయి ‘శంఖారావం’ వచ్చె

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి జ‌నంలోకి రానున్నారు. ఈ నెల 5, 6 తేదీల నుంచి ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతున్నారు. శంఖారావం పేరుతో ఆయ‌న మూడు జిల్లాల్లో స‌భ‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్వ‌తీపురం మ‌న్యం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప‌ర్య‌టించ‌ను న్న ఆయ‌న‌.. శంఖారావం పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తారు. త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్టీ ప‌రంగా ఇప్ప‌టికే రాష్ట్రంలో ఊపు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌చార‌ప‌ర్వంలోనూ పార్టీ దూకుడుగా ఉంది. ఎట్టి ప‌రిస్తితిలోనూ టీడీపీని గెలిపించుకోవా ల‌న్న సంక‌ల్పంతో ఉండ‌డంతో నారా కుటుంబం మొత్తంగా రాజ‌కీయ బాట ప‌ట్టింది. ఇదిలావుంటే.. ఇప్పుడు చేప‌ట్ట‌నున్న శంఖారావానికి ప్ర‌త్యేక ఏంటంటే.. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర కొంత గ్యాప్ వ‌చ్చింది. అనివార్య కార‌ణాల‌తో యువ‌గ‌ళం పాద‌యాత్ర నిడివిని త‌గ్గించుకున్నారు. దీంతో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని కీల‌క‌మైన వాటిని వ‌దిలేశారు.

ఈ నేప‌థ్యంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర క‌వ‌ర్ చేయ‌ని ప్రాంతాల్లో ఇప్పుడు శంఖారావం పేరుతో నారా లోకేష్ భారీ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌ను ఎంచుకున్నారు. ఈ స‌భ‌ల ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేరువకానున్నారు. ఈ నెల 5వ తేదీన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నారా లోకేష్‌ శంఖారావం స‌భ‌ను ప్రారంభిస్తారు.

అనంత‌రం.. 6వ తేదీన‌ పాలకొండ చేరుకుని, 7న పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో స‌భ‌లు పెడ‌తారు. 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9న చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 10న విజయనగరం, గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో పర్యటించి.. స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. అదేవిధంగా. పార్టీ కార్య‌క్ర‌మాలు..అభ్య‌ర్థుల ప‌నితీరును కూడా తెలుసుకోనున్నారు.

This post was last modified on February 2, 2024 2:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago