Political News

బరాబర్ రేవంత్ ను కలుస్తా: మల్లారెడ్డి

బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. సోషల్ మీడియాలో సినీ హీరోలకు పోటీగా తనకు కూడా ఫాలోయింగ్ ఉందని మల్లారెడ్డి స్వయంగా చెప్పిన వీడియో వైరల్ అయింది. ఇక, కాంగ్రెస్ గెలవగానే మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఆ టాక్ కు తగ్గట్లుగానే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి మల్లారెడ్డి డుమ్మా కొట్టారు.

ఆ భేటీకి మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు,మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు గైర్హాజరు కావడం సంచలనం రేపింది. అయితే, ఆ తర్వాత వారంతా బీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఈ క్రమంలోనే తాజాగా మల్లారెడ్డి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. బరాబర్ రేవంత్ ను కలుస్తా అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిస్తే తప్పేంటని మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నారు. గతంలో తాము టీడీపీలో కలిసి పనిచేశామని మల్లారెడ్డి చెప్పారు.

ఇక, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేయాలని తనను బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారని, కానీ, తాను ఆ టికెట్ ను తన కుమారుడికి అడుతున్నానని అన్నారు. ఇటీవల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డి కలవడంతో వారు కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రేవంత్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. అయితే, తామంతా మర్యాదపూర్వకంగా, నియోజకవర్గంలోని పెండింగ్ పనుల కోసం కలిశామని చెప్పుకొచ్చారు.

This post was last modified on February 1, 2024 7:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

59 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago