Political News

వైసీపీ ఐదో జాబితాలో సంచ‌ల‌న మార్పులు

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు జాబితాలు ప్ర‌క‌టించింది. వీటిలో కొంద‌రికి స్థానచ‌ల‌నం క‌ల్పించ‌డంతోపాటు.. మ‌రికొంద‌రు కొత్త ముఖాల‌కు..(ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీల్లో) అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు తాజాగా ఐదో జాబితాను వైసీపీ ప్ర‌క‌టించింది. ఈ ఐదో జాబితాలో మొత్తం 4 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌గా.. మూడు అసెంబ్లీ స్థానాల‌కు స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను నియ‌మించింది. ఈ జాబితాను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు.

1) నర‌స‌రావుపేట ఎంపీ సీటును బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్ కుమార్ యాద‌వ్‌కు ఇచ్చారు. ఈయ‌న ప్ర‌స్తుతం నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో ఆయ‌న ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా కూడా గుర్తింపు పొందారు.

2) కాకినాడ పార్ల‌మెంటు స్థానాన్ని చెల‌మ‌ల శెట్టి సునీల్‌కు ఇచ్చారు. ఈయ‌న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. గ‌తంలోనూ.. ప్ర‌స్తుతం ఆయ‌న వివాద‌ర‌హిత నాయ‌కుడిగా సామాజిక వ‌ర్గంలో మంచి గుర్తింపు పొందారు. వ్యాపార వేత్త‌. ఆర్థికంగా బ‌లంగా ఉన్నారు.

3) తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ప్ర‌స్తుత ఎంపీ. గురుమూర్తినే డిసైడ్ చేశారు. ఈయ‌న వైద్యుడు. 2021లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి ఈయ‌న‌ను నాలుగో జాబితాలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి పంపించారు. కానీ, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఎంపిక చేసిన కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో గురుమూర్తి ప్లేస్‌ను తిరిగి ఆయ‌నకే ఇచ్చారు. ఈయ‌న కూడా వివాద ర‌హితుడు. విద్యావంతుడు.

4) మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స్థానానికి సింహాద్రి ర‌మేష్ బాబును ఎంపిక చేశారు. ఈయ‌న మాజీ ఎమ్మెల్యే. అవ‌నిగ‌డ్డ నుంచి గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న వివాదాల‌కు దూరంగా ఉంటారు.

5) స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నూక‌తోటి రాజేష్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న కొత్త‌వారు.

6) అర‌కు ఎమ్మెల్యేగా రేగం మ‌త్య్స‌లింగంకు అవ‌కాశం క‌ల్పించారు. ఈయ‌న కూడా కొత్త‌వారే. పైగా ఇది ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం గ‌మ‌నార్హం.

7) అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే సీటును సింహాద్రి చంద్ర‌శేఖ‌ర‌రావుకు ఇచ్చారు. మొత్తంగా.. మూడు అసెంబ్లీ, నాలుగు పార్ల‌మెంటు స్థానాల‌కు వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది.

This post was last modified on January 31, 2024 10:01 pm

Share
Show comments

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago