ప్రజా గాయకుడు, విప్లవమూర్తి గద్దర్కు నిలువెత్తు గౌరవం లభించింది. ఆయన నిలువెత్తు విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్బండ్పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఆ హామీని నిలెట్టుకోనున్నారు.
తాజాగా తెల్లాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానానికి హైదరాబాద్ మెట్రోడెవలప్ మెంట్ అధారిటీ ఓకే చెప్పింది. దీంతో ట్యాంక్బండ్ లేదా.. పరిసర ప్రాంతాల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని కేటాయించాలని ప్రభుత్వం రెవెన్యూ అదికారులను ఆదేశించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో గానే ఈ ప్రక్రియ పూర్తికానుందని తెలుస్తోంది. ఇదిలావుంటే, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ .. దీనికి ముందు కూడా.. గద్దర్.. ప్రజా సమస్యలపై పరిష్కారం పోరాట చేశారు.
విప్లవ పంథాను ఎంచుకుని కొన్నాళ్లు.. తర్వాత.. సాధారణ ఉద్యమ వాదిగా కడదాకా పోరాటం చేశారు. తన దైన బాణీలో పాటలు కట్టి గజ్జెకట్టి.. ప్రజల మనసుల్లో అభిమానం సంపాయించుకున్నాడు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆయన కాంగ్రెస్ పక్షాన నిలిచారు. తన కుమారుడు, లేదా కుమార్తెకు రాజకీయంగా ప్రాదాన్యం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు , రేవంత్కు కూడా చేరువయ్యారు. ఎన్నికలకు ముందుగానే గద్దర్ మరణించారు. అయితే.. ఆయనకు మాట ఇచ్చినట్టుగానే.. రేవంత్ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న గద్దర్ విగ్రహం ఏర్పాటు.. కాంగ్రెస్కు ప్లస్ అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వడం.. అదేవిధంగా ఆనాటి త్యాగాలకు ప్రాధాన్యం ఇస్తూ.. అమర వీరుల కుటుంబాలకు ప్రత్యేక సంక్షేమం అమలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గద్దర్కు విగ్రహం ఏర్పాటు ఎన్నికల్లో మేలు చేస్తుందని అంటున్నారు.
This post was last modified on January 30, 2024 10:03 pm
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…