కేంద్ర ప్రభుత్వం తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలలకు మధ్యంతర బడ్జెట్ను తీసుకువచ్చింది. అయితే.. బడ్జెట్ను సమగ్రంగా అర్థం చేసుకున్నా.. పూర్తిగా అర్థమయ్యే కోణంలో విన్నా.. ఇది ఎన్నికల తాయిలాల బడ్జెట్ గానే భావిస్తోంది. అన్ని వర్గాలకు మేలు చేస్తున్నామని చెబుతూ.. ప్రకటించిన ఈ బడ్జెట్లో నిజంగానే మేలు ప్రకటించారు. కానీ, అది పూర్తిస్థాయిలో కాకుండా.. అన్నీ అప్పులు.. రుణాలు.. వడ్డీలేని రుణాలు, సాయాలుగానే ఉన్నాయి.
సహజంగా ఎన్నికలు అనగానే ఉచితాలకు పెద్దపీట వేసే సంస్కృతి ఉంది. కానీ, తాజా బడ్జెట్లో ప్రకటించిన వాటిని గమనిస్తే.. ఎవరికీ ఏదీ ఉచితం కాదు అనే చెప్పారు. మొత్తం బడ్జెట్ ఈ మూడు మాసాల కాలానికీ రూ.47.66 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. దీనిలోనూ మొత్తంగా ఆదాయం.. అది పన్నులు, సెస్సులు, సుంకాలు ఏవైనా కావొచ్చు.. రూ.30.80లక్షల కోట్లుగా నిర్మలమ్మ పేర్కొన్నారు. అంటే.. బాగానే పిండేయనున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక, ప్రజల విషయానికి వస్తే.. మధ్యతరగతి ప్రజల విషయాన్ని ప్రస్తావించారు. పైన చెప్పుకొన్నట్టు ఏదీ ఊరికేనే వీరికి ఇవ్వడం లేదు. అయితే.. ఇంటి నిర్మాణానికి సంబంధించిన రుణాలను అందించనున్నా రు. నిజానికి ఇప్పటికే పీఎం ఆవాస్ యోజన కింద రూ.2లక్షల వరకు రుణ మినహాయింపు ఉంది. దీనిని పెంచకుండా.. దానినే కంటిన్యూ చేస్తామని చెప్పినట్టు అయింది. అయితే.. మరోవైపు బ్యాంకుల వడ్డీలకు ఎక్కడా అడ్డుకట్ట వేస్తామని చెప్పకపోవడం గమనార్హం.
యువతకు ఉప్పుడున్న ఉపాధి చాలన్నట్టుగా కొత్త ఎలాంటి పథకాలను ప్రకటించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎంలను ఏకరువు పెట్టారు. ఇక, రైతులకు పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచుతారని అందరూ అనుకున్నా.. ఒరిగింది శూన్యం. ఎక్కడా ఆ మాట కూడా వినిపించలేదు. కొత్త గిడ్డంగులు నిర్మించాలన్న దేశవ్యాప్త రైతాంగం ఘోష కంఠ శోషగా మారింది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తూ.. ఆర్థిక సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే.. రైతులు తమ ఉత్పత్తులు దాచుకునేందుకు ప్రైవేటును ఆశ్రయించాల్సి వస్తుండడం గమనార్హం.
This post was last modified on February 1, 2024 11:07 pm
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…
``సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి…
గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…