టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై ఆయన దృష్టిపెట్టారు. ఈ క్రమంలో జనసేన కీలక నేతలతోనూ ఆయన కలపుకొని పోతున్నారు. తాజాగా మంగళవారం నుంచి గురువారం వరకు అంటే.. మూడు రోజుల పాటు చంద్రబాబు ఈ విషయంపైనే ఉండనున్నారు. ప్రస్తుతం ఏపీలో అభ్యర్థుల ఎంపికలు ఊపందుకున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే కార్యక్రమాన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తోంది.
మొత్తంగా 69 స్థానాలకు వైసీపీ సమన్వయ కర్తలను నిలబెట్టింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ వారి వారి ప్లేసెస్లో కుదురుకుంటున్నారు. మరోవైపు.. మరిన్ని స్థానాలకు కూడా వైసీపీ కసరత్తు ముమ్మరం చేసి.. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమిలో కూడా.. అభ్యర్థుల ఎంపికపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ప్రచారం కూడా ప్రారంభించేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు.
వాస్తవానికి మంగళవారం షెడ్యూల్ ప్రకారం.. చంద్రబాబు రా.. కదలిరా! సభలకు హాజరు కావాల్సి ఉంది. మొత్తం 22 పార్లమెంటు స్థానాల్లో సభలు నిర్వహించాలని భావించిన ఆయన.. ఇప్పటికి 17 నియోజకవ ర్గాల్లో పూర్తి చేశారు. ఈ నెల ఆఖరుకే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. అయోధ్య రామమందిర పర్యటన సహా.. ఇతరత్రా సమస్యలతో కొన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అభ్యర్థుల కసరత్తు కోసం.. మరోసారి రా..కదలిరా! సభలను వాయిదా వేసుకోవడం గమనార్హం.
దాదాపు మూడు రోజుల పాటు.. హైదరాబాద్లోనే ఉండనున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. జనసేన కీలక నేతలతో కలిసి ఆయన ఒక నిర్ణయానికి రానున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్తో భేటీ అయి.. తుది రూపు తీసుకువచ్చి.. వచ్చే 4-5 తారీకుల్లో తొలి జాబితాను వెల్లడించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రా..కదలిరా! సభలను అప్పటి వరకు వాయిదా వేశారు.
This post was last modified on January 30, 2024 10:06 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…