Political News

మోడీతో సెల్ఫీ..తీసుకోక తప్పదు!

నిజ‌మే.. ఇది ఒక ప‌థ‌కం కింద అమ‌లు చేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రి కూడా చేశారు. సాక్షాత్తూ… కేంద్ర ఆహార , వినియోగ‌, స‌ర‌ఫ‌రాల శాఖ ఈ మేర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కూడా.. స‌మాచారం పంపించింది. మోడీతో సెల్ఫీని తప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని.. దీనిని మొక్కుబ‌డి తంతుగా మాత్రం పూర్తి చేయొద్ద‌ని కూడా ఆదేశించడం గ‌మ‌నార్హం. దీనిపై క‌లెక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా ఉండాల‌ని పేర్కొంది.

ఏంటీ మోడీతో సెల్ఫీ..

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ.. రేష‌న్ బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేస్తారు. పేద‌రిక రేఖ‌కు దిగువ‌న‌.. ఎగువ‌న ఉన్న వారికి రేష‌న్ దుకాణాల్లో బియ్యం, కందిప‌ప్పు, ఆయిల్‌, చ‌క్కెర వంటివాటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇది రాష్ట్రాల్లో ఖ‌చ్చితంగా అమ‌ల‌వుతున్న విధానం. అయితే.. ఈ బియ్యం విష‌యంలో క‌రోనా అనంత‌రం.. కేంద్ర‌మే జోక్యం చేసుకుని.. ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇంత‌కుముంద రూ.1కి బియ్యం ఇచ్చేవారు . ఇప్పుడు అది కూడాలేదు.

అంత్యోద‌య అన్న యోజ‌న ప‌థ‌కం కింద‌.. కేంద్రం రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబానికి త‌ల‌కు 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమ‌లు, నూనె, చ‌క్కెర‌ల‌ను పంపిణీ చేస్తున్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ఉచిత బియ్యం పథకం ఈనెల నుంచి ఐదేళ్లకు పొడిగించారు. ఇది కొన్ని కోట్ల మందికి(20 కోట్లని అంచ‌నా) చేర‌నుంది. దీంతో దీనిని ఎన్నిక‌ల అస్త్రంగా మార్చుకునేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నించింది.

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ఉచిత బియ్యం పథకాన్ని ప్రజలకు తెలిసేలా దేశవ్యాప్తం గా రేషన్‌ దుకాణాల్లో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ.. ఫొటో ఉన్న సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేస్తారు. రేష‌న్ బియ్యం తీసుకున్న మ‌హిళ లేదా.. పురుషుడు.. బియ్యం తీసుకున్నాక‌.. వెంట‌నే అదే దుకాణంలో ఏర్పాటు చేసిన మోడీ సెల్ఫీ పాయింట్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని స్థానికంగా ఉన్న అధికారుల‌కు అందించాల‌ని కూడా కేంద్రం సూచించింది.

This post was last modified on January 31, 2024 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

33 minutes ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

51 minutes ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

3 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

3 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

4 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

4 hours ago