వైసీపీ ఎమ్మెల్యే.. ఫైర్బ్రాండ్ నాయకుడు చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి స్థానికుల నుంచి సెగ తగిలింది. నిజానికి ఆయనంటే.. నియోజకవర్గంలో పెద్దగా వ్యతిరేకత లేదు. అందరిలోనూ కలివిడిగా ఉంటారు. ఆర్భాటాలు, అట్టహాసాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా కలిసిపోతారు. కష్టాలు, సుఖాల్లో నేనున్నానంటూ.. ముందుకు వస్తారు. దీంతో చెవిరెడ్డి సామాన్యుల్లో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని పనులు పెద్ద సెగనే పెడుతున్నాయి. ప్రస్తుతం చంద్రగిరి టికెట్ను సీఎం జగన్ చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చారు.
ఆయన ఇంకా ప్రచారంలోకి దిగలేదు. పైగా నోటిఫికేషనే రాలేదు. అయితే.. ప్రజలను మాత్రం కలుస్తున్నారు. ఇది తప్పు కాదు. అయితే.. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. అధికారులపై పెత్తనం చేయడం.. కీలకమైన కార్యాలయాల్లో సీఎం జగన్ ఫొటో పక్కన మోహిత్ రెడ్డి ఫొటోను పెట్టడం.. అధికారులు కూడా ఆయన మాటలకే ప్రాధాన్యం ఇవ్వడం వంటివి వివాదంగా మారుతున్నాయి. గత రెండేళ్ల నుంచి కూడా మోహిత్కే టికెట్ అని చెవిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. తాను తప్పుకొంటానని చెబుతున్నారు. దీంతో మోహిత్ రెడ్డి దూకుడు సహజంగానే పెరిగింది. కానీ, ఇంతగా ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఆయన ఫొటోలు పెట్టే రేంజ్లో పెరుగుతుందని స్థానికులు ఊహించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా కొందరు మహిళలు, స్థానికులతో కలిసి.. సదరు ప్రభుత్వ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏ అధికారం ఉందని మోహిత్ రెడ్డి ఫొటో ఆఫీసులో పెట్టారని వారు ప్రశ్నించారు. ప్రతి విషయానికీ ఆయనను కలవాలని చెప్పడం ఏంటని నిలదీశారు. దీనిపై సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సదరు మహిళలకు సర్ది చెప్పేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ, వారు శాంతించక పోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం వరకు సమాచారం చేసింది. తర్వాత ఏం జరగిందో తెలియదు కానీ.. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్లిపోయారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం దీనినితీవ్రంగా తప్పుబడుతున్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అప్పుడే ఎమ్మెల్యే అయిపోయాడా? అంటూ సటైర్లు వేస్తున్నారు.
This post was last modified on January 30, 2024 9:54 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…