ముసురుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్టెట్.. ఆసక్తిగా నిలి చిందనే చెప్పాలి. ఎలాంటి శషభిషలకు తావు లేకుండా.. ఇది ఎన్నికల బడ్జెట్ అని చెప్పకనే చెప్పేశారు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పైకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికి… కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దీనిని వండి వార్చడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా మోడీ ప్రభుత్వం కూడా ముందుకు పోలేదు.
ముఖ్యంగా 2014 నుంచి అంటే.. దాదాపు పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వేతన జీవులకు ఈ బడ్జెట్లో ఊరట లభించిందనేది విశ్లేషకుల మాట. అయితే.. ఇది కొంత వరకు వాస్తమనే చెప్పాలి. ఎందుకంటే.. 2015-16, 2018-19, 2021-22, 2022-23లో వేతన జీవుల ప్రస్తావన మచ్చుకైనా లేకుండానే బడ్జెట్ను రూపొందించారు. కేవలం 2016-17, 2020-21 బడ్జెట్లో మాత్రమే జీతగాళ్ల గురించి కొంత ప్రస్తావించారు.వాటితో పోల్చుకుంటే.. ప్రస్తుతం వేతన జీవుల గురించి ఆలోచించారు.
ప్రస్తుతం ఆదాయ పన్ను శ్లాబు.. 2.5 లక్షల వరకు ఎలాంటి వసూళ్లు లేవు. ఇక, ఇక్కడ నుంచి 5 లక్షల మధ్య చూపించే ఆదయ పన్ను పరిమితి లెక్కలను అంచనా వేసి. వాటిపైనా పన్ను మినహాయింపులు ఇచ్చారు. అంటే. వాస్తవ పన్ను మినహాయింపు ఇప్పటికీ 2.5 లక్షల వరకు మాత్రమే ఉంది. తర్వాత.. ఉద్యోగులు సంపాయించుకునే సొమ్ముపై లెక్కలు చూపించారు. దీనిని ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాల్లో ఎత్తి చూపించాయి.
సరే.. ప్రస్తుతం ప్రకటించిన దానిలో 7 లక్షల వరకు మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంటే.. ఇప్పుడున్న మినహాయింపులు రూ.2 లక్షలకు పెంచారు. కానీ, ద్రవ్యోల్బణం ఆధారిత ఆదాయాన్ని అంచనా వేస్తున్నప్పుడు.. సగటున వేతనాలు.. 1 లక్ష వరకు పెంచుకునే అవకాశం ఉందని.. గత బడ్జెట్లోనే ప్రతిపాదించారు. ఈ ప్రకారం చూసుకున్నప్పుడు.. ఉన్నత స్థాయి, ఎగుమ మధ్యతరగతి ఉద్యోగి ఆదాయాలు.. రమారమి.. లక్ష వరకు ఉంది.
దీనిలో వెసులు బాటు లేకుండా.. గుండుగుత్తగా 7 లక్షలకు ప్రకటించడం.. ఎన్నికల హంబక్కే నన్నది విశ్లేషకుల అంచనా. ఇక, 7 లక్షల కు కూడా.. పన్ను పరిమితిలో యథాతథంగా వివిధ స్కీమ్లు.. ఇతరత్రా పెట్టుబడుల మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి.. పన్ను పరిమితి.. అంకెల రూపంలో పెరిగినా.. సంఖ్యాపరంగా.. మాత్రం 2.5 లక్షలకే ఉండడం గమనార్హం.
This post was last modified on February 1, 2024 2:29 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…