Political News

మోడీతో సెల్ఫీ..తీసుకోక తప్పదు!

నిజ‌మే.. ఇది ఒక ప‌థ‌కం కింద అమ‌లు చేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రి కూడా చేశారు. సాక్షాత్తూ… కేంద్ర ఆహార , వినియోగ‌, స‌ర‌ఫ‌రాల శాఖ ఈ మేర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కూడా.. స‌మాచారం పంపించింది. మోడీతో సెల్ఫీని తప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని.. దీనిని మొక్కుబ‌డి తంతుగా మాత్రం పూర్తి చేయొద్ద‌ని కూడా ఆదేశించడం గ‌మ‌నార్హం. దీనిపై క‌లెక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా ఉండాల‌ని పేర్కొంది.

ఏంటీ మోడీతో సెల్ఫీ..

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ.. రేష‌న్ బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేస్తారు. పేద‌రిక రేఖ‌కు దిగువ‌న‌.. ఎగువ‌న ఉన్న వారికి రేష‌న్ దుకాణాల్లో బియ్యం, కందిప‌ప్పు, ఆయిల్‌, చ‌క్కెర వంటివాటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇది రాష్ట్రాల్లో ఖ‌చ్చితంగా అమ‌ల‌వుతున్న విధానం. అయితే.. ఈ బియ్యం విష‌యంలో క‌రోనా అనంత‌రం.. కేంద్ర‌మే జోక్యం చేసుకుని.. ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇంత‌కుముంద రూ.1కి బియ్యం ఇచ్చేవారు . ఇప్పుడు అది కూడాలేదు.

అంత్యోద‌య అన్న యోజ‌న ప‌థ‌కం కింద‌.. కేంద్రం రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబానికి త‌ల‌కు 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమ‌లు, నూనె, చ‌క్కెర‌ల‌ను పంపిణీ చేస్తున్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ఉచిత బియ్యం పథకం ఈనెల నుంచి ఐదేళ్లకు పొడిగించారు. ఇది కొన్ని కోట్ల మందికి(20 కోట్లని అంచ‌నా) చేర‌నుంది. దీంతో దీనిని ఎన్నిక‌ల అస్త్రంగా మార్చుకునేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నించింది.

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ఉచిత బియ్యం పథకాన్ని ప్రజలకు తెలిసేలా దేశవ్యాప్తం గా రేషన్‌ దుకాణాల్లో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ.. ఫొటో ఉన్న సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేస్తారు. రేష‌న్ బియ్యం తీసుకున్న మ‌హిళ లేదా.. పురుషుడు.. బియ్యం తీసుకున్నాక‌.. వెంట‌నే అదే దుకాణంలో ఏర్పాటు చేసిన మోడీ సెల్ఫీ పాయింట్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని స్థానికంగా ఉన్న అధికారుల‌కు అందించాల‌ని కూడా కేంద్రం సూచించింది.

This post was last modified on January 31, 2024 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago