Political News

వైసీపీ ఐదో జాబితాలో సంచ‌ల‌న మార్పులు

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు జాబితాలు ప్ర‌క‌టించింది. వీటిలో కొంద‌రికి స్థానచ‌ల‌నం క‌ల్పించ‌డంతోపాటు.. మ‌రికొంద‌రు కొత్త ముఖాల‌కు..(ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీల్లో) అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు తాజాగా ఐదో జాబితాను వైసీపీ ప్ర‌క‌టించింది. ఈ ఐదో జాబితాలో మొత్తం 4 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌గా.. మూడు అసెంబ్లీ స్థానాల‌కు స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను నియ‌మించింది. ఈ జాబితాను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు.

1) నర‌స‌రావుపేట ఎంపీ సీటును బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్ కుమార్ యాద‌వ్‌కు ఇచ్చారు. ఈయ‌న ప్ర‌స్తుతం నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో ఆయ‌న ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా కూడా గుర్తింపు పొందారు.

2) కాకినాడ పార్ల‌మెంటు స్థానాన్ని చెల‌మ‌ల శెట్టి సునీల్‌కు ఇచ్చారు. ఈయ‌న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. గ‌తంలోనూ.. ప్ర‌స్తుతం ఆయ‌న వివాద‌ర‌హిత నాయ‌కుడిగా సామాజిక వ‌ర్గంలో మంచి గుర్తింపు పొందారు. వ్యాపార వేత్త‌. ఆర్థికంగా బ‌లంగా ఉన్నారు.

3) తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ప్ర‌స్తుత ఎంపీ. గురుమూర్తినే డిసైడ్ చేశారు. ఈయ‌న వైద్యుడు. 2021లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి ఈయ‌న‌ను నాలుగో జాబితాలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి పంపించారు. కానీ, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఎంపిక చేసిన కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో గురుమూర్తి ప్లేస్‌ను తిరిగి ఆయ‌నకే ఇచ్చారు. ఈయ‌న కూడా వివాద ర‌హితుడు. విద్యావంతుడు.

4) మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స్థానానికి సింహాద్రి ర‌మేష్ బాబును ఎంపిక చేశారు. ఈయ‌న మాజీ ఎమ్మెల్యే. అవ‌నిగ‌డ్డ నుంచి గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న వివాదాల‌కు దూరంగా ఉంటారు.

5) స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నూక‌తోటి రాజేష్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న కొత్త‌వారు.

6) అర‌కు ఎమ్మెల్యేగా రేగం మ‌త్య్స‌లింగంకు అవ‌కాశం క‌ల్పించారు. ఈయ‌న కూడా కొత్త‌వారే. పైగా ఇది ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం గ‌మ‌నార్హం.

7) అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే సీటును సింహాద్రి చంద్ర‌శేఖ‌ర‌రావుకు ఇచ్చారు. మొత్తంగా.. మూడు అసెంబ్లీ, నాలుగు పార్ల‌మెంటు స్థానాల‌కు వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది.

Satya

Recent Posts

బాలయ్య ట్విస్టునే అఖిల్ కోసం వాడారా

వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…

5 seconds ago

పొరబడ్డారు… నేనలాంటి వాడిని కాదు: ఏబీవీ

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

5 hours ago

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

11 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

11 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

13 hours ago