ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ.. ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ ఎన్నారై(ప్రవాసాంధ్ర) విభాగం కార్యకర్త.. యశస్వి బొద్దులూరి, ఉరఫ్ యశ్పై కేసులు నమోదు చేయడం తెలిసిందే. ఆయన తన తల్లిని పరామర్శించేందుకు గత నెల ప్రారంభంలో హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అయితే.. ఇది చట్ట విరుద్ధం కావడంతో ఆయనకు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే యశస్విపై లుకౌట్ సర్క్యులర్ను జారీ చేశారు.
అంటే.. యశస్వి విదేశాలకు వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం. అయితే.. ఇప్పటికే 41ఏ నోటీసులు ఇచ్చిన దరిమిలా.. ఇంకా లుకౌట్ నోటీసులు కొనసాగించడం ఏంటనేది యశ్ ప్రశ్న. ఈ క్రమంలోనే ఆయన ఈ లుకౌట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన న్యాయమూర్తి.. యశ్కు అనుకూలంగా తీర్పు చెప్పారు. సీఐడీ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ను రద్దు చేశారు. ఇప్పటికే యశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో ఇంకా చార్జిషీట్ వేయలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
చార్జిషీట్ వేయకుండానే లుకౌట్ సర్క్యులర్ కొనసాగించడం ఆర్టికల్ 21(జీవించే హక్కు, స్వేచ్ఛ)కి విరుద్ధమని న్యాయవాది ఉమేశ్ చంద్ర స్పష్టం చేశారు. అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చాక లుకౌట్ సర్క్యులర్ కొనసాగించడం అర్థరహితమని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 4న యశ్ అమెరికా వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఏపీ సీఐడీ జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
This post was last modified on January 30, 2024 10:19 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…