ముసురుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్టెట్.. ఆసక్తిగా నిలి చిందనే చెప్పాలి. ఎలాంటి శషభిషలకు తావు లేకుండా.. ఇది ఎన్నికల బడ్జెట్ అని చెప్పకనే చెప్పేశారు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పైకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికి… కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దీనిని వండి వార్చడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా మోడీ ప్రభుత్వం కూడా ముందుకు పోలేదు.
ముఖ్యంగా 2014 నుంచి అంటే.. దాదాపు పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వేతన జీవులకు ఈ బడ్జెట్లో ఊరట లభించిందనేది విశ్లేషకుల మాట. అయితే.. ఇది కొంత వరకు వాస్తమనే చెప్పాలి. ఎందుకంటే.. 2015-16, 2018-19, 2021-22, 2022-23లో వేతన జీవుల ప్రస్తావన మచ్చుకైనా లేకుండానే బడ్జెట్ను రూపొందించారు. కేవలం 2016-17, 2020-21 బడ్జెట్లో మాత్రమే జీతగాళ్ల గురించి కొంత ప్రస్తావించారు.వాటితో పోల్చుకుంటే.. ప్రస్తుతం వేతన జీవుల గురించి ఆలోచించారు.
ప్రస్తుతం ఆదాయ పన్ను శ్లాబు.. 2.5 లక్షల వరకు ఎలాంటి వసూళ్లు లేవు. ఇక, ఇక్కడ నుంచి 5 లక్షల మధ్య చూపించే ఆదయ పన్ను పరిమితి లెక్కలను అంచనా వేసి. వాటిపైనా పన్ను మినహాయింపులు ఇచ్చారు. అంటే. వాస్తవ పన్ను మినహాయింపు ఇప్పటికీ 2.5 లక్షల వరకు మాత్రమే ఉంది. తర్వాత.. ఉద్యోగులు సంపాయించుకునే సొమ్ముపై లెక్కలు చూపించారు. దీనిని ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాల్లో ఎత్తి చూపించాయి.
సరే.. ప్రస్తుతం ప్రకటించిన దానిలో 7 లక్షల వరకు మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంటే.. ఇప్పుడున్న మినహాయింపులు రూ.2 లక్షలకు పెంచారు. కానీ, ద్రవ్యోల్బణం ఆధారిత ఆదాయాన్ని అంచనా వేస్తున్నప్పుడు.. సగటున వేతనాలు.. 1 లక్ష వరకు పెంచుకునే అవకాశం ఉందని.. గత బడ్జెట్లోనే ప్రతిపాదించారు. ఈ ప్రకారం చూసుకున్నప్పుడు.. ఉన్నత స్థాయి, ఎగుమ మధ్యతరగతి ఉద్యోగి ఆదాయాలు.. రమారమి.. లక్ష వరకు ఉంది.
దీనిలో వెసులు బాటు లేకుండా.. గుండుగుత్తగా 7 లక్షలకు ప్రకటించడం.. ఎన్నికల హంబక్కే నన్నది విశ్లేషకుల అంచనా. ఇక, 7 లక్షల కు కూడా.. పన్ను పరిమితిలో యథాతథంగా వివిధ స్కీమ్లు.. ఇతరత్రా పెట్టుబడుల మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి.. పన్ను పరిమితి.. అంకెల రూపంలో పెరిగినా.. సంఖ్యాపరంగా.. మాత్రం 2.5 లక్షలకే ఉండడం గమనార్హం.
This post was last modified on February 1, 2024 2:29 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…