Political News

అన్నా ఈ సారి త‌ప్పుకోండి.. :జ‌గ‌న్‌

క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటూ రాజ‌కీయాలు చేసే నేత‌. గ‌త 15 ఏళ్లుగా క‌ర‌ణం రాజ‌కీయంగా ప‌ట్టుదొర‌క్క నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. తాను త‌ప్పుకుని త‌న కొడుకుని గ్రాండ్‌గా పొలిటిక‌ల్ ఎంట్రీ చేయిద్దామ‌ని.. కొడుకుతో అసెంబ్లీలో అధ్య‌క్షా అని పలికిద్దామ‌ని బ‌ల‌రాం క‌న్న క‌ల‌లు కూడా క‌ల‌లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు రాజ‌కీయంగా వేసిన త‌ప్ప‌ట‌డుగులతో ఏం చేయాలో తెలియ‌క డైల‌మాలో ప‌డిపోయిన ప‌రిస్థితి.

2014లోనే క‌ర‌ణం త‌న కుమారుడు వెంక‌టేష్‌కు టీడీపీ నుంచి అద్దంకి సీటు ఇప్పించుకున్నారు. 2009, 14 ఎన్నిక‌ల్లో క‌ర‌ణం తండ్రి, కొడుకుల‌ను ఓడించిన గొట్టిపాటి ర‌వికుమార్ టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డంతో అద్దంకిలో క‌ర‌ణం ఫ్యామిలీకి జోరుకు బ్రేకులు ప‌డిపోయాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు రాజీతో చీరాల నుంచి పోటీ చేసిన క‌ర‌ణం అక్క‌డ ప‌రిస్థితుల నేప‌థ్యంలో గెలిచారు. త‌ర్వాత యేడాదిన్న‌ర‌కే వైసీపీ చెంత చేరిపోయారు.

ప్ర‌స్తుతం చీరాల ఇన్‌చార్జ్‌గా క‌ర‌ణం త‌న‌యుడు వెంక‌టేష్ ఉన్నారు. అద్దంకిలో వ‌రుస‌గా తండ్రి, కొడుకులు ఓడిపోవ‌డం.. అక్క‌డ గొట్టిపాటి ర‌విపై పోటీచేస్తే గెల‌వ‌లేం అన్న డౌట్‌తో చీరాల‌ను ప‌ట్టుకుని వేలాడుతూ వ‌చ్చారు. పేరుకు వైసీపీ చెంత‌చేరినా కూడా ఈ తండ్రి, కొడుకులు ఏనాడు టీడీపీ, చంద్ర‌బాబు, లోకేష్‌పై ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేయ‌లేదు స‌రిక‌దా.. టీడీపీ వాళ్ల‌తో ట‌చ్‌లో ఉంటూ వ‌చ్చారు. ఇప్పుడు వైసీపీలో క‌ర‌ణం ఫ్యామిలీ సీన్ రివ‌ర్స్ అవుతోంది. బాలినేని అండ‌తో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ట్టెక్కుతూ వ‌చ్చిన క‌ర‌ణం ఫ్యామిలీని ఇప్పుడు జ‌గ‌న్ దేకే ప‌రిస్థితి లేదు.

అస‌లు వైసీపీలో బాలినేని మాటే చెల్లుబాటు కావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చీరాల నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకున్న క‌ర‌ణం తండ్రి, కొడుకుల‌కు ఈ సారి టిక్కెట్ ద‌క్కే ప‌రిస్థితి లేదు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎప్పుడో క‌ర‌ణం కుటుంబాన్ని అద్దంకి లేదా ప‌రుచూరు వెళ్లాల‌ని చెప్పినా విన‌కుండా చీరాలే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. చీరాల సీటు చివ‌రి క్ష‌ణంలో అయినా అయితే మాజీ ఎమ్మెల్యే ఆమంచికి లేదా బీసీల‌కు ఇచ్చే ఆలోచ‌న‌లోనే జ‌గ‌న్ ఉన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

ఇప్పుడు అద్దంకిలో హ‌నిమిరెడ్డి రూపంలో దారులు మూసుకుపోయాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన‌ప్పుడు కూడా అన్నా ఈ సారికి మీరు ఆగాల‌ని చెప్పిన‌ట్టు టాక్ ? అందుకే క‌ర‌ణం తండ్రి, కొడుకులు నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా సైలెంట్ అయ్యార‌ని ఆ పార్టీ వాళ్లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కాలుగాయంతో నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్న క‌ర‌ణం వెంక‌టేష్ ఇప్పుడిప్పుడే కాస్త యాక్టివ్ అవుతున్నా.. టిక్కెట్‌పై న‌మ్మ‌కం లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు స‌మాచారం.

టిక్కెట్ లేద‌న్న విష‌యం ఇప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చినా, నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్‌గా లేక‌పోయినా ఎన్నిక‌ల‌కు ముందు త‌మ కేడ‌ర్ అంతా జారిపోతుందన్న ఆందోళ‌న‌తోనే క‌ర‌ణం తండ్రి, కొడుకులు మేక‌పోతు గాంభీర్యంతోనే రాజ‌కీయం చేస్తున్న‌ట్టుగా కూడా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌వేళ అటు టీడీపీ వైపు చూసినా అక్క‌డ కూడా కుర్చీలు ఖాళీగా లేవు. ఏదేమైనా ఏదేనా అద్భుతం జ‌రిగితే త‌ప్పా ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో క‌ర‌ణం శకం ముగిసే వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది.

This post was last modified on January 30, 2024 10:18 pm

Share

Recent Posts

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

57 minutes ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

59 minutes ago

ఆదర్శ కుటుంబం ఇంక ఆలస్యం చేయొద్దు

ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…

1 hour ago

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

2 hours ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

2 hours ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

2 hours ago