ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ.. ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ ఎన్నారై(ప్రవాసాంధ్ర) విభాగం కార్యకర్త.. యశస్వి బొద్దులూరి, ఉరఫ్ యశ్పై కేసులు నమోదు చేయడం తెలిసిందే. ఆయన తన తల్లిని పరామర్శించేందుకు గత నెల ప్రారంభంలో హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అయితే.. ఇది చట్ట విరుద్ధం కావడంతో ఆయనకు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే యశస్విపై లుకౌట్ సర్క్యులర్ను జారీ చేశారు.
అంటే.. యశస్వి విదేశాలకు వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం. అయితే.. ఇప్పటికే 41ఏ నోటీసులు ఇచ్చిన దరిమిలా.. ఇంకా లుకౌట్ నోటీసులు కొనసాగించడం ఏంటనేది యశ్ ప్రశ్న. ఈ క్రమంలోనే ఆయన ఈ లుకౌట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన న్యాయమూర్తి.. యశ్కు అనుకూలంగా తీర్పు చెప్పారు. సీఐడీ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ను రద్దు చేశారు. ఇప్పటికే యశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో ఇంకా చార్జిషీట్ వేయలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
చార్జిషీట్ వేయకుండానే లుకౌట్ సర్క్యులర్ కొనసాగించడం ఆర్టికల్ 21(జీవించే హక్కు, స్వేచ్ఛ)కి విరుద్ధమని న్యాయవాది ఉమేశ్ చంద్ర స్పష్టం చేశారు. అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చాక లుకౌట్ సర్క్యులర్ కొనసాగించడం అర్థరహితమని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 4న యశ్ అమెరికా వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఏపీ సీఐడీ జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
This post was last modified on January 30, 2024 10:19 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…